Showing posts with label c pullaiah. Show all posts
Showing posts with label c pullaiah. Show all posts

Saturday, December 12, 2015

Synopsis of the movie VINDHYA RANI (1948)

'వింధ్యరాణి' (1948) చిత్ర కథాంశం


వింధ్యరాజు ఒక ప్రత్యేక ఉన్మత్త మనస్తత్వం కలిగినవాడు. స్వప్రయోజనం కోసం నీతినియమాల్ని పాటించడు. నీతిబోధలన్నా, మంచిమాటలన్నా అతనికి విసుగు. వందిమాగధుల ప్రశంసలకు ఉబ్బిపోడు. స్తోత్రాలలోని వాస్తవమెంతో తెలిసినవాడు. అలా అని ఎదుటివాళ్ల ప్రశంసల్ని ఆశించని అమాయకుడు కాడు. స్త్రీద్వేషి కాకపోయినా వాళ్లంటే గౌరవం లేనివాడు. కామంతో రగిలిపోయే భోగలాలసుడు. అయితే బలహీనులైన స్త్రీలంటే అతనికి రోత. తనకు తగ్గ దృఢవంతురాలై, తన అధికార పరాక్రమానికి ఎదురునిల్చి, బుసలుకొట్టే మహాక్రోధ అయిన స్త్రీని చేజిక్కించుకొని, చెరబట్టి, లొంగదీసుకోవడంలోనే అతనికి మహానందం.
అలాంటి స్త్రీ ఒకామె అతనికి తారసిల్లింది. ఆమే వింధ్యరాణి. ఆమెను ఉడికించి, రెచ్చగొట్టి, ఆమెలో ఎంత విషమున్నదో దాన్నంతా కక్కించేదాకా అతనికి నిద్రపట్టదు. నిద్రపోతున్న తనను ఆమె చాకుతో పొడిచినా కూడా, ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుంటాడే తప్ప ద్వేషించడు. నీతిమంతంగా ఉండేవాళ్లను  అతను సహించడు. అలాంటి వాళ్లు  అతని దృష్టిలో పిరికిపందలు. వాళ్లను రెచ్చగొట్టి, వాళ్లలోని ఉద్రేకాలని బయటకుతీసి, అంతలోనే వాళ్ల నెత్తిపై చరిచి, తిరిగి వాళ్లను యథాస్థానంలోకి కుచించుకుపోయేట్లు చేయడం అతనికి సరదా.
శివశ్రీని అలాగే ఉడికించాడు. కానీ శివశ్రీ ధర్మమార్గ పరాయణుడు, అహింసామార్గానువర్తి. వింధ్యరాజు అసహాయంగా చేత చిక్కినప్పుడు, అతడు తన శత్రువైనప్పటికీ హింసించకుండా క్షమించి విడిచిపెట్టి, పరితాపాగ్నిలో ముంచేశాడు. ఆ పరితాపాగ్ని అతని స్వభావంలోని చెడుని దహించివేసి, సహజంగా అతనిలో ఉన్న మంచిని ప్రేరేపించి, ఇతరుల మంచినికోరే యోగిగా అతణ్ణి మార్చేస్తుంది.

తారాగణం: పుష్పవల్లి, డీవీ సుబ్బారావు, రమణారావు, వరలక్ష్మి, రేలంగి, పండితరావు, ఏవీ సుబ్బారావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
బేనర్: వైజయంతి ఫిలిమ్స్
విడుదల తేదీ: 14 జనవరి

Thursday, November 19, 2015

Director Chittajallu Pullaiah Filmography


1. Sati Savitri (1933)
2. Lava Kusa (1934)
3. Sri Krishna Thulabharam (1935)
4. Sati Anasuya (1936)
5. Dhruva Vijayam (1936)
6. Sri Satyanaraya Swamy (1938)
7. Mohini Bhasmasura (1938)
8. Vara Vikrayam (1939)
9. Malathi Madhavam (1940)

contd...

Thursday, April 11, 2013

Chittajallu Pullaiah Filmography

1. Sati Savitri                                  (1933)
2. Lava Kusa                                  (1934)
3. Anasuya                                     (1935)
4. Sri Krishna Thulabharam             (1935)
5. Sati Anasuya                               (1936)
6. Dhuruva Vijayam                        (1936)
7. Mohini Bhasmasura                     (1938)
8. Sri Satyanarayana Swamy            (1938)
9. Vara Vikrayam                            (1939)
10. Malathi Madhavam                     (1940)
11. Bala Nagamma                           (1942)
12. Gollabhama                                (1947)
13. Vindya Rani                                (1948)
14. Apoorva Sahodarulu                   (1950)
15. Sankranthi                                   (1952)
16. Pakkinti Ammayi                         (1953)
17. Devantakudu                               (1960)
18. Lava Kusa                                  (1963)
19. Paramanandayya Sishyula Katha  (1966)
20. Bhama Vijayam                           (1967)
21. Bhuvana Sundari Katha               (1967)

Friday, May 4, 2012

అలనాటి ఆణిముత్యం: వర విక్రయం (1939)


నటిగా భానుమతి పరిచయమైన చిత్రం 'వర విక్రయం'. కవితా కళానిధిగా ప్రసిద్ధులైన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నటునిగా తెరపై కనిపించిన తొలి సినిమా కూడా ఇదే. అంతే కాదు అనంతర కాలంలో గొప్ప కమెడియన్‌గా రాణించిన కస్తూరి శివరావు ఓ చిన్నపాత్ర ద్వారా ఈ సినిమాతోటే తెరంగేట్రం చేశారు.'చింతామణి', 'మధుసేవ' వంటి గొప్ప నాటకాల్ని రాసిన కాళ్లకూరి నారాయణరావు కలం నుంచి జాలువారిన మరో గొప్ప నాటకం 'వర విక్రయం'. వరకట్న పిశాచానికి వ్యతిరేకంగా రాసిన ఈ నాటకం ఆధారంగానే అదే పేరుతో ఈ సినిమా రూపొందింది. 
ఇందులోని కాళింది పాత్రకు బాగా పాడగల నటికోసం దర్శకుడు సి. పుల్లయ్య అన్వేషిస్తున్నప్పుడు భానుమతి గురించి ఆయనకు తెలిపారు గోవిందరాజుల సుబ్బారావు. భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకటశేషయ్య, గోవిందరాజుల మంచి స్నేహితులు. స్క్రీన్ టెస్ట్ ద్వారా భానుమతిని తీసుకున్నారు పుల్లయ్య. అయితే తన కూతుర్ని ఏ పురుష నటుడూ స్పృశించకూడదనే నిబంధనతో ఇందులో భానుమతి నటించేందుకు శేషయ్య అంగీకరించారు. అలా ఓ గొప్ప నటి ఈ సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది.
కథాంశం: రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అయిన పుణ్యమూర్తుల పురుషోత్తమరావు (దైతా గోపాలం) గాంధేయవాది. ఆయన భార్య భ్రమరాంబ (సీనియర్ శ్రీరంజని), కూతుళ్లు కాళింది (భానుమతి), కమల (పుష్పవల్లి). వరకట్నానికి పురుషోత్తమరావు వ్యతిరేకి. కానీ తన పెద్ద కూతురు కాళిందిని సింగరాజు లింగరాజు (బలిజేపల్లి లక్ష్మీకాంత కవి) దత్తపుత్రుడు బసవరాజు (కొచ్చర్లకోట సత్యనారాయణ)కు ఇచ్చి పెళ్లి చేయడానికి వరకట్నం నిమిత్తం తన పదెకరాల వరిపొలాన్ని అమ్మక తప్పని స్థితి ఎదురయింది. లింగరాజు పక్షం వహించిన పెళ్లిళ్ల పేరయ్య (పేరి రామచంద్రమూర్తి), వివాహాల వీరయ్య (జె. సత్యనారాయణ) వల్ల పెళ్లికాక ముందే కట్నం ఇచ్చేస్తాడు పురుషోత్తమరావు. తన పెళ్లి కారణంగా తల్లిదండ్రులు దరిద్రులై పోతున్నారని ఆవేదన చెందిన కాళింది నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
పెళ్లి జరగకపోయినా కట్నం సొమ్ము ఇవ్వడానికి నిరాకరిస్తాడు లింగరాజు. దాంతో అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటుంది కమల. తన తండ్రి అభిమతానికి విరుద్ధంగా బసవరాజుతో పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లయ్యాక అత్తగారింటికి వెళ్లేందుకు నిరాకరించిన కమల తాను కట్నమిచ్చి వరుణ్ణి కొనుక్కున్నాననీ, అందువల్ల బసవరాజే తమ ఇంటికి రావాలని డిమాండ్ చేస్తుంది. కొడుకు పేరుతో కమలని కోర్టుకు లాగుతాడు లింగరాజు. జడ్జి కమలకి అనుకూలంగా తీర్పు చెబుతాడు. తండ్రి చేష్టలకి విసుగెత్తిపోయిన బసవరాజు భార్యతో కలిసి జీవిస్తానంటాడు. తన తప్పు తెలుసుకున్న లింగరాజు క్షమించాల్సిందిగా పురుషోత్తమరావును అర్థిస్తాడు.
తారాగణం: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలం, సీనియర్ శ్రీరంజని, భానుమతి, పుష్పవల్లి, కొచ్చర్లకోట సత్యనారాయణ, తుంగల చలపతిరావు, పేరి రామచంద్రమూర్తి, జె. సత్యనారాయణ, అడ్డాల నారాయణరావు, ఎ.వి. సుబ్బారావు, ఎల్. సత్యనారాయణ, రేలంగి వెంకట్రామయ్య, కోటిరత్నం, సుభద్ర, కస్తూరి శివరావు
కథ: కాళ్లకూరి నారాయణరావు
మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంగీతం: ప్రభల సత్యనారాయణ
నేపథ్య సంగీతం: దుర్గాసేన్
ఛాయాగ్రహణం: బీరేన్ డే
సౌండ్: సి.ఎస్. నిగం
కూర్పు: ధరం వీర్
కళ: బాటూసేన్
మేకప్: ఈదు
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
బేనర్: ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ

Friday, November 18, 2011

అప్పుడు 'లవకుశ'.. ఇప్పుడు 'శ్రీరామరాజ్యం'


అందరి కళ్లూ ఇప్పుడు 'శ్రీరామరాజ్యం' మీదే. గురువారం (17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇటు సినీ వర్గాల్లో, అటు సామాన్య ప్రజానీకంలో అమితాసక్తి వ్యక్తమవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితం తెలుగులో తిరిగి పౌరాణిక చిత్రాల రూపకల్పనపై ప్రభావం చూపబోతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని పౌరాణిక చిత్రాల నిర్మాణానికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ సందర్భంగా అఖండ విజయం సాధించిన మునుపటి చిత్రంతో, ప్రస్తుత చిత్రాన్ని పోల్చడం సహజం. 26 కేంద్రాల్లో విడుదలైన 'లవకుశ' అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి, తెలుగులో రూ. కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా (టిక్కెట్ రేట్లు పావలా నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో) రికార్డు పుటలకెక్కింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు కాగా, ఈ చిత్రాన్ని 1.98 కోట్ల మంది చూసినట్లు అంచనా. అలాంటి 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, నందమూరి తారకరామారావు ఎంత గొప్ప స్థాయిలో రాణించారో, అభినవ సీతారాములుగా ఎంతగా నీరాజనాలు అందుకున్నారో అప్పటి జనానికి తెలుసు. ముఖ్యంగా శ్రీరామునిగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది 'లవకుశ'లో ఆయన పోషించిన ఆ పాత్రతోనే.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమోనని భ్రమించే రీతిలో ఆయన జనాన్ని సమ్మోహహితుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాత్రని బాలకృష్ణ ఎలా చేశారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రూపపరంగా చూస్తే, ఎన్టీఆర్ వంటి సమ్మోహనశక్తి లేకపోయినా ఆయన తర్వాత రాముని పాత్రలో ఇమడ గలిగేది బాలకృష్ణే అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. శ్రీరాముని రూపంలోని బాలకృష్ణ స్టిల్స్ ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 'లవకుశ'లో సీతగా అంజలీదేవి ప్రభావమూ అసామాన్యమైనదే. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయారు. లక్ష్మణుడు తనని అడవులకు పంపిన కారణం తెలిశాక ఆమె పలికించిన కరుణ రసం ఎప్పటికీ మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో ఆమె అభినయం అపూర్వమనే చెప్పాలి. అలాంటి పాత్రను ఇప్పుడు నయనతార చేయడమే ఒక విచిత్రం. తన కాలానికి అంజలి గొప్పనటిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ నయనతార తెలుగు నటి కాదు. తెలుగు భాష సరిగా తెలీదు కూడా. అయినా ప్రచార చిత్రాల్లో సీతగా ఆమె ఆహార్యం చక్కగా ఉంది. ఇప్పటికే 'సింహా' చిత్రంలో బాలకృష్ణ, నయనతార జంట ప్రేక్షకుల్ని అలరించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్‌కి పేరుపొందిన నయనతార ఆ సినిమాల్లో చీరల్లో హుందాగా కనిపించిన తీరే ఇప్పుడు సీత పాత్రకు ఎంపిక చేసేందుకు దోహదం చేసింది. అంజలిని ఆమె ఏ తీరున మరిపిస్తుందన్నది చూడాల్సిందే. 
ఇక చిత్రంలో కీలకమైంది లక్ష్మణుని పాత్ర. మునుపటి చిత్రంలో ఆ పాత్రని కాంతారావు అమోఘంగా పోషించారు. సీతను అడవులకు పంపాలని శ్రీరాముడు నిర్ణయించినప్పుడు, ఆ బాధ్యత తనమీదే పడ్డప్పుడు కాంతారావు ప్రదర్శించిన నటన అత్యుత్తమం. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో శ్రీకాంత్‌ని మనం చూడబోతున్నాం. ఆయన ఓ పౌరాణిక పాత్రను పోషించడం ఇదే ప్రథమం. వాల్మీకిగా చిత్తూరు నాగయ్యను చూసిన కళ్లతో అక్కినేని నాగేశ్వరరావును చూడటం అపురూపం. నటులుగా ఇద్దరూ ఏ స్థాయి నటులో మనకు తెలిసిందే. 
ఇదంతా తెరమీద మనం చూడబోయే వ్యవహారం కాగా తెరవెనుక దర్శకత్వాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. 'లవకుశ'ను తలపెట్టింది సి. పుల్లయ్య. అయితే అకస్మాత్తుగా సినిమా మధ్యలో ఆయన మరణించడంతో ఆ బాధ్యతను గొప్పగా నెరవేర్చారు ఆయన కుమారుడు సి.ఎస్. రావు. అలా తండ్రీకొడుకులు ఒక పౌరాణిక చిత్రరాజాన్ని తెలుగు దేశానికి అందిస్తే, ఇప్పుడు ఆ పని నిర్వహించింది ఇప్పటికే ఎన్నో కళాఖండాల్ని అందించిన బాపు. సహచరుడు ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా మధ్యలో అర్ధంతరంగా స్వర్గస్తులైతే, ఒంటిగానే తాననుకున్న రీతిలో 'శ్రీరామరాజ్యం'ను తీర్చిదిద్దారు బాపు. ఎనభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఏకాగ్రతతో ఈ చిత్రాన్ని ఆయన మలచిన తీరుకు ఆ సినిమా యూనిట్ అంతా జేజేలు పలుకుతున్నారు. 
దీంతో పాటు సంగీతాన్నీ ప్రస్తావించుకోవాలి. 'లవకుశ' విజయంలో ఘంటసాల సంగీత బాణీలకూ ప్రత్యేక స్థానముంది. 'శ్రీరామరాజ్యం'కు ఆ బాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు ఇళయరాజా. ఇవన్నీ ఒకెత్తయితే పౌరాణికాలు తియ్యాలంటేనే బెంబేలెత్తే ఈ రోజుల్లో ఖర్చుకు వెరవకుండా, భారీ రిస్కుకు దడవకుండా ఈ సినిమాని నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు యలమంచిలి సాయిబాబా. ఇన్ని విశేషాలున్న 'శ్రీరామరాజ్యం' ఏ రీతిన ఆడుతుందో, 'లవకుశ'ను ఎంతగా మరిపిస్తుందో వేచి చూడాల్సిందే.

Tuesday, September 28, 2010

సినిమా: రెండు మూడు నెలల్లో సినిమా తీసే సత్తా ఉందా?

ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాల్ని రెండేళ్ల పాటు తీస్తున్నారు. అందుకు చక్కని ఉదాహరణలు - పవన్ కల్యాణ్ 'కొమరం పులి', మహేశ్ 'ఖలేజా'. నిన్నటికి నిన్న రాంచరణ్ 'మగధీర' నిర్మాణానికి కూడా రెండేళ్లు పట్టింది. కానీ టాకీలు మొదలైన తర్వాత చాలాకాలం పాటు ఎంత పెద్ద హీరో సినిమా అయినా రెండు మూడు నెలల్లోతీసేవాళ్లు. దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య ఏ సినిమానైనా ఒకటిన్నర నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేసేవాళ్లు.
దాదాపు ఒకేసారి నిర్మాణమై, విడుదలైన గోపీచంద్ 'లక్ష్మమ్మ', ఘంటసాల బలరామయ్య 'శ్రీ లక్ష్మమ్మ కథ' సినిమాలు రెండూ రెండు నెలల్లోనే తయారయ్యాయి. సుందర్ లాల్ నహతా (శ్రీ ప్రొడక్షన్స్) 'శాంతినివాసం' చిత్రాన్ని 3 నెలల్లో నిర్మించారు. షూటింగుకు పట్టిన కాలం కంటే ఎక్కువ కాలం అది థియేటర్లలో ప్రదర్శితమైంది. పెట్టుబడికి ఆరింతలు మించి నికర లాభం రావడం విశేషం. అదే నిర్మాత అక్కినేని, సావిత్రితో 'అభిమానం' (1960) సినిమాని రెండు నెలల్లోనే తీశారు. హేమాహేమీలు పనిచేసిన ఆ సినిమా రెండు నెలల్లో పూర్తి కావడం చిన్న విషయం కాదు.
నటీనటులందరూ ఆ సంస్థని అభిమానించడం వల్లా, ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ డబ్బు ఠంచనుగా ఇవ్వడంవల్లా, ముందే తారలకు కాల్షీట్లు ఎక్కువ కావాలని చెప్పి, అన్న ప్రకారం అన్ని కాల్షీట్లు నిర్విఘ్నంగా ఉపయోగించుకోవడం వల్లా, అన్నిటికీ మించి ప్లానింగ్ అండ్ పంక్చువాలిటీ వల్లా, ఒక సెట్టుపై పని ముగిసే లోగా మరో సెట్టు సిద్ధం చేసుకుని 'బ్రేక్' లేకుండా షూటింగ్ కొనసాగిస్తూ వున్నందువల్లా డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు (సి.యస్. రావు) 'అభిమానం'ను రెండు నెలల్లో పూర్తి చేయగలిగాడు.
మరిప్పుడు అలాంటి వాతావరణం ఉందా? డబ్బుని తప్ప మంచి సంస్థనైనా అభిమానించే తారలున్నారా? అందరికీ ఠంచనుగా డబ్బిచ్చే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? పక్కా ప్లానింగ్, పంక్చువాలిటీ ఎంత మంది పాటిస్తున్నారు? బ్రేక్ లేకుండా షూటింగులు కొనసాగించే దర్శకులు ఉన్నారా? అలా లేనందునే ఇవాళ ఇష్టమొచ్చినన్ని రోజులు షూటింగులు జరుగుతూ నిర్మాతని నిలువునా ముంచుతున్నాయి.                          

Tuesday, August 24, 2010

Nostalgia: The writer of 'Patnamlo shalibanda' song

డైరెక్టర్ కె.బి. తిలక్ రూపొందించిన 'ముద్దుబిడ్డ' సినిమాలోని 'చుక్కల చీర కట్టుకుని/పట్టుగుడ్డ రైక తొడుక్కొని/బుర్ర నున్నగా దువ్వుకుని/ఒంటిగ వస్తిని మామయ్యా/జంటగ ఉందము రావయ్యా' పాటని రాసింది ఆచ్చి వేణుగోపాలాచార్యులు అలియాస్ ఎ. వేణుగోపాల్. ఈ పాటకి పెండ్యాల నాగేశ్వరరావు బాణీలు కడితే, జిక్కి పాడారు.
సి. పుల్లయ్య డైరెక్ట్ చేసిన 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' సినిమాలో 'చిలకా చిక్కావో ఈనాడు', 'పదవే పోదాము గౌరీ' పాటలు రాశారు వేణుగోపాల్. వీటిలో మొదటిదాన్ని రమణారెడ్డి, సురభి బాలసరస్వతిపై తీశారు. అలాగే 'జయ జయ జయ శ్రీవెంకటేశా.. జయ జయ జయ శ్రితజన పోషా' పాటని రాశారు కానీ దాన్ని సినిమాలో వాడుకోలేదు.
'తిరుపతమ్మ కథ'లో 'శ్రీవెంకటేశా దయాసాగరా' పాట రచయిత వేణుగోపాలే.
హిందీలో రాజ్ కపూర్ నటించిన 'అనాడీ'ని తెలుగులో రీమేక్ చేశారు వేణుగోపాల్. ఆ సినిమాని ఆయనతో పాటు ఆయన మిత్రుడు శంకరయ్య, మరికొంతమంది కలిసి నిర్మించారు. ఆ సినిమా కృష్ణ, జమున నటించిన 'అమాయకుడు'. అందులో వేణుగోపాల్ రాసిన 'పట్నంలో శాలిబండ/పేరైనా గోలుకొండ/చూపించు సూపునిండా../పిసల్.. పిసల్.. బండ' పాట ఎంత హిట్టో మనకి తెలుసు. ఎల్.ఆర్. ఈశ్వరి దాన్ని పాడారు.
వేణుగోపాల్ 'యాదగిరి మహత్యం' సినిమాకి దర్శకత్వం వహించారు. కన్నడంలో రాజ్ కుమార్ నటించిన 'రాఘవేంద్ర మహత్యం' సినిమాని తెలుగులో తీసినప్పుడు ఆయన మాటలు, పాటలు రాశారు.
ప్రస్తుతం చిక్కడపల్లిలో ఉంటున్న వేణుగోపాలాచార్యులు వయసు 80 యేళ్లు.