Showing posts with label rajanala. Show all posts
Showing posts with label rajanala. Show all posts

Wednesday, December 2, 2015

Synopsis of the movie Varalakshmi Vratam (1961)

'వరలక్ష్మీ వ్రతం' (1961) చిత్ర కథాంశం


అనగనగా ఓక రాజు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు. సహజంగానే పెద్ద భార్య ఉత్తమురాలు. రెండో భార్య చూపులకు మొద్దుగా ఉన్నప్పటికీ రాజుగారికి మాత్రం ముద్దుగానే ఉంటుంది. అంతటి మనిషి అక్కకంటే ముందుగానే కొడుకును కని తన ప్రతిభను చాటుకుంది. ఆ పుత్రరత్నమే కాబోయే రాజు అని ఉవ్విళ్లూరుతోంది. అది జరిగితే కథేముంది? పెద్దరాణి ఉన్నన్నాళ్లూ ఊరుకొని లేటు వయసులో గర్భం దాల్చింది. ఆమె కడుపులో పెరుగుతున్న పిండం చిన్నరాణి ఆశలకు గండం అయింది. ఆమెకు జోస్యం తెలుసో లేక స్కానింగ్ కళ్లు ఉన్నాయో కానీ, పెద్దరాణికి కొడుకే పుడ్తాడని తమ్ముడితో గట్టిగా అరిచి మరీ చెప్పింది. అందుకని ఆమెను అంతం చేయమని తమ్ముడికి నూరిపోసింది. ఒక మాంత్రికుడి సహాయంతో చేసిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ మాంత్రికుడికీ, అతని ఇద్దరు శిష్యులకూ బోడిగుళ్లు దక్కాయి. ఆపైన గాడిదపై ఊరేగే భాగ్యమూ లభించింది.
పెద్దరాణి కొడుకుని కనేసింది. ఆ పసికందును తమ్ముడిచేత హత్యచేయించడానికి ప్రయత్నించింది చిన్నరాణి. కాని ముసలి మంత్రి తెలివితేటల వల్ల రాకుమారుడు తప్పించుకొని ఒక స్వామిభక్తి పరాయణుడి ఇంట పెరుగుతాడు. అతనికి బదులు ఆ భక్తుడి కొడుకు హత్యకు గురవుతాడు. ఆ పిల్లల తల్లులు ఎంతటి సత్తెకాలపు వాళ్లంటే పిల్లలు మారిపోయినా వాళ్లకు తెలీదు.
పనిలో పనిగా రాజుగారిని ఫినిష్ చేసి లైన్ క్లియర్ చేస్తాడు. ఆపైన రాణీని, ఎక్కడ తనకు ద్రోహం చేస్తుందోనని తన అక్కని జైలులో పెట్టేస్తాడు. తానే రాజ్యం చేపడతాడు.
సినిమా కథలో విధి బలీయంగా ఉంటుంది కాబట్టి అతని కూతురు మణిమంజరి, అజ్ఞాత రాకుమారుడు తొలిచూపులోనే ప్రేమించేసుకుంటారు. ప్రేమకు ఫలం దక్కాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అందుకు తగ్గట్లే ఆ కష్టాలన్నీ దుష్టుల రూపంలో వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేసి నాయికను వరలక్ష్మీదేవి భక్తురాలిగా చేస్తాయి. ఈలోగా రాజకుమారిని దుష్టులు చెరబట్టబోగా, ఒక యక్షిణి రాకుమారుని చెరబట్టి, తన లోకానికి తీసుకుపోయి షికార్లకు వెళ్లేప్పుడల్లా కాగితం పువ్వుగా మారుస్తుంటుంది.
గుండు కొట్టించుకున్న ఒక మాంత్రికుడు మాయలూ మంత్రాలతో హంగామా చేస్తుంటాడు. ఏదైతేనేం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ జరిగి విడిపోయిన దంపతులను ఏకంచేసి తన మహత్యం నిరూపించుకుంటుంది వరలక్ష్మి.

తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ, బాలకృష్ణ (అంజి), ముక్కామల, మిక్కిలినేని, స్వర్ణలత, మీనాకుమారి, జగ్గారావు, అల్లు రామలింగయ్య, కాకరాల, ఆదోని లక్ష్మి
సంగీతం: రాజన్ - నాగేంద్ర
నిర్మాత, దర్శకుడు: బి. విఠలాచార్య
బేనర్: విఠల్ ప్రొడక్షన్స్

Saturday, November 28, 2015

Synopsis of the movie NENE MONAGANNI (1968)

'నేనే మొనగాణ్ణి' చిత్ర కథాంశం


బెజవాడ భద్రయ్య (రాజనాల) బందిపోటు దొంగ. పేరుచెప్పి మరీ దోపిడీలు చేస్తుంటాడు. అతణ్ణి డీఎస్పీ నందనరావు (సత్యనారాయణ) వెంటాడుతూ ఉంటాడు. ఒక దోపిడీ సందర్భంలో ఆ ఇద్దరూ తారసపడతారు. నందనరావును చంపిన భద్రయ్య తన నాలుగేళ్ల కొడుకు నానీతో పారిపోతూ, పోలీసు తుపాకీ దెబ్బలు తిని, తన కొడుకును ఒక బావిలో పడేసి, తను పారిపోతాడు. భద్రయ్యను అతని ముఠా పోలీసుల దృషిపడని దూరప్రాంతానికి తీసుకుపోతారు. తన కొడుకు చనిపోయాడనుకున్న భద్రయ్య, దానికి కారణమైన డీఎస్పీ కుటుంబంపై కసి పెంచుకుంటాడు.
అయితే నానీ చనిపోలేదు. నందనరావు ఇంట్లో పెరుగుతున్నాడు. తన భర్తను చంపినవాడిపై కసితీర్చుకోవడానికే అతని కొడుకును  తన ఇంట్లో పెట్టుకున్న ఆయన భార్య శాంత (శాంతకుమారి)లో ఆ పసివాడు మాతృత్వాన్ని రేకెత్తిస్తాడు. ఆ బాబును దేవుడిచ్చిన బిడ్డగా భావించి పెంచుతుందామె. అ పిల్లాడు వంశీధర్ (ఎన్టీఆర్)గా పెద్దవాడవుతాడు. అందమైన అమ్మాయిలతో కలిసి హుషారుగా చిందులేస్తూ ఉంటాడు. నందనరావు బావమరిది పోలీస్ కమీషనర్ (ధూళిపాళ). ఆయన కూతురు నీల (షీలా), వంశీధర్ మనసులు ఇచ్చిపుచ్చుకొని బావామరదళ్లుగా సరస సల్లాపాల్లో పడతారు.
తిరిగొచ్చిన భద్రయ్య దేశంలో అల్లకల్లోలం లేపాలనుకున్న ఒక విదేశీ ఏజెంట్ల ముఠాకు నాయకుడవుతాడు. దేశంలో అల్లర్లనూ, అరాచకాలనూ ప్రేరేపిస్తుంటాడు. తన కొడుకును బలితీసుకున్న నందనరావు కొడుకు వంశీని చంపాలని కంకణం కట్టుకుంటాడు. ఈ ముఠాను పట్టుకోవాలనుకున్న వంశీ అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులకు చిక్కి జైలుకెళతాడు. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని జైలునుంచి తప్పించుకుంటాడు. ఫలితంగా దొంగల ముఠాకు వంశీయే నాయకుడన్న అనుమానాలు బలపడతాయి. దాంతో అతనిపై నిఘా వేస్తాడు పోలీస్ కమీషనర్. వీటన్నిట్నించీ తప్పించుకుంటూ, దొంగల ముఠాను హతమార్చి తానే మొనగాణ్ణని నిరూపించుకుంటాడు వంశీ.

తారాగణం: ఎన్టీ రామారావు, షీలా, రాజనాల, ధూళిపాళ, శాంతకుమారి, గీతాంజలి, సంధ్యారాణి, జ్యోతిలక్ష్మి, రామకృష్ణ, రమణారెడ్డి, రాజబాబు, సత్యనారాయణ (గెస్ట్), బాలయ్య, అల్లు రామలింగయ్య
సంగీతం: టీవీ రాజు
నిర్మాత, దర్శకుడు: ఎస్.డి. లాల్
బేనర్: ప్రతిమా ఫిలిమ్స్
విడుదల తేదీ: 4 అక్టోబర్

Thursday, November 19, 2015

Synopsis of the movie AGGI MEEDA GUGGILAM (1968)

'అగ్గిమీద గుగ్గిలం' చిత్ర కథాంశం:


క్షుద్రవిద్యల్ని సొంతం చేసుకున్న మాయాపురం మాంత్రికుడు (రాజనాల) శ్రీపుర మహారాణి భట్టిణి (జూనియర్ శ్రీరంజని)ని అపహరించుకుపోయి, తన మాయా మందిరంలో బంధించి, ఆమెను వశపరచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ అవమాన భారంతో మహారాజు (గుమ్మడి) కుంగిపోతాడు. రాణి ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మరణించిందని ప్రకటిస్తాడు. అయితే తన రహస్య మందిరంలో అహోరాత్రులూ కఠోర దీక్షలో మునిగిపోయి యక్షిణిని ప్రసన్నం చేసుకుంటాడు. అపూర్వ మంత్రశక్తుల్ని సాధిస్తాడు. ఈ శక్తులతో మాంత్రికుడి పీచమణచి, రాణిని బంధవిముక్తి చేయడానికి ఎదురు చూస్తుంటాడు.
రాజు వైమనస్యాన్ని అవకాశంగా తీసుకొని మంత్రి చండవర్మ (ధూళిపాళ) రహస్యంగా సైన్యాధిపతిని హతమార్చి తన కుమారుడు శకటాలు (సత్యనారాయణ)కు ఆ పదవిని కట్టపెట్టాలని పన్నాగం పన్నుతాడు. ఈ ప్రమాదాన్ని శంకించిన రాజు అందుకు అంగీకరించక పోటీలు ఏర్పాటుచేసి, వాటిలో నెగ్గిన వీరునికే ఆ పదవి ఇవ్వాలని ఆదేశిస్తాడు.
ఆ పోటీల్లో వీరేంద్ర (కాంతారావు) నెగ్గుతాడు. అయితే సైన్యాధిపతి పదవిని నిరాకరిస్తాడు. అతని శౌర్యపరాక్రమాలకు ముగ్ధురాలైన రాకుమారి చంద్రప్రభాదేవి (రాజశ్రీ) అతనికి తన హృదయాన్ని అర్పిస్తుంది. వీరేంద్రుడు అరణ్యంలో తన చెల్లి అరుణ (విజయలలిత), తాత (కాశీనాథ్ తాత)తో నివసిస్తూ ఉంటాడు. రాకుమారి మారువేషంతో అక్కడకు వెళ్లి సైన్యాధిపత్యానికి అతణ్ణి ఒప్పిస్తుంది. వీరేంద్రుని చెల్లి అరుణ ఒకరోజు విచిత్ర పరిస్థితుల్లో కామపురి యువరాజు అరిందముడి (రామకృష్ణ)ని కలుసుకొని ప్రేమలో పడుతుంది.
ఈ కథలో ఇంకో ఉపకథ వస్తుంది. నిజానికి వీరేంద్రుడు కామపురి యువరాజనీ, అరిందముడి తండ్రి కామపాలుడు వీరేంద్రుని తండ్రి అయిన రాజును హతమార్చి, పిల్లల్ని కూడా చంపాలనుకుంటుండగా, పసికందుల్ని తాను రక్షించి అరణ్యానికి తెచ్చినట్లు తాత చెబుతాడు. శ్రీపురంలో వీరేంద్రుని భక్తి విశ్వాసాల్ని పరీక్షించిన మహారాజు అతడ్ని రహస్య మందిరానికి తీసుకెళ్లి, తన వృత్తాంతమంతా అతనికి వివరిస్తాడు. మాంత్రికునిపై పోరాటానికి బయల్దేరి, అతనికి బందీ అవుతాడు. అడవిలో వెళ్తున్న అరిందముడిపై శకటాలు బలగం దాడిచేస్తుంది. వీరేంద్రుడు అతనికి సాయపడతాడు. ఆ పోరులో స్పృహతప్పిన అరిందముడిని తన ఇంటికి తీసుకుపోతాడు. తాత ద్వారా తన తండ్రి చేసిన రాజద్రోహాన్ని తెలుసుకుంటాడు అరిందముడు. తండ్రి అక్రమాల్ని వ్యతిరేకిస్తాడు. దాంతో కొడుకుని బంధించమంటాడు కామపాలుడు. భటుల నుంచి తప్పించుకొని పారిపోతాడు అరిందముడు.
మహారాజును వీరేంద్రుడు హత్యచేశాడని చండవర్మ ప్రచారం చేస్తాడు. ఫలితంగా ప్రియుణ్ణి అనుమానించి కారాగారంలో వేయిస్తుంది రాకుమారి. అక్కణ్ణించి వీరేంద్రుడు తప్పించుకొని మహారాజు కోసం మాంత్రికుని వద్దకు బయలుదేరుతాడు. కామపాలునితో కలిసి కుట్ర పన్నిన చండవర్మ శ్రీపుర రాజ్యాపహరణకు ప్రయత్నిస్తాడు. రాకుమారి, అరుణ పారిపోతుండగా పట్టుకొని బంధిస్తారు. మాంత్రికుని స్థావరం చేరిన వీరేంద్రుడు, అక్కడ ఆకాశ బేతాళుడికి సాయపడి, అతని సాయంతో మాంత్రికుడి ప్రాణాలుండే కప్పను చేజిక్కించుకుంటాడు. దాంతో కథ సుఖాంతం.
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, రామకృష్ణ, విజయలలిత, రాజనాల, గుమ్మడి, ధూళిపాళ, సత్యనారాయణ, రాజబాబు, జ్యోతిలక్ష్మి
సంగీతం: సత్యం
నిర్మాతలు: పి.యస్. ప్రకాశరావు, ఎ. పూర్ణచంద్రరావు
దర్శకుడు: జి. విశ్వనాథం
బేనర్: నవభారత్ ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 సెప్టెంబర్

Friday, August 19, 2011

బిగ్ స్టోరీ: మన 'విలన్'పై చిన్న చూపెందుకు?

సాధారణంగా మన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు మూడుంటాయి. హీరో, హీరోయినూ, విలనూ. హీరో హీరోయిన్లుగా అందమైన వాళ్లనే ఎంచుకుంటారు. కానీ విలన్‌కి మాత్రం ఎంత క్రూరంగా కనిపించే ముఖమైతే అంత నప్పుతుందని అట్లాంటి వాళ్లని గాలించి మరీ మన సినిమావాళ్లు విలన్లని చేస్తుంటారు. మన సినిమా విలన్లకు లేని దుర్గుణాలు కానీ, వాళ్లు చెయ్యని ఘోరాలు కానీ వుండవు. తెరమీద కనిపించడమే తాము చాలా దుర్మార్గులమని గట్టిగా చెప్పుకుంటారు. వాళ్లెంతటి దుర్మార్గంగా వుంటారంటే తేడా వస్తే తమ మనిషిని కూడా అతి సులువుగా చంపేస్తూ వుంటారు. కొంతమంది విలన్లు సూటూ బూటూ వేసుకుని పైకి బాగా మంచివాళ్లుగానే కనిపించినా వాళ్లు చేసేవన్నీ దుర్మార్గపు పనులే. కొంతమందయితే నల్ల కల్లజోళ్లు పెట్టుకునో, ఒక కన్ను లేకుండానో, చెంపమీద పెద్ద గాటుతోనో, ఒక చెయ్యి లేదా ఒక కాలు లేనివాళ్లుగానో కనిపించి అసలు సిసలు విలన్లు తామే అనిపిస్తుంటారు. ఈ ప్రతినాయకుల ముఖ్య కర్తవ్యం హీరో హీరోయిన్లని తిప్పలు పెట్టడం, వాళ్లు కలుసుకోకుండా చూస్తూ రీళ్లని పెంచడం. ఈ పనికోసం సినిమా ఆరంభం నుంచి ఆఖరుదాకా హీరోయిన్ వంక కోరచూపులు చూస్తూవుంటారు. ఈ విలన్లకు గుర్రపుస్వారీ, ఫైట్లు అన్నీ బాగావచ్చు. హీరోకంటే కూడా వాటిలో అతడికి ఎక్కువ సామర్థ్యం వుంటుంది. కండబలంతో పాటు తెలివితేటలూ ఎక్కువే. అయితే రచయితా, దర్శకుడూ, కథా - వీళ్లంతా కుట్రతో విలన్నే ఎప్పుడూ ఓడిస్తూ వుంటారు. సినిమా ఆఖర్న విసిగిపోయిన విలన్ చావనైనా చస్తాడు లేదంటే పోలీసులతో సంకెళ్లయినా వేయించుకుంటాడు. లేదంటే బుద్ధి వచ్చిందని లెంపలేసుకుంటాడు. మొత్తానికి ఈ విలనే లేకపోతే హీరోగారి హీరోయిజం బయటపడదు కాబట్టి నూటికి తొంభై అయిదు సినిమాలకి ఈ విలనే ఆధారం.
ఇప్పుడిదంతా చెప్పడం ఎందుకంటే ఇంతటి ప్రాధాన్యత వున్న విలన్ పాత్రధారుల్ని ఇవాళ మన సినిమావాళ్లు చిన్నచూపు చూస్తున్నారని. అలనాటి గోవిందరాజుల సుబ్బారావు నుంచి ఇప్పటి జయప్రకాశ్‌రెడ్డి దాకా విలనిజాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నా వాళ్లకి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పటివాళ్లు చాలా మెరుగు. గోవిందరాజుల సుబ్బారావు, సీఎస్సార్ ఆంజనేయులు, ధూళిపాళ, ఎస్వీ రంగారావు, ముక్కామల, రాజనాల, జగ్గయ్య, ఆర్. నాగేశ్వరరావు, నాగభూషణం, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు వంటి విలన్ పాత్రధారులకి పేరు ప్రతిష్ఠలూ, గౌరవమూ దక్కాయి. శకుని పాత్ర పోషణలో సీఎస్సార్, ధూళిపాళ; విశ్వామిత్ర పాత్రలో ముక్కామల; రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రల్లో ఎస్వీ రంగారావు; దుష్ట మాంత్రికుడి పాత్రలో ఎస్వీ రంగారావు, రాజనాల; దుష్ట సైన్యాధిపతి పాత్రలో రాజనాల; 'అల్లూరి సీతారామరాజు'లో బ్రిటీష్ అధికారి రూథర్‌ఫర్డ్ పాత్రలో జగ్గయ్య పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఎస్వీ రంగారావు కేవలం దుష్ట పాత్రల్లోనే కాకుండా సాత్త్విక పాత్రల్లోనూ గొప్పగా రాణించి మహానటుడు అనిపించుకున్నారు.
ఆయన తర్వాత అట్లాంటి ఖ్యాతి కైకాల సత్యనారాయణకీ, కోట శ్రీనివాసరావుకీ దక్కింది. హీరోగా వచ్చి విలన్‌గా నిలదొక్కుకొని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రూపాంతరం చెందిన సత్యనారాయణని అందుకే అందరూ 'నవరస నటనాసార్వభౌమ' అనేది. కేవలం డైలాగ్ మాడ్యులేషన్‌తోటే విలన్లుగా గొప్పగా రాణించినవాళ్లు నాగభూషణం, రావు గోపాలరావు. సీరియస్ విలనిజంలో హాస్యాన్ని జోడించి మాటని విరిచి మాట్లాడే నాగభూషణాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. డైలాగుల్లో గోదావరి యాసని జోడించి కొన్ని మాటల్ని వత్తి పలుకుతూ విలన్‌గా రావు గోపాలరావు కొత్త రూపంతో కనిపించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. 'ముత్యాల ముగ్గు', 'యమగోల' చిత్రాల్లో ఆయన డైలాగుల్ని ఇప్పటికీ చాలామంది తెలుగువాళ్లు మరచిపోలేదు. 'అహ నా పెళ్లంట'లో పిసినారి విలన్‌గా, 'గాయం'లో గుండు విలన్‌గా కోట శ్రీనివాసరావు నటనకి శభాష్ అన్నారు ప్రేక్షకులు. ఒక్క విలన్‌గానే కాక హాస్య పాత్రల్లోనూ, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తను తక్కువవాణ్ణి కానని కోట నిరూపించుకున్నారు.
ఇంతమంది నటులు విలన్‌గా రాణించి హీరోలతో పాటే (తక్కువగానైనా) స్థిరంగా పేరు తెచ్చుకున్నా ఇప్పుడు అట్లాంటి స్థిరమైన విలన్ వేషధారులు కనిపించకపోవడమే బాధాకరం. జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి వంటి నటులు విలన్ వేషాల్లో మెప్పిస్తున్నా వాళ్లు ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. 'ప్రేమించుకుందాం రా' చిత్రంలో జయప్రకాశ్‌రెడ్డి విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా తగినన్ని అవకాశాలు మన నిర్మాతలు, హీరోలు ఇవ్వడం లేదు. అతను ఆహార్యంలో కానీ, హావభావాల్లో కాన్నీ పచ్చి దుర్మార్గాన్ని పలికించడంలో నేర్పరి. ఇతన్ని తెలుగు చిత్రసీమ సరైన రీతిలో వినియోగించుకుంటే ఈసరికే తిరుగులేని విలన్ అయ్యుండేవాడు. 'మాతృదేవోభవ', 'నువ్వు నేను' సినిమాల్లో అతి క్రూరమైన విలన్ పాత్రల్లో బాగా రాణించిన తనికెళ్ల భరణిని విలన్‌గా కంటే హాస్య నటుడి పాత్రల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి భరణిని హాస్యనటుల జాబితాలోనే వేసుకోవాలి. చలపతిరావుది మరో రకం కథ. పక్కా విలన్‌గా కనిపించే రూపం వున్నా ఎందుకనో పరిశ్రమ ఆయన్ని సరిగా ప్రమోట్ చేయలేదు. తెలుగులో ద్వితీయ శ్రేణి సినిమాల్లోనే ఎక్కువగా ప్రధాన విలన్ పాత్రలు వేసిన ఆయన 'నిన్నే పెళ్లాడుతా' నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాడు.
ప్రస్తుతం విలన్ వేషాల్లో పేరు తెచ్చుకుంటున్న వాళ్లంతా హీరో వేషాలు వేయడానికే ఆసక్తి చూపిస్తూ రావడం గమనార్హం. హీరోగా పరిచయమై, మళ్లీ అవకాశాలు లేకపోవడంతో 'జయం'తో విలన్‌గా మారిన గోపీచంద్ ఆ పాత్రలకి అచ్చుగుద్దినట్లు సరిపోయాడు. 'వర్షం', 'నిజం' సినిమాలు ఆ కోవలేనివే. తెలుగు సినిమాకి మంచి తెలుగు విలన్ లభించాడని అందరూ ఆనందిస్తున్న కాలంలోనే అనూహ్యంగా 'యజ్ఞం'తో హీరో అయిపోయాడు గోపీచంద్. ఇప్పుడు ఆ పాత్రల్లో తనకంటూ సొంత ఇమేజ్ కూడా సంపాదించేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కుర్ర విలన్లు అజయ్, సుబ్బరాజు కూడా హీరో పాత్రల కోసం ట్రై చేస్తున్నారు. అజయ్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించేశాడు కూడా. సుబ్బరాజు కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు.
మనం ఇక్కడ ఇంకో ఇద్దరు నటుల గురించి కూడా చెప్పుకోవాలి. విలన్లుగా పేరు తెచ్చుకుని, తర్వాత హీరోలుగా కూడా రూపాంతరం చెంది, అట్లా కూడా పేరు తెచ్చుకున్న ఆ నటులు - మోహన్‌బాబు, శ్రీహరి. కొత్తరకం డైలాగ్ మాడ్యులేషన్‌తో మోహన్‌బాబు, యాక్షన్ విలన్‌గా శ్రీహరి బాగానే పేరు తెచ్చుకున్నారు. కానీ మరింతకాలం విలన్లుగా వాళ్లు నటించి వుంటే వాళ్ల సేవలు అటు పరిశ్రమకీ, ఇటు ప్రేక్షకులకీ దక్కేవి. సో, ఇద్దరు మంచి విలన్లని అట్లా మిస్సయ్యాం. పోతే ఇప్పుడు మన పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు తమ చిత్రాల్లో విలన్లుగా మన నటుల్ని కాక ఇతర భాషల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటం వల్ల కూడా మన 'విలన్' నటులకి మంచి అవకాశాలు దక్కడం లేదు. ముఖేష్‌రుషి, మోహన్‌రాజ్, ఆనంద్‌రాజ్, సాయికుమార్ (మలయాళీ), సాయాజీ షిండే, ప్రదీప్ రావత్, రాహుల్‌దేవ్, ముకుల్‌దేవ్, దండపాణి వంటి పరభాషా విలన్లనే మన అగ్రహీరోలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెద్ద హీరోలు మన వాళ్లలోని టాలెంటుని గుర్తించి అవకాశాలు ఇవ్వాలి. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఒత్తిడికి లోంగిపోకూడదు. అలా జరిగితే మరికొందరు మంచి తెలుగు 'విలన్లు' తయారవుతారు. వాళ్లలో కొందరైనా చరిత్రలో స్థానం పొందగలిగే అవకాశం వుంటుంది.

Monday, December 20, 2010

సినిమా: మన 'విలన్'పై చిన్న చూపెందుకు?

సాధారణంగా మన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు మూడుంటాయి. హీరో, హీరోయినూ, విలనూ. హీరో హీరోయిన్లుగా అందమైన వాళ్లనే ఎంచుకుంటారు. కానీ విలన్‌కి మాత్రం ఎంత క్రూరంగా కనిపించే ముఖమైతే అంత నప్పుతుందని అట్లాంటి వాళ్లని గాలించి మరీ మన సినిమావాళ్లు విలన్లని చేస్తుంటారు. మన సినిమా విలన్లకు లేని దుర్గుణాలు కానీ, వాళ్లు చెయ్యని ఘోరాలు కానీ వుండవు. తెరమీద కనిపించడమే తాము చాలా దుర్మార్గులమని గట్టిగా చెప్పుకుంటారు. వాళ్లెంతటి దుర్మార్గంగా వుంటారంటే తేడా వస్తే తమ మనిషిని కూడా అతి సులువుగా చంపేస్తూ వుంటారు. కొంతమంది విలన్లు సూటూ బూటూ వేసుకుని పైకి బాగా మంచివాళ్లుగానే కనిపించినా వాళ్లు చేసేవన్నీ దుర్మార్గపు పనులే. కొంతమందయితే నల్ల కల్లజోళ్లు పెట్టుకునో, ఒక కన్ను లేకుండానో, చెంపమీద పెద్ద గాటుతోనో, ఒక చెయ్యి లేదా ఒక కాలు లేనివాళ్లుగానో కనిపించి అసలు సిసలు విలన్లు తామే అనిపిస్తుంటారు. ఈ ప్రతినాయకుల ముఖ్య కర్తవ్యం హీరో హీరోయిన్లని తిప్పలు పెట్టడం, వాళ్లు కలుసుకోకుండా చూస్తూ రీళ్లని పెంచడం. ఈ పనికోసం సినిమా ఆరంభం నుంచి ఆఖరుదాకా హీరోయిన్ వంక కోరచూపులు చూస్తూవుంటారు. ఈ విలన్లకు గుర్రపుస్వారీ, ఫైట్లు అన్నీ బాగావచ్చు. హీరోకంటే కూడా వాటిలో అతడికి ఎక్కువ సామర్థ్యం వుంటుంది. కండబలంతో పాటు తెలివితేటలూ ఎక్కువే. అయితే రచయితా, దర్శకుడూ, కథా - వీళ్లంతా కుట్రతో విలన్నే ఎప్పుడూ ఓడిస్తూ వుంటారు. సినిమా ఆఖర్న విసిగిపోయిన విలన్ చావనైనా చస్తాడు లేదంటే పోలీసులతో సంకెళ్లయినా వేయించుకుంటాడు. లేదంటే బుద్ధి వచ్చిందని లెంపలేసుకుంటాడు. మొత్తానికి ఈ విలనే లేకపోతే హీరోగారి హీరోయిజం బయటపడదు కాబట్టి నూటికి తొంభై అయిదు సినిమాలకి ఈ విలనే ఆధారం.
ఇప్పుడిదంతా చెప్పడం ఎందుకంటే ఇంతటి ప్రాధాన్యత వున్న విలన్ పాత్రధారుల్ని ఇవాళ మన సినిమావాళ్లు చిన్నచూపు చూస్తున్నారని. అలనాటి గోవిందరాజుల సుబ్బారావు నుంచి ఇప్పటి జయప్రకాశ్‌రెడ్డి దాకా విలనిజాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నా వాళ్లకి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పటివాళ్లు చాలా మెరుగు. గోవిందరాజుల సుబ్బారావు, సీఎస్సార్ ఆంజనేయులు, ధూళిపాళ, ఎస్వీ రంగారావు, ముక్కామల, రాజనాల, జగ్గయ్య, ఆర్. నాగేశ్వరరావు, నాగభూషణం, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు వంటి విలన్ పాత్రధారులకి పేరు ప్రతిష్ఠలూ, గౌరవమూ దక్కాయి. శకుని పాత్ర పోషణలో సీఎస్సార్, ధూళిపాళ; విశ్వామిత్ర పాత్రలో ముక్కామల; రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రల్లో ఎస్వీ రంగారావు; దుష్ట మాంత్రికుడి పాత్రలో ఎస్వీ రంగారావు, రాజనాల; దుష్ట సైన్యాధిపతి పాత్రలో రాజనాల; 'అల్లూరి సీతారామరాజు'లో బ్రిటీష్ అధికారి రూథర్‌ఫర్డ్ పాత్రలో జగ్గయ్య పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఎస్వీ రంగారావు కేవలం దుష్ట పాత్రల్లోనే కాకుండా సాత్త్విక పాత్రల్లోనూ గొప్పగా రాణించి మహానటుడు అనిపించుకున్నారు.
ఆయన తర్వాత అట్లాంటి ఖ్యాతి కైకాల సత్యనారాయణకీ, కోట శ్రీనివాసరావుకీ దక్కింది. హీరోగా వచ్చి విలన్‌గా నిలదొక్కుకొని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రూపాంతరం చెందిన సత్యనారాయణని అందుకే అందరూ 'నవరస నటనాసార్వభౌమ' అనేది. కేవలం డైలాగ్ మాడ్యులేషన్‌తోటే విలన్లుగా గొప్పగా రాణించినవాళ్లు నాగభూషణం, రావు గోపాలరావు. సీరియస్ విలనిజంలో హాస్యాన్ని జోడించి మాటని విరిచి మాట్లాడే నాగభూషణాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. డైలాగుల్లో గోదావరి యాసని జోడించి కొన్ని మాటల్ని వత్తి పలుకుతూ విలన్‌గా రావు గోపాలరావు కొత్త రూపంతో కనిపించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. 'ముత్యాల ముగ్గు', 'యమగోల' చిత్రాల్లో ఆయన డైలాగుల్ని ఇప్పటికీ చాలామంది తెలుగువాళ్లు మరచిపోలేదు. 'అహ నా పెళ్లంట'లో పిసినారి విలన్‌గా, 'గాయం'లో గుండు విలన్‌గా కోట శ్రీనివాసరావు నటనకి శభాష్ అన్నారు ప్రేక్షకులు. ఒక్క విలన్‌గానే కాక హాస్య పాత్రల్లోనూ, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తను తక్కువవాణ్ణి కానని కోట నిరూపించుకున్నారు. (ఇంకావుంది)

Sunday, December 5, 2010

సినిమా: కనకదుర్గ పూజా మహిమ (1960)

తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ
రచన: జి. కృష్ణమూర్తి
సంగీతం: రాజన్-నాగేంద్ర
నిర్మాత, దర్శకుడు: బి. విఠలాచార్య
బేనర్: విఠల్ ప్రొడక్షన్స్
కథ: మణిశిలాదేశపు మహారాణి ఎంతో కాలానికి గర్భం ధరించిందన్న సంతోషంలో మహారాజు కులదేవతైన కనకదుర్గ పూజకు వెళ్లక ఆ తల్లిని చులకన చేస్తాడు. దాంతో నిండు చూలాలైన మహారాణి అడవుల పాలయ్యింది. రాజ్యభారం బావమరిది సేనాధిపతి నరేంద్రునికి అప్పగించి మహారాణికి వెదకడానికి బయలుదేరి దారీతెన్నూ తోచక అల్లాడుతుంటాడు రాజు. అరణ్యాలలో కుమారుణ్ణి కన్న రాణి ఒక ముని కోపానికి గురై ఆయన శాపంవల్ల భల్లూకమై పోతుంది. ఆ దారిని కనకదుర్గ పూజ చేసుకుని వస్తున్న ఒక పుణ్యదంపతులకు ఆ బిడ్డ దొరకగా మాధవుడని పేరుపెట్టి అల్లారుముద్దుగా తమ కుమారుడైన త్రిలోకంతో పెంచుకొస్తారు. రాజులేని రాజ్యానికి నరేంద్రుడు రాజైపోతాడు. అతనికి మాలతి ఒక్కతే సంతానం. రోజురోజుకి దేశంలో మారుమోగిపోతున్న మాధవుని వీరత్వం ఆమె వింటుంది. ఒకనాడు తన ప్రాణాలు మాధవుడు కాపాడగా అతనికి హృదయం అర్పిస్తుంది.
సిద్ధేంద్రుడనే కపాలకుని వద్ద శిష్యరికం చేసి సకల విద్యలూ సంపాదించిన మేఘనాథుడనే వీరుడు మాయావతి అనే మునికన్యను బలవంతం చేస్తాడు. గురువు మందలిస్తే ఆ శిష్యుడు గురువునే మంత్రబద్ధునిగా చేస్తాడు. ఆ గురుద్రోహికి తగిన శిక్ష విధించాలని సిద్ధేంద్రుడు సర్వసిద్ధికి మార్గం చెబుతాడు. దానికి ఒక అదృష్టజాతకుడైన మహారాజు అవసరం పడుతుంది. మేఘనాథుని దృష్టికి నరేంద్రుడు గోచరిస్తాడు. భార్యావిహీనుడైన ఆ మహారాజును మాయావతి మూలంగా వశం చేసుకోవచ్చని ఆలోచించి మాయావతిని మంత్రబద్ధం చేసి మారురూపంతో మేఘనాథుడు మణిశిలాదేశం ప్రవేశిస్తాడు.
మేఘనాథుని ప్రగల్భాలు విని మాధవుడు అతనిని ఓడించాలని ప్రయత్నించి మంత్రశక్తివల్ల ఓడిపోతాడు. మహారాజు మేఘనాథునికి పాదపూజ చేయ నిశ్చయించుకుంటాడు. కాని మాధవుడు మందలిస్తూ మేఘనాథుని ఓడించడానికి ఒక సంవత్సరం గడువు తీసుకుంటాడు. రాకుమారి అతని పట్టుదలకు ఆనందిస్తుంది. కృతజ్ఞతగా అతనిని ఆనాడే గాంధర్వ వివాహం చేసుకుంటుంది.
ఈలోగా సేనాని మార్తాండవర్మ రాజ్య ప్రలోభంతో మేఘనాథుడు పన్నిన వలలోపడి మహారాజును హత్యచేయ యత్నిస్తాడు. యత్నం విఫలంకాగానే నేర్పుగా నేరం నిర్దోషియైన మాధవుని మీదికి తోస్తాడు. మాధవునికి మహారాజు ఉరిశిక్ష విధిస్తాడు. మాధవుడు తన తమ్ముని సహాయంతో వధ్యస్థానం నుంచి తప్పించుకుని పారిపోతాడు.
మేఘనాథుని ఆటకట్టే అధినాధుడే లేకపోతాడు. ప్రతి పౌర్ణమినాడు మాయను నాగుగా మార్చి తన బాటకు అడ్డుగావున్న వారిని తొలగిస్తుంటాడు. ప్రతి పర్ణమినాడు ఒక్కొక్కరు సర్పద్రష్టలై చనిపోతుంటారు.
పారిపోయిన మాధవుడు తన తమ్మునితో నానా అగచాట్లు పడతాడు. మోహిని చేతిలో చిక్కి తన తమ్ముని వల్ల ప్రమాదం నుంచి బయటపడతాడు. చివరకు సిద్ధేంద్రుడున్న గుహకు చేరుకుంటాడు.
మేఘనాథుడు అమాత్యుని, సేనానిని పాముకాట్లతో చంపిస్తాడు. రాకుమారి గర్భిణీ అని గ్రహించి ఆమె అంతఃపురంలో వుంటే దేశానికే అరిష్టమని రాజుతో చెబుతాడు. రాజు అతని సలహా ప్రకారం కుమార్తెను జలపాతంలో తోయిస్తాడు. నదిలో కొట్టుకుపోతున్న ఆ చూలాలిని ఒక భల్లూకం రక్షిస్తుంది.
మాధవుడు త్రిలోకంతో ఎన్నో అవాంతరాలు గడచి భూతాల్ని పిశాచాల్ని జయించి సిద్ధేంద్రుని కనిపెడతాడు. మంత్రబద్ధుడైన అతన్ని విడుదలచేసి అతని వద్దనున్న అన్ని విద్యలూ అభ్యసిస్తాడు. కానీ అతనికి సర్వసిద్ధి లభించదు. కనకదుర్గ కనికరం లేనందున సిద్ధి లభించలేదని గురువు చెప్పగా మాధవుడు నిరాశ చెందుతాడు.

Friday, November 12, 2010

సినిమా: మాంగల్యం (1960)

తారాగణం: కాంతారావు, రామకృష్ణ, దేవిక, రాజనాల, బాలకృష్ణ (అంజి), రాజశ్రీ, హేమలత
రచన: ఆత్రేయ
నిర్మాత: ఎం.ఎ. వేణు
దర్శకుడు: బి.ఎస్. నారాయణ
బేనర్: ఎం.ఎ.వి. పిక్చర్స్
విడుదల తేది: అక్టోబర్ 13
కథ: ఎంబీబీయస్ డాక్టర్ కుమార్ (కాంతారావు) పనిపిల్ల సరళ (దేవిక)ను గాఢంగా ప్రేమించి పెద్దలకు తెలీకుండా గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కాని అతడి తల్లి (హేమలత) కక్షతో ఇద్దరినీ విడదీస్తుంది. అమాయక సరళ చిమ్మ చీకటిలో దోవతప్పి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఒక నాటక కంపెనీలో చేరి, డాక్టరంత అంతస్థు సంపాదించి, డాక్టర్ అర్థాంగి కావడానికి అంతా సిద్ధం చేసుకుంటుంది. కాని కంపెనీ యజమాని (రాజనాల) రివాల్వర్ దెబ్బ ఆ ఆశను ఒక్క అడుగుదూరంలో అడుగంటింపజేస్తుంది. కుమార్ మాంగల్యం కట్టడం సరళ కడసారి కోర్కె అని ఎవరో చెప్పగా విన్న కుమార్ మాంగల్యం కడతాడు కానీ పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురు వొరిగిపోతుంది. విడి, తిరిగి ముడివడిన జంట, చివరికి శాశ్వతంగా విడిపోతుంది.
విశేషాలు: దర్శకుడు బి.ఎస్. నారాయణకు ఇది తొలి చిత్రం.