Showing posts with label srinu vaitla. Show all posts
Showing posts with label srinu vaitla. Show all posts
Tuesday, September 30, 2014
Friday, September 26, 2014
Wednesday, November 27, 2013
Monday, June 4, 2012
పవన్కల్యాణ్ షో గబ్బర్సింగ్
"ఒన్మ్యాన్ షో 'గబ్బర్సింగ్'. పవన్కళ్యాణ్ కాకుండా మరొకర్ని 'గబ్బర్సింగ్'గా ఊహించలేను. అన్ని రికార్డుల్నీ క్రాస్చేసి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్వన్ సినిమా అయ్యింది'' అని చెప్పారు బండ్ల గణేశ్. పవన్కల్యాణ్ హీరోగా హరీశ్శంకర్ డైరెక్ట్ చేసిన 'గబ్బర్సింగ్'ను ఆయన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన సందర్భంగా తమ సంస్థ కార్యాలయంలో మాట్లాడారు గణేశ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
కల్యాణ్ దేనికీ ఎగ్జయిట్ అవరు. సినిమా చూశాక ఆయన నోటినుంచి వచ్చిన ఒకే మాట 'బాగుంది' అని. రికార్డుల గురించీ, కలెక్షన్ల గురించీ ఒక్కసారీ అడగలేదు. మానవ అనుబంధాలకీ, మోరల్స్కీ నిలబడే మనిషి కల్యాణ్. సినిమాలో 'రౌడీలతో అంత్యాక్షరి' ఎపిసోడ్ ఆలోచన కల్యాణ్ది. అది మినహాయిస్తే 'దబాంగ్'లో లేని సన్నివేశాలు కానీ, ఇతర మార్పులు కానీ అన్నీ హరీశ్వే. చాలా గొప్పగా చేశాడు. హరీశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'అతను చెప్పినట్లు తీస్తే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అన్నాడు మా అన్నయ్య శివబాబు. అది నిజమైంది. హరీశ్ స్క్రిప్టు తయారుచేసిన విధానం, అతని డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రుతీహాసన్ పాత్ర వంటివి కూడా ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి.
నా జీవితమే లేదు
'గబ్బర్సింగ్'ను తానే సొంతంగా నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత నాకివ్వడం నా అదృష్టం. పవన్కల్యాణ్ ఎప్పటికీ నాకు వ్యసనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు.
భయమేస్తోంది
నేనెవరికీ బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్నైట్ ప్రొడ్యూసర్ని అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్మార్'తో హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్సింగ్' హిట్తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం.
పెద్ద సినిమాలే చేస్తా
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా. నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా. నేను పవన్కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. కృష్ణానగర్లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్సింగ్' హిట్కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.
కల్యాణ్ దేనికీ ఎగ్జయిట్ అవరు. సినిమా చూశాక ఆయన నోటినుంచి వచ్చిన ఒకే మాట 'బాగుంది' అని. రికార్డుల గురించీ, కలెక్షన్ల గురించీ ఒక్కసారీ అడగలేదు. మానవ అనుబంధాలకీ, మోరల్స్కీ నిలబడే మనిషి కల్యాణ్. సినిమాలో 'రౌడీలతో అంత్యాక్షరి' ఎపిసోడ్ ఆలోచన కల్యాణ్ది. అది మినహాయిస్తే 'దబాంగ్'లో లేని సన్నివేశాలు కానీ, ఇతర మార్పులు కానీ అన్నీ హరీశ్వే. చాలా గొప్పగా చేశాడు. హరీశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు 'అతను చెప్పినట్లు తీస్తే ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది' అన్నాడు మా అన్నయ్య శివబాబు. అది నిజమైంది. హరీశ్ స్క్రిప్టు తయారుచేసిన విధానం, అతని డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రుతీహాసన్ పాత్ర వంటివి కూడా ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి.
నా జీవితమే లేదు
'గబ్బర్సింగ్'ను తానే సొంతంగా నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత నాకివ్వడం నా అదృష్టం. పవన్కల్యాణ్ ఎప్పటికీ నాకు వ్యసనమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు.
భయమేస్తోంది
నేనెవరికీ బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్నైట్ ప్రొడ్యూసర్ని అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్మార్'తో హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్సింగ్' హిట్తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం.
పెద్ద సినిమాలే చేస్తా
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా. నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా. నేను పవన్కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. కృష్ణానగర్లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్సింగ్' హిట్కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.
Wednesday, October 19, 2011
వేలానికి 'దూకుడు' దుస్తులు
శ్రీను వైట్ల రూపొందించిన 'దూకుడు' చిత్రంలోని క్లైమాక్స్ సాంగ్లో హీరో హీరోయిన్లు మహేశ్, సమంత ధరించిన ప్రత్యేక దుస్తుల్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ('మా') వేలానికి పెట్టింది. ఈ నెల 25లోగా ఎవరైతే ఎక్కువ ధరకి వేలం పాడతారో వారికి మహేశ్ చేతుల మీదుగా వాటిని అందజేస్తామని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. మంగళవారం నిర్మాతల మండలి హాలులో జరిగిన సమావేశంలో ఈ సంగతిని ఆయన ప్రకటించారు. "ఈమధ్య కాలంలో అనేక ఫెయిల్యూర్స్తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మహేశ్, శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' ఓ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఊపిరిపోసింది. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలోనూ గత రికార్డుల్ని బద్దలు కొడుతోంది. కలెక్షన్ల విషయంలో 'మగధీర'ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. రూ. 80 కోట్ల వసూళ్ల అంచనాల్ని దాటి రూ. వంద కోట్ల అంచనాలకి చేరుకోవడం సామాన్య విషయం కాదు. ఈ సినిమాతో మహేశ్ ఇమేజ్ ఎంతగా పెరిగిందంటే ఓ వెబ్సైట్ నిర్వహించిన పోల్లో ప్రపంచవ్యాప్తంగా 50 మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేశ్ వచ్చాడు. అదీ అతని ఘనత. శ్రీను వైట్ల హీరోలతో కామెడీ చేయిస్తే తిరుగుండదని 'దూకుడు' మరోసారి చెప్పింది. కేవలం కమెడియన్లతోటే కాకుండా హీరోలతోనూ కామెడీ చేయించి మెప్పిస్తుంటాడు. త్వరలో హిందీలోనూ 'దూకుడు'ను డైరెక్ట్ చేయబోతున్నాడు. అతను అక్కడా విజయఢంకా మోగించాలి. గతంలో కొన్ని సినిమాల వస్తువుల్ని వేలం వేసి పేద కళాకారుల కోసం వినియోగించాం. ఇప్పుడు 'దూకుడు'లో హీరో హీరోయిన్లు మహేశ్, సమంత ధరించిన కాస్ట్యూమ్స్ని వేలం వేస్తున్నాం'' అని చెప్పారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ "దూకుడు సినిమా ఎంతగా రికార్డు కలెక్షన్లని సాధిస్తున్నదో అందుకు తగ్గట్లుగా ఈ కాస్ట్యూమ్స్ని మహేశ్ అభిమానులు అధిక ధరకు సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నా. తద్వారా వారు ఓ మంచి పనికి ఉపయోగపడతారు. మేం కూడా ఊహించని స్థాయిలో 'దూకుడు' హిట్టయింది'' అని తెలిపారు.
శ్రీను వైట్ల తన సినిమాల్లో తెలుగు నటులకి అవకాశమివ్వాలని 'మా' సంయుక్త కార్యదర్శి మహర్షి సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టార్స్ డాట్ కామ్ శేఖర్, 'మా' సభ్యులు జయలక్ష్మి, మాణిక్ పాల్గొన్నారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ "దూకుడు సినిమా ఎంతగా రికార్డు కలెక్షన్లని సాధిస్తున్నదో అందుకు తగ్గట్లుగా ఈ కాస్ట్యూమ్స్ని మహేశ్ అభిమానులు అధిక ధరకు సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నా. తద్వారా వారు ఓ మంచి పనికి ఉపయోగపడతారు. మేం కూడా ఊహించని స్థాయిలో 'దూకుడు' హిట్టయింది'' అని తెలిపారు.
శ్రీను వైట్ల తన సినిమాల్లో తెలుగు నటులకి అవకాశమివ్వాలని 'మా' సంయుక్త కార్యదర్శి మహర్షి సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టార్స్ డాట్ కామ్ శేఖర్, 'మా' సభ్యులు జయలక్ష్మి, మాణిక్ పాల్గొన్నారు.
Saturday, October 15, 2011
బిగ్ స్టోరీ: హవా తగ్గిన పరభాషా దర్శకులు!
ఇంతకాలం తెలుగు సినిమాల్లో పరభాషా నాయికలు, పరభాషా విలన్లతో పాటు పరభాషా దర్శకుల హోరు ఎక్కువయ్యిందని వాపోతూ వచ్చాం. తెలుగు వాళ్లని పట్టించుకోవడం లేదని బెంగపడుతూ వచ్చాం. ఇప్పుడు ఆ బాధ దర్శకుల విషయంలో పడాల్సిన అవసరం లేదు. మళ్లీ మన దర్శకులకి రోజులొచ్చాయి. ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రం, సుకుమార్, సురేందర్రెడ్డి, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు రాణిస్తుండటంతో ఇతర భాషల నుంచి వచ్చే దర్శకుల తాకిడి ఇటీవల తగ్గింది. కొంత కాలం క్రితం తెలుగు దర్శకులపై కంటే ఇతర భాషా దర్శకులపైనే మన హీరోలు, నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నట్లు కనిపించింది. తమిళ కథలు, తమిళ దర్శకులే శరణ్యమన్నట్లు మన హీరోలు, నిర్మాతలు అప్పట్లో వ్యవహరించారు. ప్రస్తుతం టాప్ హీరోల్లో పవన్కల్యాణ్, ప్రభాస్ మాత్రమే తమిళ దర్శకులతో పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్తో విష్ణువర్థన్ 'పంజా' తీస్తుంటే, ప్రభాస్తో రాఘవ లారెన్స్ 'రెబల్' తీస్తున్నాడు.
ఇదివరలో తెలుగులో మంచి డిమాండ్ ఉన్న పి. వాసు, విక్రమన్, సురేశ్కృష్ణలను ఇప్పుడు తెలుగు హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. 'ఏ మాయ చేసావె' హిట్ తర్వాత కూడా గౌతం మీనన్ వెంట మన వాళ్లెవరూ పడటం లేదు. 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' హిట్ తర్వాత కూడా సెల్వరాఘవన్ మళ్లీ తెలుగు వైపు దృష్టిపెట్టలేదు. 'సత్యం'తో ధూంధాంగా తెలుగులోకి వచ్చిన మలయాళీ సూర్యకిరణ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 'ప్రియమైన నీకు', 'అమ్మాయి బాగుంది' సినిమాల దర్శకుడు బాలశేఖరన్ ఏమయ్యాడో తెలీదు. 'నాని', 'పులి' సినిమాల ఫెయిల్యూర్తో ఎస్.జె. సూర్య పత్తాలేకుండా పోయాడు. తెలుగులోనే దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తమిళుడైనా అతన్ని తెలుగువాడిగానే ట్రీట్ చేయాలి. తమిళం వైపు చూపు సారించకుండా తెలుగులోనే కెరీర్ వెదుక్కుంటున్న కరుణాకరన్కూ మినహాయింపు ఇవ్వొచ్చు.
ఓ వైపు హీరోయిన్లు, ఇంకోవైపు విలన్లు, సైడు విలన్లు, కేరక్టర్ ఆర్టిస్టులు, మరోవైపు రీమేక్లు తెలుగు సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే సృజనాత్మక రంగమైన దర్శకత్వం కూడా దిగుమతికి గురికావడం తెలుగు సినీరంగంలోని భావ దారిద్ర్యాన్ని పట్టిస్తున్నదని నిన్నటిదాకా బాధపడినవాళ్లు ఇప్పుడు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి స్థితిపై "తెలుగు సినిమా చూస్తే ఏమున్నది గర్వకారణం... సమస్తం పరభాషా వాసనమయం" అంటూ శ్రీశ్రీని అనుకరిస్తూ మాట్లాడిన కవులు ఇప్పుడు తెలుగు దర్శకులకి మంచి రోజులు రావడంతో ఖుషీ అవుతున్నారు.
తెరముందు నాయకుడు హీరో కావచ్చు. తెరవెనుక నాయకుడు (కెప్టెన్) మాత్రం దర్శకుడే. అటువంటి నాయకత్వ స్థానంలో మనవాళ్లని కాకుండా ఇతర భాషలవాళ్లకి పెద్దపీట వేయడం ఏమంత న్యాయం? 'ప్రతిభ ఎవరిలో ఉన్నా ప్రోత్సహించాలి. అందుకు భాషా భేదం అడ్డుకాకూడదు' అంటారు కొంతమంది. నిజమే. అయితే అది కొంతవరకే. ఒకరిద్దర్ని అలా తీసుకు రావడంలో తప్పులేదు. అయితే అదేపనిగా ఒకరి తర్వాత మరొకర్ని దిగుమతి చేసుకుంటూ పోతుంటే మన దర్శకులు ఏం కావాలి? మనవాళ్లు తీసే సినిమాలన్నీ ఫెయిలయ్యి, పరాయి దర్శకుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతుంటే.. సరేననుకోవచ్చు. అలా ఏమీ జరగడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతగా హీరోలు, నిర్మాతలు పర భాషా దర్శకులవైపు చూపు సారిస్తూ రావడం వల్లే వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల చేతుల్లో విజయాన్ని అందించే మంత్రదండమేదీ లేదని తెలియడంతో తిరిగి తెలుగు దర్శకులకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు మనకి మంచిదే.
ఇదివరలో తెలుగులో మంచి డిమాండ్ ఉన్న పి. వాసు, విక్రమన్, సురేశ్కృష్ణలను ఇప్పుడు తెలుగు హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. 'ఏ మాయ చేసావె' హిట్ తర్వాత కూడా గౌతం మీనన్ వెంట మన వాళ్లెవరూ పడటం లేదు. 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' హిట్ తర్వాత కూడా సెల్వరాఘవన్ మళ్లీ తెలుగు వైపు దృష్టిపెట్టలేదు. 'సత్యం'తో ధూంధాంగా తెలుగులోకి వచ్చిన మలయాళీ సూర్యకిరణ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 'ప్రియమైన నీకు', 'అమ్మాయి బాగుంది' సినిమాల దర్శకుడు బాలశేఖరన్ ఏమయ్యాడో తెలీదు. 'నాని', 'పులి' సినిమాల ఫెయిల్యూర్తో ఎస్.జె. సూర్య పత్తాలేకుండా పోయాడు. తెలుగులోనే దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తమిళుడైనా అతన్ని తెలుగువాడిగానే ట్రీట్ చేయాలి. తమిళం వైపు చూపు సారించకుండా తెలుగులోనే కెరీర్ వెదుక్కుంటున్న కరుణాకరన్కూ మినహాయింపు ఇవ్వొచ్చు.
ఓ వైపు హీరోయిన్లు, ఇంకోవైపు విలన్లు, సైడు విలన్లు, కేరక్టర్ ఆర్టిస్టులు, మరోవైపు రీమేక్లు తెలుగు సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే సృజనాత్మక రంగమైన దర్శకత్వం కూడా దిగుమతికి గురికావడం తెలుగు సినీరంగంలోని భావ దారిద్ర్యాన్ని పట్టిస్తున్నదని నిన్నటిదాకా బాధపడినవాళ్లు ఇప్పుడు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి స్థితిపై "తెలుగు సినిమా చూస్తే ఏమున్నది గర్వకారణం... సమస్తం పరభాషా వాసనమయం" అంటూ శ్రీశ్రీని అనుకరిస్తూ మాట్లాడిన కవులు ఇప్పుడు తెలుగు దర్శకులకి మంచి రోజులు రావడంతో ఖుషీ అవుతున్నారు.
తెరముందు నాయకుడు హీరో కావచ్చు. తెరవెనుక నాయకుడు (కెప్టెన్) మాత్రం దర్శకుడే. అటువంటి నాయకత్వ స్థానంలో మనవాళ్లని కాకుండా ఇతర భాషలవాళ్లకి పెద్దపీట వేయడం ఏమంత న్యాయం? 'ప్రతిభ ఎవరిలో ఉన్నా ప్రోత్సహించాలి. అందుకు భాషా భేదం అడ్డుకాకూడదు' అంటారు కొంతమంది. నిజమే. అయితే అది కొంతవరకే. ఒకరిద్దర్ని అలా తీసుకు రావడంలో తప్పులేదు. అయితే అదేపనిగా ఒకరి తర్వాత మరొకర్ని దిగుమతి చేసుకుంటూ పోతుంటే మన దర్శకులు ఏం కావాలి? మనవాళ్లు తీసే సినిమాలన్నీ ఫెయిలయ్యి, పరాయి దర్శకుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతుంటే.. సరేననుకోవచ్చు. అలా ఏమీ జరగడం లేదు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతగా హీరోలు, నిర్మాతలు పర భాషా దర్శకులవైపు చూపు సారిస్తూ రావడం వల్లే వాళ్ల హవా నడిచింది. ఇప్పుడు వాళ్ల చేతుల్లో విజయాన్ని అందించే మంత్రదండమేదీ లేదని తెలియడంతో తిరిగి తెలుగు దర్శకులకి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు మనకి మంచిదే.
Wednesday, October 12, 2011
ఇంటర్వ్యూ: మహేశ్
'దూకుడు'తో పోకిరి' ఇమేజ్ నుంచి బయటకొచ్చేశా
'దూకుడు' వల్ల జరిగిన మంచేమిటంటే, 'పోకిరి' ఇమేజ్ నుంచి బయటకు వచ్చేశాను - అని చెప్పారు మహేశ్. ఆయన హీరోగా నటించిన 'దూకుడు' చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేశ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
శ్రీను వైట్ల చెప్పినట్లు ఇది యూనివర్సల్ స్క్రిప్టు. ఇంతవరకు నా కెరీర్లో ఇంత కంప్లీట్ స్క్రిప్టు వినలేదు. విన్నప్పుడే చాలా ఆనందం వేసింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, సినిమా ఇంత పెద్ద హిట్టయినందుకు. నేను చేసిన కేరక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అందుకే ఐ లైక్ ద స్క్రిప్ట్. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ఉంది, అదే సమయంలో ఓ పోలీస్ యాంగిల్ ఉంది, పొలిటికల్ యాంగిల్ ఉంది.. ఇలా మూడు యాంగిల్స్ ఉన్న మంచి కేరక్టర్. ఎప్పుడూ ఇలాంటి పూర్తి స్థాయి భావోద్వేగాలున్న సినిమాలు చేయడం కష్టం. ఇలాంటి స్క్రిప్టులు చాలా అరుదుగా వస్తుంటాయి. 'దూకుడు' వల్ల జరిగిన మంచేమిటంటే, 'పోకిరి' ఇమేజ్ నుంచి బయటకు వచ్చేశాను. 'దూకుడు'కంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఇమేజ్ రాలేదు. ఎందుకంటే ఇది యూనివర్సల్ స్క్రిప్టు కావడం. అన్ని యాంగిల్స్ కవరయ్యాయి. 'పోకిరి' అనేది ఒక కేరక్టర్ బేస్ట్ సినిమా. ఇది అలా కాదు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని మాకందరికీ మొదట్నించీ చాలా నమ్మకంగా ఉండేది. ఆ నమ్మకంతోనే పనిచేశాం. ఫలితం సాధించాం.
నాన్న ఫోనే బెస్ట్ కాంప్లిమెంట్
నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాన్నగారు ఫోన్ చేయడమే. ఆ టైమ్లో నేనూ, శ్రీనూ ఒక్కచోటే ఉన్నాం. మార్నింగ్ షో చూసి ఫోన్ చేశారు. రూ. 80 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. నాకైతే ఆయన మాటలు వెంటనే జీర్ణం కాలేదు. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, 'దూకుడు' ఎంత ఇంపాక్ట్ కలిగిస్తున్నదో. అమెరికాలో తొలి రెండు, మూడు రోజుల కలెక్షన్ల ఫిగర్లు చూసి నేను నిజంగా నమ్మలేకపోయా. లాజ్ ఏంజిల్స్ టైమ్స్ ప్రత్యేక వ్యాసం రాయడం సెన్సేషనల్ న్యూస్. నా వరకు అమెరికా అనేది ఇంకో నైజాంలా అయిపోయింది.
ఒక్కటే సందేహం
శ్రీను స్క్రిప్టు చెప్పినప్పుడు ఒక్కటే సందేహం ఉండేది. 'పోకిరి'లో నేను పోలీస్ అనేది చివర్లోనే తెలుస్తుంది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్లోనే పోలీస్ అని చెప్పేస్తాం. అలా చెప్పి పోలీస్ కేరక్టర్ నడపడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఈ సందేహం నేను చెబితే అలాంటి డౌటేమీ పెట్టుకోవద్దనీ, మన సినిమా బ్లాక్బస్టర్ అని ఫిక్సయిపొమ్మని చెప్పారు శ్రీను. అదే జరిగింది. డైరెక్టర్తో కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాత్రలో ప్రవేశించాలంటే అది చాలా అవసరం. ఈ విషయంలో శ్రీనుగారు ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మీ.
ఎమ్మెల్యే రోల్ హైలైట్
ఎమ్మెల్యే కేరక్టర్ రిస్క్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. హైలైట్ అవుతుందనే అనుకున్నాం. 'ఆ గెటప్లో మిమ్మల్ని చూడాల'ని శ్రీనుగారు అన్నారు. దాన్నాయన హైలైట్గా ఫీలయ్యారు. అంతేకానీ రిస్కనేది మైండ్లో రాలేదు. అఫ్కోర్స్. మెళ్లో పులిగోరనేది చివరలో జత కలిసింది. తెలంగాణ యాసని ఓవర్బోర్డ్గా వెళ్లకుండా నీట్గా చేసుకు వెళ్లాం. అది పే చేసింది. అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతీకారం కథని వినోదాత్మకంగా చెప్పడం నాకు తెలిసి ఇదే తొలిసారి.
ప్రకాశ్రాజ్ పాత్ర ఇష్టం
నా పాత్ర కాకుండా ప్రకాశ్రాజ్ చేసిన పాత్ర బాగా ఇష్టం. శ్రీనుగారు చాలా బాగా దాన్ని డిజైన్ చేశారు. అది వెరీ స్పెషల్ కేరక్టర్. నిజ జీవితంలోనూ నేను మా నాన్నగారికి బాగా సన్నిహితం.
కామెడీని ఎంజాయ్ చేశా
బాంబేలో జగన్ చూసి ఇచ్చిన కాంప్లిమెంట్ మర్చిపోలేను. కామెడీ టైమింగ్ బాగుందనీ, కొన్ని సీన్లలో బ్రహ్మానందంగార్ని మించిపోయారనీ అన్నారు. అంతకంటే మంచి కాంప్లిమెంట్ వేరేముంటుంది. నిజంగానే సెకండాఫ్లో వచ్చిన కామెడీ సీన్స్ని బాగా ఎంజాయ్ చేశా. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ టెర్రిఫిక్ కామెడీ యాక్టర్లు. వాళ్లతో కలిసి చెయ్యడం చాలా సంతోషం.
స్క్రిప్టుకి ఇంప్రెస్సయ్యా
వచ్చే ఏడాది నావి మూడు సినిమాలు వచ్చే అవకాశముంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న 'బిజినెస్మ్యాన్' వచ్చే జనవరిలో వస్తుంది. ఇప్పటికే సగం సినిమా పూర్తయింది. 'దూకుడు'తో పోలిస్తే మరో భిన్నమైన పాత్ర. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'లో వెంకటేశ్గారు, నేను బ్రదర్స్గా చేస్తున్నాం. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్క్రిప్టుకి బాగా ఇంప్రెస్ అయ్యా. వెంకటేశ్గారు చాలా మంచి యాక్టర్. ఆయనతో సన్నిహితంగా ఉంటా. హిందీలో చేసేంత టైమ్ లేదు. నేను ప్రయోగాలు చెయ్యను. మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా.
న్యూస్: 'దూకుడు' 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న కృష్ణ!
మహేశ్ 'దూకుడు' ఓవరాల్గా రూ. 100 కోట్లని వసూలు చేస్తుందని జోస్యం చెప్పారు సీనియర్ సూపర్స్టార్ కృష్ణ. అక్టోబర్ 10 రాత్రి హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన సినిమా సక్సెస్మీట్లో సతీసమేతంగా పాల్గొన్న ఆయన 'దూకుడు' గురించి ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'దూకుడు' సినిమా ఇంత హిట్టవడానికి చాలా కారణాలున్నాయన్నారు. "ఈ సినిమా చూసే వాళ్లలో క్లాస్ ఆడియెన్స్ ఉంటారు, మాస్ ఆడియెన్స్ ఉంటారు, యూత్ ఉంటారు, ముఖ్యంగా పిల్లలుంటారు, లేడీస్ ఉంటారు. అన్ని రకాల ఆడియెన్స్కి నచ్చింది ఈ సినిమా. కాబట్టే ఇంత పెద్ద హిట్టయింది. ఇందులో మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. కెమెరా చాలా బాగుంది. ఎన్నో రికార్డులు బద్దలుకొట్టి విపరీతమైన కలెక్షన్లు ఇప్పటివరకు కలెక్ట్ చేసింది. ఇందులో ముఖ్యంగా పిక్చర్ మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఎండింగ్ వచ్చేవరకూ అందరి చేతా నవ్వించారు. సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాం. ఆర్టిస్టులంతా చాలా బాగా యాక్ట్ చేశారు. మహేశ్ అన్ని సినిమాల్లోకంటే ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాడు. చాలా బాగా చేశాడు. నాకు చాలా బాగా నచ్చిన చిత్రమిది. 'పోకిరి' సినిమా చూసిన వెంటనే అది 40 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పాను. 40 కోట్లూ కలెక్ట్ చేసింది ఆ సినిమా. 75 సంవత్సరాల రికార్డుల్ని బద్దలుకొట్టిన సినిమా 'పోకిరి'. ఇప్పుడు 'దూకుడు' మార్నింగ్ షో చూడగానే ఇంటికొచ్చి మహేశ్కి నేను ఫోన్చేశాను. అప్పుడు శ్రీను వైట్ల కూడా మహేశ్ పక్కనే ఉన్నాడు. ఆ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి 80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తుందని చెప్పాను. ఈ రోజున ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ, ఒరిస్సాలోనూ, నార్త్ ఇండియాలోనూ, విదేశాల్లో కూడా రికార్డులు బద్దలుకొట్టింది. నేననుకున్నట్లు 80 కోట్లు కాదు, 100 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేయబోతోంది. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రని తిరగరాయబోతోంది కలెక్షన్ల విషయంలో" అని ఆయన చెప్పారు.
Monday, October 3, 2011
బిగ్ స్టోరీ: అప్పుడు 'పోకిరి' పోలీస్! ఇప్పుడు 'దూకుడు' పొలీస్!!
ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఎప్పటిలా కొన్నే హిట్టయ్యాయి. ఆ సినిమాల నిర్మాతలను గట్టెక్కించాయి. అయితే ఏడాది మూడోవంతు పూర్తవుతున్నా టాలీవుడ్కు అతి పెద్ద హిట్టు రాలేదనే బాధ సినీ వర్గాల్లో వ్యక్తమవుతూ వచ్చింది. మరోవైపు బాలీవుడ్లో సల్మాన్ఖాన్ సినిమాలు 'దబాంగ్', 'బాడీగార్డ్', అజయ్ దేవగన్ సినిమా 'సింగమ్' సినిమాలు రూ. వంద కోట్ల పైగా వసూళ్లతో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల్నీ, డిస్ట్రిబ్యూటర్లనీ, ఎగ్జిబిటర్లనీ - అందర్నీ అమితానందపరుస్తూ వచ్చింది 'దూకుడు' చిత్రం. మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఈ చిత్రం తొలి వారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ పండితుల్ని సైతం ముక్కుమీద వేలేసుకునేట్లు చేసింది.
80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది అతిపెద్ద రికార్డు. ప్రపంచవ్యాప్తంగా 1600 పైగా థియేటర్లలో విడుదలైన 'దూకుడు' ప్రభంజనం ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాక, దేశంకాని దేశమైన అమెరికాలోనూ సంచలన విజయం నమోదు చేయడం గమనార్హం. తొలివారం అక్కడ రూ. 5 కోట్లకు పైగా షేర్ సాధించడం అమెరికన్ ట్రేడ్ విశ్లేషకుల్నీ విస్మయ పరిచింది. అక్కడ ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాని సైతం ప్రదర్శించని థియేటర్లలోనూ 'దూకుడు'ని ప్రదర్శించడం విశేషం. ఇక్కడ ఆసక్తికరమైన సంగతేమంటే మహేశ్ పోలీస్ పాత్రలు చేసిన రెండు సినిమాలూ వాటి కాలాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన సినిమాలు కావడం.
2006లో తొలిసారి ఆయన పోలీస్ కేరక్టర్ చేసిన 'పోకిరి' సినిమా కలెక్షన్లలో అంతకు ముందున్న బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసి రూ. 40 కోట్లకు పైగానే వసూలు చేసిన (అంచనా) తొలి తెలుగు సినిమాగా పేరు తెచ్చుకుంటే, ఐదేళ్ల తర్వాత మహేశ్ రెండోసారి 'పొలీస్' పాత్ర చేసిన 'దూకుడు' సైతం అంతకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పోకిరి'లో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణమనోహర్గా మహేశ్ ప్రదర్శించిన నటన అందర్నీ ఆకట్టుకుంది. అందులో ఆయన చెప్పిన కట్ డైలాగ్స్ అలరించాయి. ఓ చోట 'ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నార్రా నాన్నా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ బాగా పేలింది. తండ్రి (నాజర్)ని విలన్ ప్రకాశ్రాజ్ చంపినప్పుడు తొలిసారి పోలీసాఫీసర్ వేషంలో మహేశ్ వేగంగా పరుగెత్తుకుంటూ తండ్రి శవం వద్దకు వచ్చే సన్నివేశం సినిమాకే ఆయువుపట్టుగా నిలిచింది.
ఇప్పుడు 'దూకుడు'లో ఐపీఎస్ ఆఫీసర్ అజయ్కుమార్గా మహేశ్ నటన ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తున్నదో కలెక్షన్లే తెలియజేస్తున్నాయి. కోమా నుంచి బయటకు వచ్చిన తండ్రి (ప్రకాశ్రాజ్) ప్రాణానికి హాని ఉండటంతో ఆయన వద్ద ఎమ్మెల్యేగా నటిస్తూ, మరోవైపు ఆయనకు అలాంటి స్థితి కలగడానికి కారణమైన దుష్టుల్ని పోలీసాఫీసర్గా ఏరిపారేసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తున్నాయి. 'ఎవర్నువ్వు?' అని ఎవరైనా అడిగితే 'పో'లీస్ అని కాకుండా 'పొ'లీస్ అంటూ ఆయన సమాధానం చెప్పే తీరు జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇలా రెండు మార్లు పోలీస్ పాత్రలు చేసి, రెండు సార్లూ రికార్డు కలెక్షన్లు సాధించడంతో మహేశ్ అభిమానులు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో దీన్నో సెంటిమెంటుగా భావించి, రచయితలూ, దర్శకులూ ఈ తరహా పాత్రలతో ఆయన వద్దకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఆ పాత్రల్లో మొనాటనీ లేకుండా చూసుకోవడం మహేశ్ వంతు.
80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది అతిపెద్ద రికార్డు. ప్రపంచవ్యాప్తంగా 1600 పైగా థియేటర్లలో విడుదలైన 'దూకుడు' ప్రభంజనం ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాక, దేశంకాని దేశమైన అమెరికాలోనూ సంచలన విజయం నమోదు చేయడం గమనార్హం. తొలివారం అక్కడ రూ. 5 కోట్లకు పైగా షేర్ సాధించడం అమెరికన్ ట్రేడ్ విశ్లేషకుల్నీ విస్మయ పరిచింది. అక్కడ ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాని సైతం ప్రదర్శించని థియేటర్లలోనూ 'దూకుడు'ని ప్రదర్శించడం విశేషం. ఇక్కడ ఆసక్తికరమైన సంగతేమంటే మహేశ్ పోలీస్ పాత్రలు చేసిన రెండు సినిమాలూ వాటి కాలాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన సినిమాలు కావడం.
2006లో తొలిసారి ఆయన పోలీస్ కేరక్టర్ చేసిన 'పోకిరి' సినిమా కలెక్షన్లలో అంతకు ముందున్న బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసి రూ. 40 కోట్లకు పైగానే వసూలు చేసిన (అంచనా) తొలి తెలుగు సినిమాగా పేరు తెచ్చుకుంటే, ఐదేళ్ల తర్వాత మహేశ్ రెండోసారి 'పొలీస్' పాత్ర చేసిన 'దూకుడు' సైతం అంతకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పోకిరి'లో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణమనోహర్గా మహేశ్ ప్రదర్శించిన నటన అందర్నీ ఆకట్టుకుంది. అందులో ఆయన చెప్పిన కట్ డైలాగ్స్ అలరించాయి. ఓ చోట 'ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నార్రా నాన్నా' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ బాగా పేలింది. తండ్రి (నాజర్)ని విలన్ ప్రకాశ్రాజ్ చంపినప్పుడు తొలిసారి పోలీసాఫీసర్ వేషంలో మహేశ్ వేగంగా పరుగెత్తుకుంటూ తండ్రి శవం వద్దకు వచ్చే సన్నివేశం సినిమాకే ఆయువుపట్టుగా నిలిచింది.
ఇప్పుడు 'దూకుడు'లో ఐపీఎస్ ఆఫీసర్ అజయ్కుమార్గా మహేశ్ నటన ప్రేక్షకుల్ని ఎంతగా అలరిస్తున్నదో కలెక్షన్లే తెలియజేస్తున్నాయి. కోమా నుంచి బయటకు వచ్చిన తండ్రి (ప్రకాశ్రాజ్) ప్రాణానికి హాని ఉండటంతో ఆయన వద్ద ఎమ్మెల్యేగా నటిస్తూ, మరోవైపు ఆయనకు అలాంటి స్థితి కలగడానికి కారణమైన దుష్టుల్ని పోలీసాఫీసర్గా ఏరిపారేసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తున్నాయి. 'ఎవర్నువ్వు?' అని ఎవరైనా అడిగితే 'పో'లీస్ అని కాకుండా 'పొ'లీస్ అంటూ ఆయన సమాధానం చెప్పే తీరు జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇలా రెండు మార్లు పోలీస్ పాత్రలు చేసి, రెండు సార్లూ రికార్డు కలెక్షన్లు సాధించడంతో మహేశ్ అభిమానులు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో దీన్నో సెంటిమెంటుగా భావించి, రచయితలూ, దర్శకులూ ఈ తరహా పాత్రలతో ఆయన వద్దకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఆ పాత్రల్లో మొనాటనీ లేకుండా చూసుకోవడం మహేశ్ వంతు.
Saturday, October 1, 2011
న్యూస్: ఆల్టైం రికార్డ్ దిశగా 'దూకుడు'
టాలీవుడ్ చరిత్రలో ఆల్టైం రికార్డ్ దిశగా మహేశ్-శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' దూసుకుపోతోంది. తొలివారం కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 50.07 కోట్ల గ్రాస్, రూ. 35.01 కోట్ల షేర్ సాధించి దక్షిణ భారత రికార్డుని సాధించింది. ఈ విషయంలో రజినీకాంత్ 'రోబో'ని సైతం అది అధిగమించడం విశేషం. తొలివారం కలెక్షన్ల విషయంలో 80 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రని 'దూకుడు' తిరగరాసిందని ఆ చిత్ర నిర్మాతలు రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. విడుదలైన ప్రతి ఏరియాలోనూ 'దూకుడు' సినిమా ఆల్టైం రికార్డ్ సృష్టించిందని వారు చెప్పారు. నైజాం ఏరియాలో తొలివారం 'దూకుడు' 12.51 కోట్ల గ్రాస్, 8.52 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితుల్ని నివ్వెరపోయేట్లు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఈ సినిమా ఇలాంటి ఫీట్ సాధించడం అద్భుతమనే చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికాలో 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించడం అపూర్వం. అందుకే అక్కడి లాస్ ఏంజిల్స్ టైమ్స్, వెరైటీ లాంటి ప్రఖ్యాత పత్రికలు సైతం 'దూకుడు' విజయంపై ప్రత్యేక కథనాలు రాశాయి. మునుముందు ఈ సినిమా ఎన్ని రికార్డులు సాధిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు చిన్న చిన్న హిట్లతోనే సరిపెట్టుకుంటూ వచ్చిన టాలీవుడ్కి ఇదే తొలి అతి పెద్ద విజయం కావడం గమనార్హం.
Thursday, September 29, 2011
న్యూస్: 'దూకుడు'కు అమెరికన్ డైలీ ప్రశంసలు
ఓ భారతీయ చిత్రాన్ని అమెరికన్ పత్రికలు ప్రశంసించాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఓ తెలుగు సినిమాని అక్కడి పత్రికలు మెచ్చుకున్నాయంటే ఆశ్చర్యపడాల్సిందే. ఇప్పుడు మహేశ్-శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' అమెరికాలో సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం చూసి అమెరికన్ పత్రికలు సైతం విస్తుపోతున్నాయి. అక్కడి పేరుపొందిన పత్రికల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ - 'దూకుడు', ద బిగ్గెస్ట్ హిట్ యు హావ్ నెవర్ హార్డ్ ఆఫ్ - అంటూ ఓ వ్యాసాన్నే ప్రచురించడం అమెరికాలో తెలుగు సినిమాకి దక్కిన గుర్తింపు, గౌరవంగా భావించవచ్చు. ప్రస్తుతం హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్న 'మనీబాల్', 'అబ్డక్షన్స్', 'డాల్ఫిన్స్ టేల్స్'కు దీటుగా టాలీవుడ్కి చెందిన 'దూకుడు' సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఆ పత్రిక పేర్కొంది. ఇదివరకు అమెరికాలో ఓ తెలుగు సినిమా ('మగధీర') మూడు నెలల్లో 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం రికార్డు కాగా, ఇప్పుడు 'దూకుడు' చిత్రం కేవలం తొలి మూడు రోజుల్లోనే 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం అనూహ్యమని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
Saturday, September 24, 2011
న్యూస్: నిందని చెరిపేసుకున్న శ్రీను వైట్ల
పెద్ద హీరోతో హిట్లివ్వలేక పోతున్నాడనే అపవాదుని ఎత్తకేలకు 'దూకుడు'తో అధిగమించాడు శ్రీను వైట్ల. 'దూకుడు'కి ముందు అతను చిరంజీవితో 'అందరివాడు', నాగార్జునతో 'కింగ్', వెంకటేశ్తో 'నమో వెంకటేశ' సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. వీటిలో 'అందరివాడు' కేవలం కొందరివాడిగానే మిగలగా, 'కింగ్' పాక్షికంగానే టైటిల్ని జస్టిఫై చేయగలిగాడు. ఇక 'నమో వెంకటేశ' అయితే బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. పైగా ఈ సినిమాలో వెంకటేశ్ని మరీ జోకర్గా చూపించడం విమర్శలకి తావిచ్చింది కూడా. ఈ నేపథ్యంలో మహేశ్ వంటి సూపర్స్టార్తో సినిమా చేసే అవకాశం రావడంతో స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తపడ్డాడు శ్రీను. మహేశ్కి మాస్, క్లాస్ - రెండు వర్గాల్లో ఉన్న ఇమేజ్కి, తన స్టైల్ కామెడీ టచ్ ఇవ్వడంలో అతను తెలివిగా వ్యవహరించాడు. మహేశ్ అంటే ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాల్ని కోరుకుంటారు కాబట్టి అలాంటి సీన్లని పెడుతూనే, అతని కేరక్టర్లో వినోదాన్ని జోడించాడు. ఆఖరికి హీరోయిన్తో అతడి సన్నివేశాలు సైతం వినోదాన్ని అందించడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా తెలంగాణా యాసని విలన్లకే పెడుతుంటారనే తెలంగాణావాదుల విమర్శల్ని దృష్టిలో పెట్టుకున్నట్లుగా మహేశ్ చేత అనేక సందర్భాల్లో, ప్రత్యేకించి విలన్లతో ఢీకొనేప్పుడు అతడి చేత తెలంగాణా యాసలో మాట్లాడించాడు. ఆ డైలాగుల్ని చెప్పడంతో మహేశ్ 100% సక్సెసయ్యాడు. ఇలా తెలంగాణావాదుల్ని సైతం తన పాత్రతో ఇంప్రెస్ చేయగలిగాడు మహేశ్. సమకాలీన పాపులర్ అంశాల్ని కూడా తన స్క్రిప్టులో జోడించడంలో ముందుండే శ్రీను ఓ సన్నివేశంలో బ్రహ్మానందం పాత్రచేత చెప్పించే 'ఎస్ఎంఎస్' రిక్వెస్ట్ థియేటర్లలో ఎంతగా నవ్వులు పూయించిందీ చూడొచ్చు. అలాగే అతడికి 'పద్మశ్రీ' అనే పేరు పెట్టడంలోనూ ఆ అవార్డులు ఎలా వస్తున్నాయో చెప్పాడు. అయితే ఎం.ఆర్. వర్మ చేత ఎడిటింగ్ని మరింత సమర్థంగా అతడు చేయించి ఉండాల్సింది. అలా జరిగితే లెంగ్త్ సమస్య వచ్చి ఉండేది కాదు. ఏదేమైనా మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ని ఇవ్వడంతో పాటు, పెద్ద హీరోతో హిట్ ఇవ్వలేడనే అపవాదుని చెరిపేసుకోవడంలో సఫలమయ్యాడు శ్రీను.
న్యూస్: దున్నేస్తున్న 'దూకుడు'
విడుదలకు ముందే అనేక రికార్డుల్ని సొంతం చేసుకున్న మహేశ్ 'దూకుడు' టైటిల్కి పూర్తి న్యాయం చేకూరుస్తూ తొలిరోజు కలెక్షన్ల పరంగా టాలీవుడ్లో సరికొత్త రికార్డుని సృష్టించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ థియేటర్లలో విడుదలైన రికార్డుని సొంతం చేసుకున్న 'దూకుడుకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ప్రేక్షకుల స్పందన కూడా అనూహ్యంగానే ఉంది. తొలిరోజు 'మగధీర' రికార్డుల్ని 'దూకుడు' అధిగమించిందనేది ట్రేడ్ రిపోర్ట్. మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'పోకిరి' రికార్డుల్ని ఈ సినిమా మూడు నుంచి నాలుగు వారాల్లో అధిగమిస్తుందని అంచనాలు వేస్తున్నారు. జి. అజయ్కుమార్ ఐపియస్ పాత్రలో మహేశ్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉండటంతో కనీసం 15 నుంచి 20 నిమిషాల నిడివి తగ్గించాలని విమర్శకులు సూచిస్తున్నా ట్రెండ్ చూస్తుంటే లెంగ్త్ అనేది పెద్ద సమస్యగా కనిపించడంలేదు. 'పోకిరి' తర్వాత మహేశ్ సినిమాలు 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' ఆడకపోవడానికి ప్రధాన కారణం వాటిలో ఎంటర్టైన్మెంట్ లోపించడమేనని భావించిన శ్రీను వైట్ల, అతని రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ 'దూకుడు'ని హిలేరియస్ ఎంటర్టైన్మెంట్గా మలచడంలో విజయం సాధించారు. స్వతహాగా రచయిత కూడా అయిన శ్రీను వైట్ల ఇందులో అనేక పంచ్ డైలాగుల్ని స్వయంగా రాశాడు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ పాత్రలతో పాటు మహేశ్ సైతం కామెడీని పంచడంతో వినోదానికి కొదవ లేకుండా పోయింది. సినిమా ట్యాగ్లైన్ 'డేరింగ్ అండ్ డేషింగ్'కు తగ్గట్లు మహేశ్ కేరక్టర్ రూపొందింది. యాక్షన్ సీన్లలో అతని ఎనర్జీ మాస్ ఆడియెన్స్ని విపరీతంగా అలరిస్తోంది. ఆ పాత్రలో చెలరేగిన మహేశ్ సినిమానంతా తన భుజాల మీద మోశాడు. అతని డైలాగ్ డిక్షన్, మధ్య మధ్యలో హైదరాబాద్ హిందీలో, తెలంగాణ యాసలో మాట్లాడి బాగా ఆకట్టుకున్నాడు. ప్రకాశ్రాజ్, మహేశ్ మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఫలితంగా 2011లో తొలి సూపర్ డూపర్ హిట్కు మార్గం సుగమమైంది. 'దూకుడు' ఏ స్థాయి రికార్డుల్ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపికపట్టాలి.
Monday, September 5, 2011
ఇంటర్వ్యూ: గోపీమోహన్
'దూకుడు' సబ్జెక్ట్ ఎలా పుట్టింది?
'దూకుడు' సబ్జెక్టుకి పెద్ద కథే ఉంది. మహేశ్తో సినిమా చెయ్యాలనేది శ్రీను వైట్ల గారికి ఎప్పట్నించో ఉన్న కోరిక. 'ఖలేజా' షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేశ్ గారు పిలిచి "మీరు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టండి. నా తర్వాతి సినిమా మీతోనే" అన్నారు. అప్పటిదాకా ఆయన తర్వాతి సినిమా ఏదో క్లారిటీ లేదు. రెండు మూడు పేర్లు వినపడుతూ ఉన్నాయి. మహేశ్ ఎప్పుడైతే తర్వాతి సినిమా మీదే అన్నారో శ్రీను ఆ బాధ్యతని ఎలా ఫీలయ్యారంటే ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చెయ్యకూడదు. కథ పరంగా, అన్ని విషయాల పరంగా జాగ్రత్తగా ఉండాలి - అనే ఆలోచనతో స్పాన్ ఉన్న హీరో కాబట్టి 'మగధీర'లాగా గ్రాండియర్గా వెళ్దామా అనుకున్నారు. తర్వాత అది ఈయన శైలికి దూరంగా ఉండే సినిమా, అందులో ఎంటర్టైన్మెంట్కి అంటే కామెడీకి పెద్దగా స్కోప్ కనిపించడం లేదు, హెవీ బ్యాక్గ్రౌండ్స్ అసలు సూటవుతాయా అనుకుంటూ దాన్నుంచి డ్రాప్ అయ్యాం. తర్వాత ఓ లవ్స్టోరీ అనుకున్నాం. దాని మీద చాలా కాలం కూర్చున్నాం. మహేశ్కి లైన్ చెబితే ఆయనకి నచ్చింది. తాను కూడా పూర్తి స్థాయి లవ్స్టోరీని అంతదాకా చెయ్యలేదనీ, చెయ్యమనీ చెప్పారు. మా ఉద్దేశంలో 'ఆనందం' తర్వాత శ్రీను గారు మళ్లీ ఆ తరహా సినిమా చెయ్యలేదు అనేది మా ఫీలింగ్. మహేశ్కి అలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్స్టోరీని ఎంటర్టైన్మెంట్, కామెడీ పెట్టుకుని చేస్తే బాగుంటుందనుకుని మేం ప్లాన్ చేశాం. కానీ మహేశ్ అంటే యాక్షన్ కూడా కోరుకుంటున్నారు జనం. మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం పంచ్ ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల డిస్కషన్ల తర్వాత ఆ లవ్స్టోరీని పక్కనపెట్టి ఎంతో తర్జనభర్జన తర్వాత ఓ అద్భుతమైన లైన్ని సెట్ చేశాం. 'ఇది తప్పు చెయ్యదు. జనాలకి ఇది బాగా నచ్చే అవకాశం 100% ఉంది. దీంట్లో అన్ని రకాల అంశాలూ ఉన్నాయి' అనుకుని దీన్ని హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఈ ఆర్నెల్లూ శ్రమించాం.
మహేశ్కి ఎన్ని వెర్షన్స్ వినిపించారు?
నిజానికి మహేశ్ ఒక మనిషిని నమ్మిన తర్వాత - అది శ్రీను వైట్ల కానివ్వండి, గుణశేఖర్ కానివ్వండి, త్రివిక్రం కానివ్వండి - లైన్ ఓకే చెప్పాక ఆయన ఇంక జోక్యం చేసుకోరు. ప్రతి విషయాన్నీ అదెలా వచ్చిందీ, ఇదెలా వచ్చిందీ అని అడగరు. ఫుల్ ఫ్రీడం ఇచ్చేస్తారు. "నా కెరీర్లో 'ఒక్కడు', 'పోకిరి' సినిమాల రేంజిలో నిలబడే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చేసిన సినిమాలకు ఇలా చెప్పలేదు. మీరెంత చేసుకుంటే అంత ఈ సినిమా పొటెన్షియాలిటీ ఉంటుంది. మీ మార్క్ మిస్ కాకుండా చెయ్యండి" అన్నారు. దాంతో దాన్ని మేమే ఓ ఛాలెంజిగా తీసుకుని ఫస్టాఫ్ ఆరేడు వెర్షన్లు చేశాం. మహేశ్కి ఫైనల్ వెర్షన్ వినిపించాం. షూటింగుకి వెళ్తున్న దశలో ఆయనకి మొత్తం కథ చెప్పాం. ఆయన 'గో ఎ హెడ్' అన్నారు. అప్పట్నించి ఇప్పటివరకు ఆయన నుంచి పూర్తి సహకారం. ఆయనకి యాక్షన్ మీద మంచి కమాండ్ ఉంది. వాటి మీద ఆయన చిన్న చిన్నవే అయినా మంచి డౌట్స్ అడిగారు. ఆ మార్పులు కూడా బాగా జరిగాయి. అలాగే స్క్రీన్ప్లేలో రెండు మూడు చిన్న సూచనలు చేశారు. కన్ఫ్యూజన్కి తావులేకుండా అవి బాగా హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ తర్వాత చూసుకున్నాక వాటికి చాలా సంతోషపడ్డాం.
మహేశ్ కోసం ప్రత్యేకించి ఈ సబ్జెక్టులో ఏవైనా విశేషాల్ని ప్రవేశపెట్టారా?
మహేశ్బాబు అనగనే ప్రేక్షకులు క్లాస్, యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి ఆయన్ని కొంత మోతాదు తగ్గించి లోకల్గా చూపించారు 'పోకిరి'లో పూరి జగన్నాథ్ గారు. ఆ తర్వాత మేము బాగా లోకల్ టోన్ ఉన్న డైరెక్టర్ అండ్ రైటర్. మా స్క్రిప్ట్స్ అన్నిట్నీ మీరు గమనిస్తే మన ఇంటీరియర్ పీపుల్ హావభావాలకి దగ్గరగానే అవుతా ఉంటాం. ఈ సినిమాలోనూ అలాగే ఓపెన్ అయ్యి చూపిద్దాం అని ఫిక్సయి చేశాం.
మహేశ్ కేరక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది?
మహేశ్ క్యారెక్టరైజేషన్ మంచి యాటిట్యూడ్తో ఉంటుంది. ఆ యాటిట్యూడ్ సినిమాలో చాలా హైలైట్గా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన నిల్చునే స్టైల్ గానీ, ఆయన మాట్లాడే విధానం గానీ, ఆయన ఇగో ఫీలయ్యే విధానం గానీ, లేకపోతే ఆయన డైలాగ్ చెప్పే టోన్ గానీ ఇవన్నీ బయటివాళ్లు అనుకరించే స్థాయిలోనే ఉంటాయి.
'కింగ్'కి ఆర్నెల్లే టైం ఉండటం వల్ల కొన్ని తప్పులు సరిచేయలేకపోయామన్నారు. ఇప్పుడు 'దూకుడు'ని కూడా ఆర్నెల్లలోనే తీశారు...
కాదండీ. ఈ సినిమా వర్క్ మొదలై దాదాపు రెండేళ్లయ్యిందండీ. 'నమో వెంకటేశ' 2010 జనవరిలో రిలీజయ్యింది. అప్పట్నించీ మేం ఈ ప్రాజెక్టు మీదే స్ట్రగులవుతూ ఉన్నాం. సెకండాఫ్ మీదైతే ఏడెనిమిది నెలలు కూర్చున్నాం. షూటింగుకి వెళ్లేటప్పటికి ఫస్టాఫ్ పక్కాగా రెడీ అయ్యింది. సెకండాఫ్ మేమో వెర్షన్ అనుకుని చెప్పాం. కానీ మధ్యలో ఇండస్ట్రీ స్ట్రైక్ రావడం, అప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా కంటిన్యూగా సిట్టింగ్స్ వేస్తూ వచ్చాం.
సంభాషణల రచయితగా కోన వెంకట్ పాత్రేమిటి?
ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కాబట్టి ముందే ట్రీట్మెంట్ అనుకునేటప్పటికే 70% దాకా సంభాషణలు ఎలా ఉండాలనే దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. డైలాగులు ఎలా ఉండాలో డైరెక్టర్ గారే చెబుతారు. 'వెంకీ' నుంచి మా అన్ని సినిమాలకి కోన గారే మాటల రచయిత. మాటల విషయంలో ఆయనకీ, మాకూ బ్రహ్మాండంగా సింకవుతుంది. ఈ సినిమాలో అద్భుతమైన మాటలు రాశారు. ఈ మాటల్లో శ్రీను వైట్ల గారి భాగస్వామ్యం కూడా ఉంది.
పంచ్ డైలాగుల గురించి చెప్పండి..
ఫ్రాంకుగా చెప్పాలంటే కొన్ని డైలాగులు నాకు శ్రీను గారు చెప్పేటప్పుడు "ఈ డైలాగుల్లో ఇంత పంచ్ ఉందా?" అనిపించింది. ఉదాహరణకి "మైండులో ఫిక్సయితే బ్లైండుగా వెళ్లిపోతాను' అనేది. ఆయన 'ఇది చూడండి. భలే ఉంటుంది' అనేవారు. డబ్బింగ్ అయిపోయి ట్రైలర్ వదిలినప్పుడు దానికొచ్చిన రియాక్షన్ చూసి నేనే షాకయ్యా 'ఇంత రియాక్షన్ ఉంటుందా' అని. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి. ఆయన పర్టిక్యులర్గా ఫిక్సయి రాశారు. శ్రీను గారు చెబుతూ వచ్చారు - "ఇప్పటివరకు మనం సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాం. కామెడీ సీన్లలో తప్ప పవర్ఫుల్ డైలాగ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. ఈ సినిమా దానికి లాంచింగ్గా ఉండాలి. ఇక నుంచీ మనల్ని కూడా అలాంటి డైలాగ్స్ పెట్టమనేటట్లుండాలి" అని. ఇందులో డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్ సైడ్ వచ్చేసరికి శ్రీను వైట్ల తరహాలోనే ఉంటాయి. యాక్షన్, పవర్ఫుల్ సైడ్ వచ్చేసరికి మహేశ్ తరహాకి మేం వెళ్లాం. ఆయన కూడా అదే స్టైల్కి మలుచుకుని చెప్పారు. ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు.
మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెబుతారా?
బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు.
'నమో వెంకటేశ' దాకా మీ సినిమాలన్నీ ఓకే పేటర్న్లో ఉన్నాయనే పేరొచ్చింది. 'దూకుడు' ఎలా ఉండబోతోంది?
ఆ పేటర్న్ లేకపోతే జనాలు చూడరేమో అనే ఫీలింగ్ ఉంటుండేది. కానీ అదే చేసుకుంటూ పోతే మొనాటనీ ఫీలయ్యే అవకాశం ఉంది. మీరు గమనిస్తే మేం ఎక్కువగా ఇళ్లల్లోనే సినిమా చేసుకుంటూ వస్తున్నాం. దాని వల్ల ఓ గ్రూప్ మధ్య కథ సెటిలవుతుంది. మంచి కమెడీకి ఆస్కారం కలుగుతుంది. బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఈ పేటర్న్ని మరికొంత మంది కూడా ఫాలో అయ్యారు. ఇలా బోల్డన్ని సినిమాలు రావడంతో మేం కూడా రిపిటిషన్ చేసినట్లయ్యింది. అందుకే 'దూకుడు'కి పెద్ద స్పాన్ పెట్టుకున్నాం. టర్కీ లొకేషన్లకి వెళ్లాం. ఎమోషన్స్కి కూడా రకరకాలుగా డీల్ చేశాం. ఇదివరకు డీల్ చెయ్యని ఎమోషన్స్ని డీల్ చేశాం. ఇదివరకు ఏ సినిమాలో చెయ్యని రీతిలో ఇందులో శ్రీను హ్యూమన్ ఎమోషన్స్ని బాగా డీల్ చేశారు. ఓ పర్పస్ కోసం సినిమా జరుగుతుంటుంది. ఇదివరకు ఎందులోనూ లేని విధంగా ఇందులో ఆ పర్పస్ని చాలా స్ట్రాంగ్గా పెట్టాం. 'ఢీ', 'రెడీ'లో లవర్ కోసం చేసేదుంటుంది. ఇందులో లవర్ కోసమని కాకుండా స్ట్రాంగ్ హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. దసరా పండక్కి అందరూ ఎంజాయ్ చేసే రీతిలో 'దూకుడు' ఉంటుంది. 'రెడీ' తర్వాత అంత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. మొదట్నుంచీ చివరి దాకా మహేశ్ కేరక్టర్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మా సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేసే బ్రహ్మానందం గారికి 'ఢీ', 'రెడీ', 'కింగ్' కంటే మంచి కేరక్టర్ కుదిరింది. డెఫినెట్గా అది కొత్తగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఇందులోని పాత్ర పేరుతో పిలుస్తారు. బ్రహ్మానందం గారి లానే హాట్ ఫేవరేట్ ఎమ్మెస్ నారాయణ. మా ప్రతి సినిమాలో ఆయన ఓ సీను చేసినా అది పేలుతుంటుంది. ఇందులో ఆయన కేరక్టర్ని ఫుల్ ఫోకస్డ్గా రాశాం. ఆయన పాత్రకి థియేటర్లో వచ్చే రెస్పాన్స్ ఏమిటో మీరో చెప్పాలి. అంత బాగా ఎంజాయ్ చేస్తారు.
తమన్ చాయిస్ ఎవరిది?
శ్రీను గారిదే. తమన్ నిజానికి ఫ్రెండ్. నల్లమలుపు బుజ్జి దగ్గర నేను 'లక్ష్యం' చేస్తున్నప్పుడు తమన్ ఓ ఆల్బం తీసుకువచ్చి పరిచయమయ్యాడు. అప్పుడతను మణిశర్మ వద్ద కీబోర్డు ప్లేయర్గా పనిచేస్తున్నాడు. 'రెడీ' అప్పుడు నా ద్వారా శ్రీనుకి ఓ ఆల్బం వినిపించాడు. అతని రిదం తీరు, ఇన్స్ట్రుమెంటైజేషన్ చూసి శ్రీను చిన్న షాక్కు గురయ్యారు. డిఫినెట్గా ఎంకరేజ్ చేస్తాననీ, ట్యూన్స్ మంచిగా పట్టుకోమనీ చెప్పారు. ప్రస్తుతం తను దేవిశ్రీ ప్రసాద్తో చేస్తున్నాను కాబట్టి వీలు చేసుకుని అవకాశమిస్తానన్నారు. ఈలోగా తమన్ 'కిక్', 'బృందావనం' వంటి హిట్లతో లైంలైట్లోకి వచ్చాడు. 'నమో వెంకటేశ' పాటలు క్లిక్ కాకపోవడంతో దేవికి తను సరిగా చెప్పలేకపోతున్నానా లేక దేవి నాకు చెప్పలేకపోతున్నాడా అని ఫీలయ్యారు శ్రీను. దాంతో ఈసారి మారుద్దాం అనుకుని తమన్తో చేయించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
గుహన్ పనితనం గురించి చెప్పండి.
ఈ సినిమాకి గుహన్ చాలా ప్లస్సవుతారు. అది కచ్చితంగా చెప్పగలను. ఇదివరకు మా సినిమాల్లో ఎన్నడూ లేనిరీతిలో సినిమాటోగ్రఫీ ఇందులో గొప్పగా ఉండబోతోంది. లొకేషన్లు ఎక్కువ ఉండటం, సెట్లు వైబ్రంట్గా ఉండటం వల్ల సినిమాటోగ్రఫీకి పాత్ర ఎక్కువ. విజువల్స్ అదరగొట్టారు. 'ఇటు రాయే ఇటు రాయే' పాటలో మహేశ్ స్టెప్స్ విరగదేశాడు. అలాగే 'చుల్బులీ', టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటాయి.
ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అనుకున్నారు?
బడ్జెట్ మాకు సంబంధం లేని మేటర్. మహేశ్ సినిమాల్లో కాస్ట్లీ సినిమా. సాంగ్స్, ఫైట్లకి ఎక్కువ టైం తీసుకున్నాం. ఒక్కో సాంగ్ 8 నుంచి 10 రోజుల పాటు చేశాం. శ్రీను వైట్ల సినిమాల్లో ఫైట్స్ అంటే మాగ్జిమం నాలుగు రోజులు ఉంటుంది. పాట అంటే మూడు లేదా నాలుగు రోజులు. ఈ సినిమాలో అలా లెక్కలేమీ వేసుకోలేదు. బాగా రావాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ షాట్స్ చేశాం.
అసెస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు కదా. డైరెక్షన్ చేయబోతున్నారా?
ఇప్పుడు చాలామంది రైటర్లు డైరెక్టర్లుగా రాణిస్తారు. త్రివిక్రం, హరీశ్ శంకర్, వీరు పోట్ల సక్సెస్ అయ్యారు. రైటర్స్ డైరెక్టర్లు కావడానికి మంచి వాతావరణమే ఉంది. నేను కూడా వచ్చే యేడాది డైరెక్టర్ కాబోతున్నా. మళ్ల విజయప్రసాద్ గారికి సినిమా చేయబోతున్నా. 2012 మేలో అది మొదలు కావచ్చు. పెద్ద హీరోతోటే ఉంటుంది. ఆయన డేట్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోపల ఎన్టీఆర్, శ్రీను వైట్ల సినిమాకి పనిచేస్తా.
'దూకుడు' సబ్జెక్టుకి పెద్ద కథే ఉంది. మహేశ్తో సినిమా చెయ్యాలనేది శ్రీను వైట్ల గారికి ఎప్పట్నించో ఉన్న కోరిక. 'ఖలేజా' షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేశ్ గారు పిలిచి "మీరు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టండి. నా తర్వాతి సినిమా మీతోనే" అన్నారు. అప్పటిదాకా ఆయన తర్వాతి సినిమా ఏదో క్లారిటీ లేదు. రెండు మూడు పేర్లు వినపడుతూ ఉన్నాయి. మహేశ్ ఎప్పుడైతే తర్వాతి సినిమా మీదే అన్నారో శ్రీను ఆ బాధ్యతని ఎలా ఫీలయ్యారంటే ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చెయ్యకూడదు. కథ పరంగా, అన్ని విషయాల పరంగా జాగ్రత్తగా ఉండాలి - అనే ఆలోచనతో స్పాన్ ఉన్న హీరో కాబట్టి 'మగధీర'లాగా గ్రాండియర్గా వెళ్దామా అనుకున్నారు. తర్వాత అది ఈయన శైలికి దూరంగా ఉండే సినిమా, అందులో ఎంటర్టైన్మెంట్కి అంటే కామెడీకి పెద్దగా స్కోప్ కనిపించడం లేదు, హెవీ బ్యాక్గ్రౌండ్స్ అసలు సూటవుతాయా అనుకుంటూ దాన్నుంచి డ్రాప్ అయ్యాం. తర్వాత ఓ లవ్స్టోరీ అనుకున్నాం. దాని మీద చాలా కాలం కూర్చున్నాం. మహేశ్కి లైన్ చెబితే ఆయనకి నచ్చింది. తాను కూడా పూర్తి స్థాయి లవ్స్టోరీని అంతదాకా చెయ్యలేదనీ, చెయ్యమనీ చెప్పారు. మా ఉద్దేశంలో 'ఆనందం' తర్వాత శ్రీను గారు మళ్లీ ఆ తరహా సినిమా చెయ్యలేదు అనేది మా ఫీలింగ్. మహేశ్కి అలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్స్టోరీని ఎంటర్టైన్మెంట్, కామెడీ పెట్టుకుని చేస్తే బాగుంటుందనుకుని మేం ప్లాన్ చేశాం. కానీ మహేశ్ అంటే యాక్షన్ కూడా కోరుకుంటున్నారు జనం. మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం పంచ్ ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల డిస్కషన్ల తర్వాత ఆ లవ్స్టోరీని పక్కనపెట్టి ఎంతో తర్జనభర్జన తర్వాత ఓ అద్భుతమైన లైన్ని సెట్ చేశాం. 'ఇది తప్పు చెయ్యదు. జనాలకి ఇది బాగా నచ్చే అవకాశం 100% ఉంది. దీంట్లో అన్ని రకాల అంశాలూ ఉన్నాయి' అనుకుని దీన్ని హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఈ ఆర్నెల్లూ శ్రమించాం.
మహేశ్కి ఎన్ని వెర్షన్స్ వినిపించారు?
నిజానికి మహేశ్ ఒక మనిషిని నమ్మిన తర్వాత - అది శ్రీను వైట్ల కానివ్వండి, గుణశేఖర్ కానివ్వండి, త్రివిక్రం కానివ్వండి - లైన్ ఓకే చెప్పాక ఆయన ఇంక జోక్యం చేసుకోరు. ప్రతి విషయాన్నీ అదెలా వచ్చిందీ, ఇదెలా వచ్చిందీ అని అడగరు. ఫుల్ ఫ్రీడం ఇచ్చేస్తారు. "నా కెరీర్లో 'ఒక్కడు', 'పోకిరి' సినిమాల రేంజిలో నిలబడే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చేసిన సినిమాలకు ఇలా చెప్పలేదు. మీరెంత చేసుకుంటే అంత ఈ సినిమా పొటెన్షియాలిటీ ఉంటుంది. మీ మార్క్ మిస్ కాకుండా చెయ్యండి" అన్నారు. దాంతో దాన్ని మేమే ఓ ఛాలెంజిగా తీసుకుని ఫస్టాఫ్ ఆరేడు వెర్షన్లు చేశాం. మహేశ్కి ఫైనల్ వెర్షన్ వినిపించాం. షూటింగుకి వెళ్తున్న దశలో ఆయనకి మొత్తం కథ చెప్పాం. ఆయన 'గో ఎ హెడ్' అన్నారు. అప్పట్నించి ఇప్పటివరకు ఆయన నుంచి పూర్తి సహకారం. ఆయనకి యాక్షన్ మీద మంచి కమాండ్ ఉంది. వాటి మీద ఆయన చిన్న చిన్నవే అయినా మంచి డౌట్స్ అడిగారు. ఆ మార్పులు కూడా బాగా జరిగాయి. అలాగే స్క్రీన్ప్లేలో రెండు మూడు చిన్న సూచనలు చేశారు. కన్ఫ్యూజన్కి తావులేకుండా అవి బాగా హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ తర్వాత చూసుకున్నాక వాటికి చాలా సంతోషపడ్డాం.
మహేశ్ కోసం ప్రత్యేకించి ఈ సబ్జెక్టులో ఏవైనా విశేషాల్ని ప్రవేశపెట్టారా?
మహేశ్బాబు అనగనే ప్రేక్షకులు క్లాస్, యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి ఆయన్ని కొంత మోతాదు తగ్గించి లోకల్గా చూపించారు 'పోకిరి'లో పూరి జగన్నాథ్ గారు. ఆ తర్వాత మేము బాగా లోకల్ టోన్ ఉన్న డైరెక్టర్ అండ్ రైటర్. మా స్క్రిప్ట్స్ అన్నిట్నీ మీరు గమనిస్తే మన ఇంటీరియర్ పీపుల్ హావభావాలకి దగ్గరగానే అవుతా ఉంటాం. ఈ సినిమాలోనూ అలాగే ఓపెన్ అయ్యి చూపిద్దాం అని ఫిక్సయి చేశాం.
మహేశ్ కేరక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది?
మహేశ్ క్యారెక్టరైజేషన్ మంచి యాటిట్యూడ్తో ఉంటుంది. ఆ యాటిట్యూడ్ సినిమాలో చాలా హైలైట్గా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన నిల్చునే స్టైల్ గానీ, ఆయన మాట్లాడే విధానం గానీ, ఆయన ఇగో ఫీలయ్యే విధానం గానీ, లేకపోతే ఆయన డైలాగ్ చెప్పే టోన్ గానీ ఇవన్నీ బయటివాళ్లు అనుకరించే స్థాయిలోనే ఉంటాయి.
'కింగ్'కి ఆర్నెల్లే టైం ఉండటం వల్ల కొన్ని తప్పులు సరిచేయలేకపోయామన్నారు. ఇప్పుడు 'దూకుడు'ని కూడా ఆర్నెల్లలోనే తీశారు...
కాదండీ. ఈ సినిమా వర్క్ మొదలై దాదాపు రెండేళ్లయ్యిందండీ. 'నమో వెంకటేశ' 2010 జనవరిలో రిలీజయ్యింది. అప్పట్నించీ మేం ఈ ప్రాజెక్టు మీదే స్ట్రగులవుతూ ఉన్నాం. సెకండాఫ్ మీదైతే ఏడెనిమిది నెలలు కూర్చున్నాం. షూటింగుకి వెళ్లేటప్పటికి ఫస్టాఫ్ పక్కాగా రెడీ అయ్యింది. సెకండాఫ్ మేమో వెర్షన్ అనుకుని చెప్పాం. కానీ మధ్యలో ఇండస్ట్రీ స్ట్రైక్ రావడం, అప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా కంటిన్యూగా సిట్టింగ్స్ వేస్తూ వచ్చాం.
సంభాషణల రచయితగా కోన వెంకట్ పాత్రేమిటి?
ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కాబట్టి ముందే ట్రీట్మెంట్ అనుకునేటప్పటికే 70% దాకా సంభాషణలు ఎలా ఉండాలనే దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. డైలాగులు ఎలా ఉండాలో డైరెక్టర్ గారే చెబుతారు. 'వెంకీ' నుంచి మా అన్ని సినిమాలకి కోన గారే మాటల రచయిత. మాటల విషయంలో ఆయనకీ, మాకూ బ్రహ్మాండంగా సింకవుతుంది. ఈ సినిమాలో అద్భుతమైన మాటలు రాశారు. ఈ మాటల్లో శ్రీను వైట్ల గారి భాగస్వామ్యం కూడా ఉంది.
పంచ్ డైలాగుల గురించి చెప్పండి..
ఫ్రాంకుగా చెప్పాలంటే కొన్ని డైలాగులు నాకు శ్రీను గారు చెప్పేటప్పుడు "ఈ డైలాగుల్లో ఇంత పంచ్ ఉందా?" అనిపించింది. ఉదాహరణకి "మైండులో ఫిక్సయితే బ్లైండుగా వెళ్లిపోతాను' అనేది. ఆయన 'ఇది చూడండి. భలే ఉంటుంది' అనేవారు. డబ్బింగ్ అయిపోయి ట్రైలర్ వదిలినప్పుడు దానికొచ్చిన రియాక్షన్ చూసి నేనే షాకయ్యా 'ఇంత రియాక్షన్ ఉంటుందా' అని. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి. ఆయన పర్టిక్యులర్గా ఫిక్సయి రాశారు. శ్రీను గారు చెబుతూ వచ్చారు - "ఇప్పటివరకు మనం సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాం. కామెడీ సీన్లలో తప్ప పవర్ఫుల్ డైలాగ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. ఈ సినిమా దానికి లాంచింగ్గా ఉండాలి. ఇక నుంచీ మనల్ని కూడా అలాంటి డైలాగ్స్ పెట్టమనేటట్లుండాలి" అని. ఇందులో డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్ సైడ్ వచ్చేసరికి శ్రీను వైట్ల తరహాలోనే ఉంటాయి. యాక్షన్, పవర్ఫుల్ సైడ్ వచ్చేసరికి మహేశ్ తరహాకి మేం వెళ్లాం. ఆయన కూడా అదే స్టైల్కి మలుచుకుని చెప్పారు. ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు.
మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెబుతారా?
బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు.
'నమో వెంకటేశ' దాకా మీ సినిమాలన్నీ ఓకే పేటర్న్లో ఉన్నాయనే పేరొచ్చింది. 'దూకుడు' ఎలా ఉండబోతోంది?
ఆ పేటర్న్ లేకపోతే జనాలు చూడరేమో అనే ఫీలింగ్ ఉంటుండేది. కానీ అదే చేసుకుంటూ పోతే మొనాటనీ ఫీలయ్యే అవకాశం ఉంది. మీరు గమనిస్తే మేం ఎక్కువగా ఇళ్లల్లోనే సినిమా చేసుకుంటూ వస్తున్నాం. దాని వల్ల ఓ గ్రూప్ మధ్య కథ సెటిలవుతుంది. మంచి కమెడీకి ఆస్కారం కలుగుతుంది. బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఈ పేటర్న్ని మరికొంత మంది కూడా ఫాలో అయ్యారు. ఇలా బోల్డన్ని సినిమాలు రావడంతో మేం కూడా రిపిటిషన్ చేసినట్లయ్యింది. అందుకే 'దూకుడు'కి పెద్ద స్పాన్ పెట్టుకున్నాం. టర్కీ లొకేషన్లకి వెళ్లాం. ఎమోషన్స్కి కూడా రకరకాలుగా డీల్ చేశాం. ఇదివరకు డీల్ చెయ్యని ఎమోషన్స్ని డీల్ చేశాం. ఇదివరకు ఏ సినిమాలో చెయ్యని రీతిలో ఇందులో శ్రీను హ్యూమన్ ఎమోషన్స్ని బాగా డీల్ చేశారు. ఓ పర్పస్ కోసం సినిమా జరుగుతుంటుంది. ఇదివరకు ఎందులోనూ లేని విధంగా ఇందులో ఆ పర్పస్ని చాలా స్ట్రాంగ్గా పెట్టాం. 'ఢీ', 'రెడీ'లో లవర్ కోసం చేసేదుంటుంది. ఇందులో లవర్ కోసమని కాకుండా స్ట్రాంగ్ హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. దసరా పండక్కి అందరూ ఎంజాయ్ చేసే రీతిలో 'దూకుడు' ఉంటుంది. 'రెడీ' తర్వాత అంత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. మొదట్నుంచీ చివరి దాకా మహేశ్ కేరక్టర్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మా సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేసే బ్రహ్మానందం గారికి 'ఢీ', 'రెడీ', 'కింగ్' కంటే మంచి కేరక్టర్ కుదిరింది. డెఫినెట్గా అది కొత్తగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఇందులోని పాత్ర పేరుతో పిలుస్తారు. బ్రహ్మానందం గారి లానే హాట్ ఫేవరేట్ ఎమ్మెస్ నారాయణ. మా ప్రతి సినిమాలో ఆయన ఓ సీను చేసినా అది పేలుతుంటుంది. ఇందులో ఆయన కేరక్టర్ని ఫుల్ ఫోకస్డ్గా రాశాం. ఆయన పాత్రకి థియేటర్లో వచ్చే రెస్పాన్స్ ఏమిటో మీరో చెప్పాలి. అంత బాగా ఎంజాయ్ చేస్తారు.
తమన్ చాయిస్ ఎవరిది?
శ్రీను గారిదే. తమన్ నిజానికి ఫ్రెండ్. నల్లమలుపు బుజ్జి దగ్గర నేను 'లక్ష్యం' చేస్తున్నప్పుడు తమన్ ఓ ఆల్బం తీసుకువచ్చి పరిచయమయ్యాడు. అప్పుడతను మణిశర్మ వద్ద కీబోర్డు ప్లేయర్గా పనిచేస్తున్నాడు. 'రెడీ' అప్పుడు నా ద్వారా శ్రీనుకి ఓ ఆల్బం వినిపించాడు. అతని రిదం తీరు, ఇన్స్ట్రుమెంటైజేషన్ చూసి శ్రీను చిన్న షాక్కు గురయ్యారు. డిఫినెట్గా ఎంకరేజ్ చేస్తాననీ, ట్యూన్స్ మంచిగా పట్టుకోమనీ చెప్పారు. ప్రస్తుతం తను దేవిశ్రీ ప్రసాద్తో చేస్తున్నాను కాబట్టి వీలు చేసుకుని అవకాశమిస్తానన్నారు. ఈలోగా తమన్ 'కిక్', 'బృందావనం' వంటి హిట్లతో లైంలైట్లోకి వచ్చాడు. 'నమో వెంకటేశ' పాటలు క్లిక్ కాకపోవడంతో దేవికి తను సరిగా చెప్పలేకపోతున్నానా లేక దేవి నాకు చెప్పలేకపోతున్నాడా అని ఫీలయ్యారు శ్రీను. దాంతో ఈసారి మారుద్దాం అనుకుని తమన్తో చేయించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
గుహన్ పనితనం గురించి చెప్పండి.
ఈ సినిమాకి గుహన్ చాలా ప్లస్సవుతారు. అది కచ్చితంగా చెప్పగలను. ఇదివరకు మా సినిమాల్లో ఎన్నడూ లేనిరీతిలో సినిమాటోగ్రఫీ ఇందులో గొప్పగా ఉండబోతోంది. లొకేషన్లు ఎక్కువ ఉండటం, సెట్లు వైబ్రంట్గా ఉండటం వల్ల సినిమాటోగ్రఫీకి పాత్ర ఎక్కువ. విజువల్స్ అదరగొట్టారు. 'ఇటు రాయే ఇటు రాయే' పాటలో మహేశ్ స్టెప్స్ విరగదేశాడు. అలాగే 'చుల్బులీ', టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటాయి.
ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అనుకున్నారు?
బడ్జెట్ మాకు సంబంధం లేని మేటర్. మహేశ్ సినిమాల్లో కాస్ట్లీ సినిమా. సాంగ్స్, ఫైట్లకి ఎక్కువ టైం తీసుకున్నాం. ఒక్కో సాంగ్ 8 నుంచి 10 రోజుల పాటు చేశాం. శ్రీను వైట్ల సినిమాల్లో ఫైట్స్ అంటే మాగ్జిమం నాలుగు రోజులు ఉంటుంది. పాట అంటే మూడు లేదా నాలుగు రోజులు. ఈ సినిమాలో అలా లెక్కలేమీ వేసుకోలేదు. బాగా రావాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ షాట్స్ చేశాం.
అసెస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు కదా. డైరెక్షన్ చేయబోతున్నారా?
ఇప్పుడు చాలామంది రైటర్లు డైరెక్టర్లుగా రాణిస్తారు. త్రివిక్రం, హరీశ్ శంకర్, వీరు పోట్ల సక్సెస్ అయ్యారు. రైటర్స్ డైరెక్టర్లు కావడానికి మంచి వాతావరణమే ఉంది. నేను కూడా వచ్చే యేడాది డైరెక్టర్ కాబోతున్నా. మళ్ల విజయప్రసాద్ గారికి సినిమా చేయబోతున్నా. 2012 మేలో అది మొదలు కావచ్చు. పెద్ద హీరోతోటే ఉంటుంది. ఆయన డేట్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోపల ఎన్టీఆర్, శ్రీను వైట్ల సినిమాకి పనిచేస్తా.
Friday, August 26, 2011
న్యూస్: మహా 'దూకుడు'మీదున్న పాటలు
మహేశ్ సినిమా 'దూకుడు' పాటలు అదరగొడుతున్నాయ్. శ్రీను వైట్ల డైరెక్షన్లో తయారైన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. మహేశ్ సినిమాకి అతను పనిచేయడం ఇదే తొలిసారి. ఆగస్ట్ 18న అఫిషియల్గా విడుదలైన ఆడియో అప్పుడు మ్యూజిక్ చార్టుల్లో ముందుకు దూసుకుపోతోంది. ఇందులోని ఆరు పాటల్లో నాలుగు పాటల్ని రామజోగయ్యశాస్త్రి రాయగా, ఓ పాటని విశ్వా, ఇంకో పాటని భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ముఖ్యంగా భాస్కరభట్ల రాయగా రంజిత్, దివ్య ఆలపించిన 'ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే' పాట శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. 'దూకుడు' ఆల్బంలో ఇదే నెంబర్ వన్ సాంగ్. ఈ పాటలో దివ్య గొంతులోంచి వచ్చిన 'దేత్తడి దేత్తడి' అనే మాటలు అలరిస్తున్నాయి. దీని తర్వాతి స్థానం టైటిల్ సాంగ్ది. "నీ దూకుడూ కాదెవ్వడూ' అంటూ సాగే ఈ పాటని విశ్వా రాయగా శంకర్ మహదేవన్ ఆలపించాడు. మిగతా పాటల్లో రాహుల్ నంబియార్ పాడిన సోలో సాంగ్ 'గురువారం మార్చి ఒకటీ', కార్తీక్, రీటా పాడిన డ్యూయెట్ 'చుల్బులీ నా చుల్బులీ', కార్తీక్, రామజోగయ్యశాస్త్రి, వర్ధని కలిసి పాడిన 'అదర అదరగొట్టు' పాట బాగున్నాయి. ఎన్.ఎస్. రమ్య, నవీన్ మాధవ్ పాడిన 'పువ్వాం పువ్వాం అంటాడు ఆటో అప్పారావు' పాట ఏమంత ఆకట్టుకునే రీతిలో లేదు. ఆల్బంలో ఇదొక్కటే వీక్ సాంగ్. ఇప్పటివరకు ఒకే రకంగా ట్యూన్స్ ఇస్తూ వస్తున్న తమన్ ఇందులోనూ అదే బాణీని అనుసరించాడు. 'ఇటు రాయే ఇటు రాయే', టైటిల్ సాంగ్ ఇందుకు ఉదాహరణలు. ఏదేమైనా పాటలు హిట్టవడంతో ఇక సినిమా రావడమే తరువాయి. 'పోకిరి' తర్వాత తమ హీరోకి సరైన హిట్టులేకపోవడంతో మహేశ్ ఫాన్స్ యమ ఆకలి మీదున్నారు. సినిమా ఏమాత్రం బాగున్నా పెద్ద హిట్టవడం ఖాయం.
Wednesday, August 24, 2011
న్యూస్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్!
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2012 ఏప్రిల్ నుంచి ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్ అంతకంటే ముందు శ్రీను వైట్ల డైరెక్షన్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ కలవడం ఇదే తొలిసారి. ఎన్టీఅర్, పూరి కాంబినేషన్ సినిమాని నిర్మించే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ సినిమానీ నిర్మించబోతున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి'తో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. "బోయపాటి డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమా తర్వాత నేను చేసేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే. అతను చెప్పిన కథ ఇన్స్పైరింగ్గా ఉంది. మా ఫస్ట్ కాంబినేషన్ ద బెస్ట్ అనిపించుకునేలా మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తయారవుతుంది" అని ఎన్టీఆర్ తెలిపాడు.
మరోవైపు మహేశ్ హీరోగా తను రూపొందిస్తున్న 'దూకుడు' తర్వాత తను డైరెక్ట్ చేసేంది ఎన్టీఆర్నేనని శ్రీను వైట్ల తెలిపాడు. 'అతడు', 'దూకుడు' సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ ఈ సినిమాకీ పని చేయబోతున్నాడు. మొత్తానికి మంచి మంచి కాంబినేషన్స్ పట్టుకుంటూ నిర్మాత బండ్ల గణేశ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి'తో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. "బోయపాటి డైరెక్షన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమా తర్వాత నేను చేసేది శ్రీను వైట్ల దర్శకత్వంలోనే. అతను చెప్పిన కథ ఇన్స్పైరింగ్గా ఉంది. మా ఫస్ట్ కాంబినేషన్ ద బెస్ట్ అనిపించుకునేలా మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తయారవుతుంది" అని ఎన్టీఆర్ తెలిపాడు.
మరోవైపు మహేశ్ హీరోగా తను రూపొందిస్తున్న 'దూకుడు' తర్వాత తను డైరెక్ట్ చేసేంది ఎన్టీఆర్నేనని శ్రీను వైట్ల తెలిపాడు. 'అతడు', 'దూకుడు' సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ ఈ సినిమాకీ పని చేయబోతున్నాడు. మొత్తానికి మంచి మంచి కాంబినేషన్స్ పట్టుకుంటూ నిర్మాత బండ్ల గణేశ్ వార్తల్లో వ్యక్తిగా మారాడు.
Friday, August 19, 2011
న్యూస్: 'దూకుడు'తో తేలనున్న శ్రీను వైట్ల సత్తా!
మహేశ్ హీరోగా నటిస్తున్న 'దూకుడు'తో శ్రీను వైట్ల అసలు సత్తా ఏమిటో తేలిపోతుందని ఫిలింనగర్ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. డైరెక్ట్ చేసిన 11 సినిమాల్లో ('దూకుడు' 12వ సినిమా) 6 హిట్లున్న శ్రీనుకి మునుపటి సినిమా 'నమో వెంకటేశ' నిరాశని కలిగించింది. వెంకటేశ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో వెంకటేశ్ పాత్రని శ్రీను తీర్చిదిద్దిన విధానం విమర్శలకి తావిచ్చింది. వెంకటేశ్ ఈ సినిమాలో బ్రహ్మానందం కేరక్టెర్ని మించి జోకర్గా కనిపించిందని చాలామంది విమర్శించారు. అయితే ఈ విమర్శలేవీ అతనితో మహేశ్ పనిచేయడాన్ని ఆపలేకపోయాయి. ఎందుకంటే 'ఢీ' నుంచి 'కింగ్' దాకా వరుసగా శ్రీను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం. యాక్షన్కి అతను జోడించే వినోదం ఇప్పటివరకూ సత్ఫలితాల్నే ఎక్కువగా ఇస్తూ వచ్చింది. అందుకే అతని డైరెక్షన్లో చేయాలని మహేశ్ భావించాడు. అలా 'దూకుడు' సినిమా రూపుదాల్చింది. శ్రీనుతో 'నమో వెంకటేశ'ని తీసిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థే ఈ సినిమానీ నిర్మిస్తోంది. విడుదలైన పాటలకి రెస్పాన్స్ మాత్రం అదిరింది. కొట్టిన ట్యూన్లే కొట్టే తమన్ ఈసారి కొన్ని డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చాడు. రామజోగయ్యశాస్త్రి, విశ్వా రాసిన పాటలు బాగున్నాయి. ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్నే సంగీత దర్శకుడిగా తీసుకుంటూ వస్తున్న శ్రీను 'దూకుడు'తో తొలిసారి తమన్తో పనిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మహా 'దూకుడు' మీదున్న తమన్ టైటిల్కి న్యాయం చేశాడు. కాగా 'దూకుడు' ప్రోమోస్లో మహేశ్ చాలా బాగున్నాడనే పేరు వచ్చింది. ఇక సినిమాలో అతణ్ణి శ్రీను ఎలా చూపించాడు, దానికంటే కూడా సబ్జెక్ట్ ఎలా చేశాడు, స్క్రీన్ప్లేని ఎలా అల్లాడు.. అనే అంశాల మీదే ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనేది ఆధారపడి ఉంది. 'నమో వెంకటేశ' రిజల్ట్తో 'దూకుడు'ని అతడు కసిగా తీశాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 'దూకుడు' తర్వాత శ్రీను టాప్ డైరెక్టర్గా మరింత డిమాండ్ పొందుతాడో, లేదో చూడాల్సిందే.
Thursday, July 21, 2011
న్యూస్: మహేశ్లో 'దూకుడు' ఏదీ?
టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇద్దరు టాప్ హీరోల్లో ఒకడైన మహేశ్ 'దూకుడు' ఎప్పుడు విడుదలవుతుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. టైటిల్ చూస్తేనేమో 'దూకుడు'. కానీ ఆ సినిమా షూటింగ్ కానీ, మహేశ్ కెరీర్ కానీ దూకుడు మీద కనిపించడం లేదు. ఏడాది క్రితమే అంటే 2010 జూన్లోనే 'దూకుడు' లాంఛనంగా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ని 2010 సెప్టెంబర్ నుంచి జరుపుతున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల కెరీర్లో 'ఢీ' తర్వాత అంత టైం తీసుకుంటున్న సినిమా ఇదే. నిజానికి 'ఢీ' ప్రొడక్షన్ ఆలస్యం కావడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం. 'దూకుడు'కు ఆ ఇబ్బందులేమీ లేవు. 16 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్పై తయారవుతున్న ఈ సినిమా నిర్మాణం దూకుడుగా సాగక పోవడానికి మహేశే కారణమంటున్నారు. ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్గా పనిచేస్తున్న మహేశ్ వాటి షూటింగులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడని ఇటీవలి కాలంలో విమర్శలు వస్తున్నాయి. వాటిపై వచ్చే ఆదాయం అధికంగా ఉండటం వల్లే ఆయా బ్రాండ్ల మోడల్గా పని చేయడానికి అతణ్ణి పురిగొలుపుతున్నదని తెలుస్తోంది. ఇవాళ టాలీవుడ్లో నెంబర్వన్ బ్రాండ్ అంబాసిడర్ కూడా అతనే. దీంతో 'దూకుడు' నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. స్పీడుగా షూటింగ్ జరుపుతాడని పేరున్న శ్రీను వైట్ల కూడా దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డాడు. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ సమంతా నటిస్తోంది. వేసవికే రావాల్సిన ఈ సినిమాని మహేశ్ పుట్టిన రోజు (ఆగస్ట్ 9) సందర్భంగా ఆ వారంలో అంటే ఆగస్టు 11న విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తర్వాత ఆగస్టు నెలాఖరున వస్తుందని చెప్పారు. అప్పటికైనా 'దూకుడు' రిలీజవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికి సినిమా 75 శాతమే అయ్యిందనీ, సినిమా పూర్తవడానికి కనీసం ఇంకో నెలన్నా పడుతుందనీ వినిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఆగస్టులో ఈ సినిమా విడుదలయ్యేట్లు కనిపించడం లేదు. అందువల్ల ఈ సినిమాకి 'దూకుడు' అని కాకుండా 'నెమ్మది' అని పెడితే బాగుంటుందని ఫిలింనగర్ వర్గాలు హాస్యమాడుతున్నాయి.
Sunday, November 14, 2010
సినిమా: 'రెడీ' తర్వాత రాం ఎక్కడ?
'రెడీ' తర్వాత రాంకి ఇంతదాకా హిట్టులేదు. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసిన అతడికి దక్కింది రెండు హిట్లే. వాటిలో ఒకటి తొలి సినిమా 'దేవదాసు' అయితే, ఇంకోటి శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'రెడీ'. ఈ రెంటి మధ్యలో వచ్చిన 'జగడం'తో పాటు 'రెడీ' తర్వాత వచ్చిన 'మస్కా', 'గణేష్', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాలు ఫ్లాపయ్యాయి. ఈ ఫ్లాపయిన సినిమాలన్నీ పేరుపొందిన వాళ్లు తీసినవే కావడం గమనించాలి.
'జగడం'ని డైరెక్ట్ చేసింది 'ఆర్య' ఫేం సుకుమార్. 'మస్కా'ని నిర్మింది ఎమ్మెస్ రాజు అయితే, డైరెక్త్ చేసింది బి. గోపాల్. 'గణేష్' ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ కాగా, 'రామరామ కృష్ణకృష్ణ' నిర్మాత దిల్ రాజు. ఈ క్రేజీ ప్రాజెక్టులన్నీ బోల్తా కొట్టడంతో 'రెడీ' టైంలో ఆకాశంలోకి చూసిన రాం నేలమీదికి దిగొచ్చాడు. సినీ రంగంలో జయాపజయాలకి ఎవరూ అతీతులు కాదనే సంగతి అనుభవంలోకి వచ్చాక అతని ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. 'రెడీ' మత్తులో ఉన్నంత కాలం ఎదుటివాళ్లతో అతడు ఎలా ప్రవర్తించిందీ చాలామందికి అనుభవమే. ఇప్పుడు అతడు కాస్త పరిణతితో వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. సబ్జెక్టుల విషయంలో అలాంటి పరిణతితో వ్యవహరిస్తే మళ్లీ అతడు హిట్ల బాటలోకి వస్తాడనేది చాలామంది అభిప్రాయం.
ప్రస్తుతం అతడు 'కందిరీగ' అనే సినిమా చేస్తున్నాడు. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. అతను 'ఖతర్నాక్', 'రెయిన్బో', 'నీ నవ్వే చాలు' వంటి ఫ్లాప్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. 'కందిరీగ'ని అతడెలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇందులో హన్సిక హీరోయిన్. 'మస్కా' తర్వాత రాం, హన్సిక కలిసి చేస్తున్న సినిమా ఇది. 'కందిరీగ'తోనైనా రాం కెరీర్ గాడిన పడుతుందా?
'జగడం'ని డైరెక్ట్ చేసింది 'ఆర్య' ఫేం సుకుమార్. 'మస్కా'ని నిర్మింది ఎమ్మెస్ రాజు అయితే, డైరెక్త్ చేసింది బి. గోపాల్. 'గణేష్' ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ కాగా, 'రామరామ కృష్ణకృష్ణ' నిర్మాత దిల్ రాజు. ఈ క్రేజీ ప్రాజెక్టులన్నీ బోల్తా కొట్టడంతో 'రెడీ' టైంలో ఆకాశంలోకి చూసిన రాం నేలమీదికి దిగొచ్చాడు. సినీ రంగంలో జయాపజయాలకి ఎవరూ అతీతులు కాదనే సంగతి అనుభవంలోకి వచ్చాక అతని ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. 'రెడీ' మత్తులో ఉన్నంత కాలం ఎదుటివాళ్లతో అతడు ఎలా ప్రవర్తించిందీ చాలామందికి అనుభవమే. ఇప్పుడు అతడు కాస్త పరిణతితో వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. సబ్జెక్టుల విషయంలో అలాంటి పరిణతితో వ్యవహరిస్తే మళ్లీ అతడు హిట్ల బాటలోకి వస్తాడనేది చాలామంది అభిప్రాయం.
ప్రస్తుతం అతడు 'కందిరీగ' అనే సినిమా చేస్తున్నాడు. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. అతను 'ఖతర్నాక్', 'రెయిన్బో', 'నీ నవ్వే చాలు' వంటి ఫ్లాప్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. 'కందిరీగ'ని అతడెలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇందులో హన్సిక హీరోయిన్. 'మస్కా' తర్వాత రాం, హన్సిక కలిసి చేస్తున్న సినిమా ఇది. 'కందిరీగ'తోనైనా రాం కెరీర్ గాడిన పడుతుందా?
Wednesday, October 20, 2010
సినిమా: డిసెంబర్ నుంచి మహేశ్ '3 ఇడియట్స్'
'ఖలేజా' తర్వాత మహేశ్ చేసే సినిమా ఏది? 'దూకుడు', '3 ఇడియట్స్'లో ముందు ఏ సినిమా చేయబోతున్నాడు? ప్రస్తుతం ఆయన అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్నలివి? నిజానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించే 'దూకుడు' ఈ అక్టోబరులో టర్కీలో మొదలవుతుందనే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా షూటింగ్ ఈ నెలలో లేదు. నవంబరులో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు '3 ఇడియట్స్' తెలుగు వెర్షన్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా. 'రోబో' తర్వాత శంకర్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించే ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటల్ని రికార్డ్ చేశారు. ఇందులో ప్రధాన హీరోగా మహేశ్ నటించనుండగా, మరో ఇద్దరు హీరో పాత్రల కోసం తమిళ నటులు ఆర్య, జీవాలను సంప్రదిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)
















