
నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం మహిళల హత్యలు, వరకట్న చావులు, అత్యాచారాలు, అపహరణలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా గృహ హింస, వేధింపులు, ఆత్మహత్యలు తదితర అంశాల్లో గడచిన రెండు మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానానికి 'ఎదిగింది'. 2007 కంటే 2008లో మహిళలపై నేరాలు పెరిగాయి. 2009లో వరకట్న చావుల గ్రాఫ్ పైపైకి ఎగబాకింది. గత ఏడాది కంటే ఈ యేడాది ప్రథమార్థంలో మహిళలపై హింస, నేరాల్లో 10 శాతం పెరుగుదల నమోదయ్యింది.
మహిళలపై నేరాల సంఖ్య రాష్ట్రంలో రాజధాని నగరంలోనే అత్యధికంగా వుంది. జంట నగరాల తర్వాత నల్గొండ, వరంగల్, పశ్చిమ గోదావరి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు మహిళలపై నేరాలలో పేరుపోందాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒక ఆత్మహత్య చోటు చేసుకుంటుండగా భారతదేశంలో ఏటా లక్షమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మొత్తం ఆత్మహత్యల్లో 10 శాతం మనదేశంలోనే వుంటున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 24 శాతం స్వయం ఉపాధి రంగంలో వారు కాగా 21 శాతం మంది గృహిణులు. ఉద్యోగుల్లో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య కంటే నిరుద్యోగుల్లో ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య నాలుగు శాతం ఎక్కువ. మనదేశంలో గడచిన 10 సంవత్సరాలుగా ఆత్మహత్యలు 5 శాతం మేర పెరిగాయి.
No comments:
Post a Comment