Showing posts with label balakrishna. Show all posts
Showing posts with label balakrishna. Show all posts
Wednesday, January 13, 2016
Friday, November 13, 2015
Is DICTATOR going to be another LEGEND?
'డిక్టేటర్' మరో 'లెజెండ్' అవుతాడా?
'సింహా' తర్వాత చాన్నాళ్ల దాకా మళ్లీ హిట్ లేకపోవడంతో రేస్ నుంచి బాలకృష్ణ పూర్తిగా తొలగిపోయాడనుకున్నాయి వైరి వర్గాలు (వీవీ). అవి చంకలు గుద్దుకుంటూ ఉండగానే 'లెజెండ్'ని అంటూ వచ్చాడు. ఈయనేం లెజెండ్? అందరివాడనుకున్న వాణ్ణే కొందరివాడుగా మిగిల్చిన జనం బాలయ్యను 'లెజెండ్'గా ఒప్పుకుంటారా?.. అని వైరి వర్గాలు కుప్పిగంతులు వేశాయి. ఏమైంది? మూతులు పగిలాయి. 'లెజెండ్'గా బాలయ్యను జనం ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు. ఆ సినిమా కాస్తా ఆయన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు వసూలుచేసి పెట్టింది. అందులో బాలయ్య డబుల్రోల్ చేసి మెప్పించాడు. దాని తర్వాత 'లయన్'గా వచ్చిన బాలయ్యను జనం యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆల్రెడీ 'సింహా'గా నిన్ను ఒప్పేసుకున్నాం కదా, మళ్లీ భాష మార్చి 'లయన్'గా రావడమెందుకని అడిగేశారు జ్జనం. వైరి వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇప్పుడు బాలయ్య 'డిక్టేటర్'ని అంటున్నాడు. ఈ రోజుల్లో డిక్టేటర్షిప్ నడవదు కాబట్టి జనం ఈ సినిమాని మడతపెట్టేస్తారని అప్పుడే వీవీ ప్రచారం చేసేస్తోంది. మీరెంతగా నెగటివ్ ప్రచారం చేస్తే నాకంతగా మంచిదన్నట్లు చిద్విలాసంగా ఉన్నాడు బాలయ్య. ఎందుకంటే ఆయన 'డిక్టేటర్'గా ఉండేది దుష్టులకని వీవీకి తెల్వదు కాబట్టి. ఇంతకు ముందే 'లౌక్యం' అనే జనం మెచ్చిన సినిమా తీసిన శ్రీవాస్ 'డిక్టేటర్'ను తీర్చిదిద్దుతున్నాడు. కోన వెంకట్, గోపీమోహన్ కలిసి ఇచ్చిన స్క్రిప్ట్ కాబట్టి మినిమం గ్యారంటీ సినిమా అని ఆయన బల్లలు విరిగిపోయేంత గట్టిగా చెబుతున్నాడు. పైగా ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీతో కలిసి ఆయన స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దానికోసం వేదాశ్వ క్రియేషన్స్ అనే బేనర్ని కూడా పెట్టాడు. 'డిక్టేటర్'లో బాలయ్య ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో జత కడుతున్నాడు. వాళ్లు.. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష. ఇక జనానికి వినోదాల విందే అని యూనిట్వాళ్లు అంటున్నాయి. వీవీకి మరోసారి శృంగభంగం తప్పదని వాళ్లు ఘంటాపథంగా చెబుతున్నారు.Thursday, October 23, 2014
Thursday, July 10, 2014
Sunday, December 29, 2013
Saturday, December 14, 2013
Saturday, June 30, 2012
హై వోల్టేజ్ కేరక్టర్లో బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారు. శేఖర్రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దీక్షాసేథ్ నాయిక. డా.ఎం.మోహన్బాబు సమర్పిస్తున్నారు. మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ "విజయవంతమైన చిత్రానికి కావాల్సిన అన్ని హంగులతో మా చిత్రం సర్వసన్నద్ధమవుతోంది. మా అన్నయ్య బాలకృష్ణగారి పాత్రకి హై ఓల్టేజ్ స్పందన వస్తుందనడంలో అనుమానం లేదు. మహిళా ప్రేక్షకులకు, యువతకు విపరీతంగా నచ్చుతుంది. మనోజ్ మంచి పెర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ఫుల్ ప్రామిసింగ్ స్టార్గా ఎదుగుతాడు. బోబోశశి సంగీతానికి మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో కీలక పాత్రలో నేను నటించాను. వచ్చేనెల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు. ప్రభు, సోనూసూద్ తదితరులు ఇతర పాత్రధారులు.
Monday, June 25, 2012
స్విట్జర్లాండ్లో 'శ్రీమన్నారాయణ'
నందమూరి బాలకృష్ణ హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ సంస్థ రవికుమార్ చావలి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్లో జరుగుతోంది.
షూటింగ్ వివరాలను నిర్మాత రమేష్ పుప్పాల వెల్లడిస్తూ 'ఈ నెల 18న ప్రారంభమైన షూటింగ్ 28 వరకూ జరుగుతుంది. మలేషియాలో ఒక పాట, ఫైట్ తీశాం. ఇవి రెండూ బాగా వచ్చాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్, ఇటలీలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం, దీంతో చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారితో 'శ్రీమన్నారాయణ' వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు, అభిమానులు బాలయ్యబాబు నుంచి ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి' అన్నారు.
పార్వతీమెల్టన్, ఇషాచావ్లా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయకుమార్, సురేష్, వినోద్కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్రెడ్డి, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, ఫొటోగ్రఫీ: సురేందర్రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: పుప్పాల రమేష్, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
Thursday, June 21, 2012
'దేనికైనా రెడీ'లో ప్రభాస్ నాకు డబ్బింగ్ చెబుతున్నాడు
"ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరో ప్రభాస్ని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్కి ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు '' అని చెప్పారు మంచు విష్ణు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా. మోహన్బాబు నిర్మిస్తున్న 'దేనికైనా రెడీ'లో ఆయన హీరోగా నటిస్తున్నారు. హన్సిక నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా జరిపిన సంభాషణలో ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలతో పాటు, మరికొన్ని ఆసక్తికర విషయాల్ని తెలియజేశారు విష్ణు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'దేనికైనా రెడీ' మూడు పాటలు మినహా సినిమా పూర్తయింది. తమ్ముడు మనోజ్ సినిమా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' విడుదలయ్యాక ఆ మూడు పాటలూ తీస్తాం. జూలై చివరలో పాటల్నీ, ఆగస్టులో సినిమానీ విడుదల చేస్తాం. యూరప్లో రెండు పాటల్నీ, హైదరాబాద్లో ఓ పాటనీ తీద్దామనుకుంటున్నాం. ఒకవేళ యూరప్కి వెళ్లకపోతే, వాటిని కేరళలో తీస్తాం.
అమ్మ సెంటిమెంట్
ఇది ఫ్యామిలీ నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రం. కథంతా కర్నూలులో జరుగుతుంది. ఈ సినిమా లైన్ బీవీఎస్ రవి చెబితే, అతనితో కలిసి కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్టు డెవలప్ చేశారు. మాటలు మరుధూరి రాజా రాశారు. 'ఢీ'కి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దానికి ట్యాగ్లైన్గా ఉపయోగించిన 'దేనికైనా రెడీ'నే టైటిల్గా పెట్టాం. ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. దానితో పాటు చక్కని సెంటిమెంట్ కూడా ఉంది. అది తల్లీ కొడుకుల సెంటిమెంట్. నా తల్లిగా సీత, తండ్రిగా సుమన్ చేశారు. నా తల్లి హిందు అయితే, తండ్రి ముస్లిం. హన్సిక తండ్రిగా ప్రభు చేశారు. విలన్గా కోట శ్రీనివాసరావు చేశారు.
ఇందులోనూ బ్రహ్మానందమే
ఈ సినిమాని 'ఢీ'కి సీక్వెల్ అనొచ్చు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామికల్గా ఉంటుంది. 'ఢీ'కి బ్రహ్మానందం కేరక్టర్ ఎంత ఎస్సెట్ అయ్యిందో తెలిసిందే. ఇందులోనూ ఆయన నాతో పాటే ఉంటారు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామెడీ ఆ కేరక్టర్లో ఉంది. అందులో 'రావుగారూ నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి' అనే మేనరిజమ్తో నవ్వించిన ఆయన ఇందులోనూ ఓ మేనరిజమ్తో తెగ నవ్విస్తారు. హన్సికతో మొదటిసారి పనిచేశా. ఇప్పటివరకూ నేను పనిచేసిన హీరోయిన్లందరిలోకీ బ్యూటిఫుల్ గర్ల్. ప్రొఫెషనల్గా బ్రిలియంట్. ఆమెతో పనిచేయడం నాకెంతో సౌకర్యంగా అనిపించింది. శ్రీను వైట్ల తర్వాత అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి అని చాలామంది అన్నారు. ఆయన్ని అనుకున్నప్పుడు శ్రీను వైట్ల కూడా 'వెరీగుడ్ చాయిస్ విష్ణు. ఆయన బ్రిలియంట్గా చేస్తారు' అని చెప్పారు. ఆయనకు మ్యూజిక్ సెన్స్ కూడా బాగా ఎక్కువ. 'ఢీ'కి శ్రీను గారితో ఎంతగా ఎంజాయ్ చేశానో, ఆయన తర్వాత ఇప్పటివరకు నేను ఎంజాయ్ చేసిందీ, అంత కాన్ఫిడెంట్గా ఉందీ ఈ సినిమాకే.
ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి
ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలున్నాయి. ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరోని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్కి ఆ హీరోనే డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అతనెవరో కాదు ప్రభాస్. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన విక్రమ్ (ఎమ్మెస్ నారాయణ కుమారుడు)ను యంగ్ విలన్గా పరిచయం చేస్తున్నాం. సినిమాలో ఆరు పాటలుంటాయి. ఇప్పటికి రెండు పాటల్ని తీశాం. ఒకటి మాంటేజ్ సాంగ్గా వస్తుంది. చక్రి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా సన్నిహిత మిత్రుడు, దేశంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన యువన్శంకర్ రాజా రెండు పాటలకు ట్యూన్లు ఇచ్చారు. అందుకు ఆయనకి థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక యాక్షన్ సన్నివేశాల్ని సెల్వ మాస్టర్ ఆధ్వర్యంలో చేశాం. నేనెంతో ఇష్టపడి చేశా. ఇటీవలే క్లైమాక్స్ ఫైట్ చేశాం. చాలా గొప్పగా వచ్చింది. మొత్తం నాలుగు ఫైట్లు. ఒకటి తిరుపతిలో, ఒకటి కాళహస్తిలో, రెండు హైదరాబాద్లో తీశాం.
తమిళంలోనూ అడుగేస్తున్నా
ఈ సినిమా నుంచి తమిళంలోకి అడుగు పెట్టబోతున్నా. ఇక ప్రతి సినిమా తమిళంలోనూ రిలీజ్ చేస్తాం. బాలీవుడ్లోకి ఇప్పుడే వెళ్లే అవకాశం లేదు. ఇంట గెలిచాక అప్పుడు రచ్చ సంగతి చూద్దాం. నాలుగేళ్ల తర్వాత ఇతను తెలుగు నటుడనీ, అతను తమిళ నటుడనీ, హిందీ నటుడనీ భేదాలు ఉండవు. నటుడికి భాషాభేదం అనేది తొలగిపోతుంది. ఉత్తరాది వాళ్లు కూడా కేరక్టర్లకి ఇక్కడి నటుల్ని తీసుకోవాల్సిందే. నా కెరీర్లో 'ఢీ' ఒక్కటే బిగ్ హిట్. 'వస్తాడు నా రాజు' రాంగ్ టైమ్లో రిలీజ్ కావడం వల్ల ఫెయిలైంది. 'దేనికైనా రెడీ' మీద చాలా నమ్మకంతో ఉన్నాం. దీని తర్వాత నాన్నగారి సలహాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా నా కెరీర్ను ప్లాన్ చేసుకోబోతున్నా.
నలుగురు హీరోల సినిమా
'దేనికైనా రెడీ' తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మరో సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఇందులో నేను కాకుండా మరో ముగ్గురు నా తరానికి చెందిన హీరోలుంటారు. అంటే మొత్తం నలుగురు హీరోలు. విలన్ కేరక్టర్ను నాన్నగారు చేస్తారు. సురేందర్రెడ్డి సినిమాలకి సహ దర్శకుడిగా పనిచేసిన తూప్రాన్ శ్రీను చెప్పిన స్క్రిప్టు చాలా బాగా నచ్చింది. అతన్ని శ్రీను వైట్ల పంపించారు. ఇది కామెడీ యాక్షన్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల తరహాలో హీరోయిన్తో డ్యూయెట్లు పాడుకోవడం వంటివి ఇందులో ఉండవు. ఇలాంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయి. రెండు వారాల్లోగా మిగతా ముగ్గురు హీరోలెవరో ప్రకటిస్తాం. వాళ్లు నా స్నేహితులే.
బాలయ్యకు హ్యాట్సాఫ్
నేను, మనోజ్ కలిసి నటించడం ఇప్పుడల్లా జరగదు. అది కష్టం. ఏమన్నా అవకాశాలుంటే అది కె. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసే పౌరాణిక చిత్రం 'రావణ'లో ఉన్నాయి. కచ్చితంగా చెప్పలేను. అందులో నాన్నగారు టైటిల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా మనోజ్ కెరీర్కీ, నిర్మాతగా లక్ష్మి కెరీర్కీ 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా చాలా ముఖ్యం. అందుకే దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనోజ్ చేసినవి సన్నని లైన్మీద నడిచిన కథలే. అంతా అతని షోనే కనిపిస్తుంది. తొలిసారి అద్భుతమైన కథలో చేస్తున్నాడు. బాలకృష్ణ గారి కేరక్టర్ హైలైట్ అవుతుంది సినిమాకి. ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకూ, ఆ పాత్రని చేసిన విధానానికీ హ్యాట్సాఫ్. ఈ తరహా పాత్ర చెయ్యడం ఆయనకు ఇదే తొలిసారి.
'దేనికైనా రెడీ' మూడు పాటలు మినహా సినిమా పూర్తయింది. తమ్ముడు మనోజ్ సినిమా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' విడుదలయ్యాక ఆ మూడు పాటలూ తీస్తాం. జూలై చివరలో పాటల్నీ, ఆగస్టులో సినిమానీ విడుదల చేస్తాం. యూరప్లో రెండు పాటల్నీ, హైదరాబాద్లో ఓ పాటనీ తీద్దామనుకుంటున్నాం. ఒకవేళ యూరప్కి వెళ్లకపోతే, వాటిని కేరళలో తీస్తాం.
అమ్మ సెంటిమెంట్
ఇది ఫ్యామిలీ నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రం. కథంతా కర్నూలులో జరుగుతుంది. ఈ సినిమా లైన్ బీవీఎస్ రవి చెబితే, అతనితో కలిసి కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్టు డెవలప్ చేశారు. మాటలు మరుధూరి రాజా రాశారు. 'ఢీ'కి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దానికి ట్యాగ్లైన్గా ఉపయోగించిన 'దేనికైనా రెడీ'నే టైటిల్గా పెట్టాం. ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. దానితో పాటు చక్కని సెంటిమెంట్ కూడా ఉంది. అది తల్లీ కొడుకుల సెంటిమెంట్. నా తల్లిగా సీత, తండ్రిగా సుమన్ చేశారు. నా తల్లి హిందు అయితే, తండ్రి ముస్లిం. హన్సిక తండ్రిగా ప్రభు చేశారు. విలన్గా కోట శ్రీనివాసరావు చేశారు.
ఇందులోనూ బ్రహ్మానందమే
ఈ సినిమాని 'ఢీ'కి సీక్వెల్ అనొచ్చు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామికల్గా ఉంటుంది. 'ఢీ'కి బ్రహ్మానందం కేరక్టర్ ఎంత ఎస్సెట్ అయ్యిందో తెలిసిందే. ఇందులోనూ ఆయన నాతో పాటే ఉంటారు. 'ఢీ' కంటే పది రెట్లు ఎక్కువ కామెడీ ఆ కేరక్టర్లో ఉంది. అందులో 'రావుగారూ నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి' అనే మేనరిజమ్తో నవ్వించిన ఆయన ఇందులోనూ ఓ మేనరిజమ్తో తెగ నవ్విస్తారు. హన్సికతో మొదటిసారి పనిచేశా. ఇప్పటివరకూ నేను పనిచేసిన హీరోయిన్లందరిలోకీ బ్యూటిఫుల్ గర్ల్. ప్రొఫెషనల్గా బ్రిలియంట్. ఆమెతో పనిచేయడం నాకెంతో సౌకర్యంగా అనిపించింది. శ్రీను వైట్ల తర్వాత అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి అని చాలామంది అన్నారు. ఆయన్ని అనుకున్నప్పుడు శ్రీను వైట్ల కూడా 'వెరీగుడ్ చాయిస్ విష్ణు. ఆయన బ్రిలియంట్గా చేస్తారు' అని చెప్పారు. ఆయనకు మ్యూజిక్ సెన్స్ కూడా బాగా ఎక్కువ. 'ఢీ'కి శ్రీను గారితో ఎంతగా ఎంజాయ్ చేశానో, ఆయన తర్వాత ఇప్పటివరకు నేను ఎంజాయ్ చేసిందీ, అంత కాన్ఫిడెంట్గా ఉందీ ఈ సినిమాకే.
ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి
ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలున్నాయి. ఇందులో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరోని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్కి ఆ హీరోనే డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అతనెవరో కాదు ప్రభాస్. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన విక్రమ్ (ఎమ్మెస్ నారాయణ కుమారుడు)ను యంగ్ విలన్గా పరిచయం చేస్తున్నాం. సినిమాలో ఆరు పాటలుంటాయి. ఇప్పటికి రెండు పాటల్ని తీశాం. ఒకటి మాంటేజ్ సాంగ్గా వస్తుంది. చక్రి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా సన్నిహిత మిత్రుడు, దేశంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన యువన్శంకర్ రాజా రెండు పాటలకు ట్యూన్లు ఇచ్చారు. అందుకు ఆయనకి థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక యాక్షన్ సన్నివేశాల్ని సెల్వ మాస్టర్ ఆధ్వర్యంలో చేశాం. నేనెంతో ఇష్టపడి చేశా. ఇటీవలే క్లైమాక్స్ ఫైట్ చేశాం. చాలా గొప్పగా వచ్చింది. మొత్తం నాలుగు ఫైట్లు. ఒకటి తిరుపతిలో, ఒకటి కాళహస్తిలో, రెండు హైదరాబాద్లో తీశాం.
తమిళంలోనూ అడుగేస్తున్నా
ఈ సినిమా నుంచి తమిళంలోకి అడుగు పెట్టబోతున్నా. ఇక ప్రతి సినిమా తమిళంలోనూ రిలీజ్ చేస్తాం. బాలీవుడ్లోకి ఇప్పుడే వెళ్లే అవకాశం లేదు. ఇంట గెలిచాక అప్పుడు రచ్చ సంగతి చూద్దాం. నాలుగేళ్ల తర్వాత ఇతను తెలుగు నటుడనీ, అతను తమిళ నటుడనీ, హిందీ నటుడనీ భేదాలు ఉండవు. నటుడికి భాషాభేదం అనేది తొలగిపోతుంది. ఉత్తరాది వాళ్లు కూడా కేరక్టర్లకి ఇక్కడి నటుల్ని తీసుకోవాల్సిందే. నా కెరీర్లో 'ఢీ' ఒక్కటే బిగ్ హిట్. 'వస్తాడు నా రాజు' రాంగ్ టైమ్లో రిలీజ్ కావడం వల్ల ఫెయిలైంది. 'దేనికైనా రెడీ' మీద చాలా నమ్మకంతో ఉన్నాం. దీని తర్వాత నాన్నగారి సలహాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా నా కెరీర్ను ప్లాన్ చేసుకోబోతున్నా.
నలుగురు హీరోల సినిమా
'దేనికైనా రెడీ' తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మరో సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఇందులో నేను కాకుండా మరో ముగ్గురు నా తరానికి చెందిన హీరోలుంటారు. అంటే మొత్తం నలుగురు హీరోలు. విలన్ కేరక్టర్ను నాన్నగారు చేస్తారు. సురేందర్రెడ్డి సినిమాలకి సహ దర్శకుడిగా పనిచేసిన తూప్రాన్ శ్రీను చెప్పిన స్క్రిప్టు చాలా బాగా నచ్చింది. అతన్ని శ్రీను వైట్ల పంపించారు. ఇది కామెడీ యాక్షన్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల తరహాలో హీరోయిన్తో డ్యూయెట్లు పాడుకోవడం వంటివి ఇందులో ఉండవు. ఇలాంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయి. రెండు వారాల్లోగా మిగతా ముగ్గురు హీరోలెవరో ప్రకటిస్తాం. వాళ్లు నా స్నేహితులే.
బాలయ్యకు హ్యాట్సాఫ్
నేను, మనోజ్ కలిసి నటించడం ఇప్పుడల్లా జరగదు. అది కష్టం. ఏమన్నా అవకాశాలుంటే అది కె. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసే పౌరాణిక చిత్రం 'రావణ'లో ఉన్నాయి. కచ్చితంగా చెప్పలేను. అందులో నాన్నగారు టైటిల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా మనోజ్ కెరీర్కీ, నిర్మాతగా లక్ష్మి కెరీర్కీ 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా చాలా ముఖ్యం. అందుకే దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనోజ్ చేసినవి సన్నని లైన్మీద నడిచిన కథలే. అంతా అతని షోనే కనిపిస్తుంది. తొలిసారి అద్భుతమైన కథలో చేస్తున్నాడు. బాలకృష్ణ గారి కేరక్టర్ హైలైట్ అవుతుంది సినిమాకి. ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకూ, ఆ పాత్రని చేసిన విధానానికీ హ్యాట్సాఫ్. ఈ తరహా పాత్ర చెయ్యడం ఆయనకు ఇదే తొలిసారి.
Tuesday, June 12, 2012
బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా
"బాలకృష్ణకు రెండేళ్ల క్రితం 'నరసింహస్వామి' అనే కథ చెప్పా. ఓకే అయ్యింది. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా. బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా'' అని చెప్పారు దర్శకుడిగా మారిన నటుడు జీవీ సుధాకరనాయుడు. ఆయన రాబోయే రోజుల్లో తన ప్రణాళికల గురించి పత్రికల వారికి తెలియజేశారు. "త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టి అనిల్కపూర్, నానాపటేకర్, రేఖ కాంబినేషన్లో 'శత్రు' అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా'' అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు బయటి బేనర్లలో 'హీరో', 'రంగ ది దొంగ' సినిమాల్ని డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సొంతంగా జీవీ మూవీస్ అనే బేనర్ను నెలకొల్పారు.
"ఈ బేనర్పై తొలిసారిగా 'రెడ్డిగారి మనవడు' అనే సినిమాని నిర్మించబోతున్నా. 'ద ప్రిన్స్ ఆఫ్ రాయలసీమ!' అనేది ఉప శీర్షిక. దీనికి నేను నిర్మాతను మాత్రమే. ఓ సీనియర్ డైరెక్టర్ దీన్ని రూపొందిస్తారు. కథ నాదే. టైటిల్ ప్రకారం రాయలసీమకు చెందిన ఓ పవర్ఫుల్ రెడ్డిగారు, ఆయన మనవడి చుట్టూ నడిచే కథ. రెడ్డిగారు ఏ రోజున పుట్టారో అదే రోజు మనవడు కూడా పుడతాడు. తాత ఎంత నీచుడో మనవడు అంతకంటే నీచుడు. 'దండంపెట్టి ఓటడిగేవాడు అన్నం పెడతానంటేనే ఓటెయ్' అని జనానికి చెబుతుంటాడు హీరో. రాయలసీమ ఫ్యాక్షన్, దాని ద్వారా వచ్చే అధికారం, దాన్ని ఉపయోగించుకుని సంపాదించే డబ్బు... వీటి చుట్టూ అల్లిన కథ. ఇందులో ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ కూడా ఉంది. రెడ్డిగారికి ప్రత్యర్థి అయిన చౌదరి కూతురు, హీరో ప్రేమించుకోవడం, వారి ప్రేమకూ, రాజకీయాలకూ లంకె ఉండటం ఇందులోని ఇంటరెస్టింగ్ పాయింట్. రాజకీయం వ్యాపార స్థాయికి ఎలా ఎదిగిందో ఈ కథలో చెబుతున్నా. వచ్చే ఉప ఎన్నికల ఫలితాల్ని బట్టి ఈ కథకు క్లైమాక్స్ రాస్తా. అప్పుడే హీరోకి పేరు పెడతా. రెడ్డిగారి పాత్రకు కోట శ్రీనివాసరావును అనుకుంటున్నాం. హీరో ఛాయిస్ను డైరెక్టర్కి వదిలేస్తున్నా. ఇందులో ప్రకాశ్రాజ్, శరత్కుమార్, బ్రహ్మానందం, జయసుధ, రమ్యకృష్ణ, ముమైత్ఖాన్ తదితరులు నటిస్తున్నారు. చక్రి సంగీతం సమకూర్చబోతున్నారు'' అని తెలిపారు జీవీ. ఈ సినిమా వివాదాల్ని రేకెత్తించే అవకాశాలున్నాయి కదా అనడిగితే "తప్పకుండా కాంట్రవర్సీ అవుతుంది. అవనీయండి. అవ్వాలనే కోరుకుంటున్నా'' అని ఆయన చెప్పారు.
Friday, June 8, 2012
బాలకృష్ణ ఇంట్లో చోరీ
ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ ఇంట్లో చోరీ జరిగింది. 35 తులాల బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గతనెల 24వ తేదీన బాలకృష్ణ సతీమణి వసుంధర, పిల్లలు విహారయాత్రలకు వెళ్లారు. 30వ తేదీన బాలకృష్ణ షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. అయితే వసుంధర వెళ్లేటప్పుడు తన సోదరి భర్త ప్రసాద్కు తాళం ఇచ్చి ఇంట్లో కొన్ని మరమ్మతులు చేయించాలని కోరారు. ప్రసాద్ తన భార్యతో కలసి బుధవారం బాలకృష్ణ ఇంటికెళ్లారు. అక్కడి నుంచి వసుంధరకు ఫోన్ చేసి ఎక్కడ మరమ్మతులు చేయించాలో అడిగారు. ఆ సమయంలో వసుంధర తాను ఒక గదిలో బంగారు ఆభరణాలు ఉంచాననీ, ఒకసారి చూడాలని కోరారు. ఆ గదిలోకి వెళ్లి చూస్తే ఆభరణాలు కనిపించలేదు. దాంతో ఇంట్లో చోరీ జరిగిందని భావించిన ప్రసాద్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Saturday, June 2, 2012
'అధినాయకుడు'పై నివేదిక రావాలి
నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రంపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి భన్వర్లాల్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ చిత్రంలో సంభాషణలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భన్వర్లాల్కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీ చేసిన చెల్లింపు వార్తలపై జిల్లా స్థాయి కమిటీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని నేతలకు సూచించారు.
Thursday, January 12, 2012
'అధినాయకుడు'లో ఆసక్తికర అంశాలు!
బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న 'అధినాయకుడు' సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఎం.ఎల్. కుమార్చౌదరి నిర్మిస్తున్నారు. నాలుగు రోజుల ప్యాచ్వర్క్ మినహా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో బాలకృష్ణ తాత, తండ్రి, మనవడిగా మూడు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ముగ్గురి సరసన ఎవరెవరు నటిస్తున్నారనే సంగతి వెల్లడైంది.
తాత సరసన జయసుధ, మనవడి సరసన లక్ష్మీరాయ్ నటిస్తున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. మరి మధ్యలో తండ్రి సరసన ఎవరు చేసినట్లు? ఆ పాత్రని తమిళ నటి సుకన్య పోషించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా కథానుసారం ఈ మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించవు. కారణం మనవడు పుట్టిన రెండేళ్లకే తాత పాత్రధారి మరణిస్తాడు. ఫ్లాష్బ్యాక్లో వచ్చే ఆ పాత్రపై కర్నూలులో 40 వేలమంది జనం మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్ అవుతాయని అంటున్నారు.
కాగా ఈ సినిమాలో బాలకృష్ణకు ఏక కాలంలో భార్యగా, తల్లిగా, నాయనమ్మగా తొలిసారి జయసుధ కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే మనవడి పాత్రధారి జయసుధను ఎక్కడా 'నాయనమ్మా' అని పిలవకుండా స్క్రిప్టులో జాగ్రత్తపడ్డారు. పోతే ఈ సినిమాలో సలోని కూడా నటిస్తోంది. ఆమెది ఓ సీనులో, మరో పాటలో మాత్రమే కనిపించే గెస్ట్ రోల్.
Thursday, December 8, 2011
బిగ్ స్టోరీ: కొత్త అవతారం!
ఎన్నడూ లేనివిధంగా తెలుగు కథానాయకులు మూకుమ్మడిగా కొత్తదనం కోసం సిన్సియర్గా ప్రయత్నిస్తున్నారు. ఇదివరలో అడపాదడపా మాత్రమే మన హీరోలు కొత్త రూపంతో ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేవారు. ఇప్పుడు అలా కాదు. దాదాపు ప్రతి హీరో మూస పాత్రల నుంచి బయటపడి, కొత్త రూపంతో, కొత్త పాత్రతో ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. హిందీ, తమిళ, మలయాళ చిత్రాలతో పోలిస్తే తెలుగు చిత్రాల్లో ప్రయోగాలు తక్కువ, కొత్తదనం తక్కువ, వాస్తవికత తక్కువ... అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే హీరోల దృక్పథాల్లో మార్పు వస్తోంది. దర్శకులు కమర్షియల్ కథల్లోనే కొద్దిగానైనా కొత్తదనం ఉండే పాత్రల చిత్రణ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తెలుగు హీరోలు కొత్త రూపాలతో దర్శనమిస్తున్నారు.
పవన్ కల్యాణ్
ఈ నెల 9న వస్తున్న 'పంజా' చిత్రం పట్ల అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. కారణం, అది పవన్ కల్యాణ్ చిత్రం కావడం, అందునా ఆయన ఇదివరకెన్నడూ కనిపించని రీతిలో గడ్డంతో కనిపిస్తుండటం. తెలుగువాడైనప్పటికీ చెన్నైలో స్థిరపడి తమిళ చిత్రాలతో పాపులర్ అయిన విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్గా పరిచయమవుతున్నాడు. స్టయిలిష్ టేకింగ్తో సినిమాలు రూపొందిస్తాడనే పేరున్న విష్ణు స్టయిలిష్ హీరోగా పేరున్న పవన్ను ఇప్పుడు 'పంజా'లో మాఫియా గ్యాంగ్ మెంబర్ జయదేవ్ పాత్రలో గడ్డంతో కొత్తగా చూపిస్తున్నాడు. ఈ కొత్త రూపంలో పవన్ మరింత స్టయిల్గా, సరికొత్త అందంతో కనిపిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నాగార్జున
సమకాలీన హీరోలతో పోలిస్తే భిన్నమైన రూపాలతో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్న హీరో నాగార్జున. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' పాత్రలతో మెప్పించిన ఆయన ఇప్పుడు తెలంగాణ పోరాట యోధుడు 'రాజన్న'గా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెలితిప్పిన మీసం, పొడవాటి కేశాలు, నుదుటన పొడవాటి తిలకం, మెడలో కండువాతో కొత్త రూపంతో కనిపిస్తున్నారు. స్వాతంత్య్ర పూర్వ కాలం నాటి నేపథ్యంతో తయారైన ఈ సినిమా నాగార్జున కెరీర్లో మరో ప్రత్యేక చిత్రం కాబోతోంది.
బాలకృష్ణ
ప్రయోగాలంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో ప్రియం. 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. వాటితో పాటు కొన్ని చారిత్రక పాత్రలు, పౌరాణిక పాత్రలూ ఆయన ధరించారు. మొన్నటికి మొన్న 'సింహా'గా పొడవాటి బుర్ర మీసాలతో కనిపించి, ఆ పాత్రలో గొప్పగా రాణించిన ఆయన నిన్నటికి నిన్న 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముని పాత్రను అద్భుతంగా పోషించి, నేటి కాలంలో పౌరాణిక పాత్రలకు తను మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించారు. ఇప్పుడు జనవరిలో రాబోతున్న 'అధినాయకుడు' చిత్రంలో తాత, తండ్రి, మనవడుగా త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షక లోకంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముఖ్యంగా తాత గెటప్లో బాలకృష్ణ ఆహార్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
రాజశేఖర్
భావోద్వేగపూరిత పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ తన కెరీర్లో 'ఓంకారం', 'శేషు' వంటి చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించారు. తాజాగా ఆయన 'అర్జున'లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యనారాయణ అనే సామాన్య రైతుగా రాజశేఖర్ కనిపించబోతున్నారు. కొడుకు అర్జున్ సాయంతో సమాజానికి ఆయన ఏం చేంశాడనేది ఇందులోని ప్రధానాంశం. సూర్యనారాయణ పాత్రలో రాజశేఖర్ ప్రదర్శించే భావోద్వేగాలు సినిమాకి హైలైట్ అంటున్నారు.
జగపతిబాబు
కుటుంబ కథాచిత్రాల నాయకుడిగా పేరుపొందిన జగపతిబాబు ఆ ఇమేజ్కు భిన్నమైన పాత్రలనెన్నింటినో పోషించారు. 'గాయం', 'హోమం' వంటివి అందుకు ఉదాహరణలు. ఇప్పుడు 'క్షేత్రం' చిత్రంలో ఆయన చేస్తున్న వీరనరసింహ రాయలు అనే పాత్ర అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మెలి తిప్పిన పొడవాటి బుర్ర మీసాలతో ఆయన కొత్తగా, భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి జగపతిబాబు పాత్ర ప్రత్యేకాకర్షణ అనేది దర్శకుడు టి. వేణుగోపాల్ మాట.
రాజేంద్రప్రసాద్
పేరుకి హాస్య చిత్రాల కథానాయకుడే అయినా తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆల్రౌండర్ అనిపించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్. 'ఎర్ర మందారం', 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు ఆయన నటనా వైదుష్యానికి నిదర్శనాలు. ఇటీవలే 'క్విక్గన్ మురుగన్'గా ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు 'డ్రీమ్' చిత్రంలో సరికొత్త గెట ప్తో ఆకట్టుకుంటున్నారు. నూతన దర్శకుడు భవానీ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంతో రాజేంద్రప్రసాద్ భిన్నమైన హెయిర్ స్టయిల్తో మరో ప్రయోగం చేస్తున్నారు.
రానా
ప్రయోగాలకు సీనియర్లే కాదు కుర్ర హీరోలు కూడా సై అంటున్నారు. అనేకమంది నేటి తరం హీరోలు సినిమా సినిమాకీ రూపం మార్చుకుంటూ వస్తుంటే తనూ అదే దారిలో పయనిస్తున్నానంటున్నారు రానా. 'లీడర్', 'నేను నా రాక్షసి' చిత్రాల్లో గడ్డంతో ఓ రకంగా కనిపించిన ఆయన ఇప్పుడు 'నా ఇష్టం' చిత్రంలో షేవ్ చేసిన గడ్డం, మీసంతో కొత్త రూపంతో కనిపించబోతున్నారు. జెనీలియా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ తోలేటి దర్శకుడు.
పవన్ కల్యాణ్
ఈ నెల 9న వస్తున్న 'పంజా' చిత్రం పట్ల అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. కారణం, అది పవన్ కల్యాణ్ చిత్రం కావడం, అందునా ఆయన ఇదివరకెన్నడూ కనిపించని రీతిలో గడ్డంతో కనిపిస్తుండటం. తెలుగువాడైనప్పటికీ చెన్నైలో స్థిరపడి తమిళ చిత్రాలతో పాపులర్ అయిన విష్ణువర్ధన్ ఈ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్గా పరిచయమవుతున్నాడు. స్టయిలిష్ టేకింగ్తో సినిమాలు రూపొందిస్తాడనే పేరున్న విష్ణు స్టయిలిష్ హీరోగా పేరున్న పవన్ను ఇప్పుడు 'పంజా'లో మాఫియా గ్యాంగ్ మెంబర్ జయదేవ్ పాత్రలో గడ్డంతో కొత్తగా చూపిస్తున్నాడు. ఈ కొత్త రూపంలో పవన్ మరింత స్టయిల్గా, సరికొత్త అందంతో కనిపిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నాగార్జున
సమకాలీన హీరోలతో పోలిస్తే భిన్నమైన రూపాలతో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్న హీరో నాగార్జున. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' పాత్రలతో మెప్పించిన ఆయన ఇప్పుడు తెలంగాణ పోరాట యోధుడు 'రాజన్న'గా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన మెలితిప్పిన మీసం, పొడవాటి కేశాలు, నుదుటన పొడవాటి తిలకం, మెడలో కండువాతో కొత్త రూపంతో కనిపిస్తున్నారు. స్వాతంత్య్ర పూర్వ కాలం నాటి నేపథ్యంతో తయారైన ఈ సినిమా నాగార్జున కెరీర్లో మరో ప్రత్యేక చిత్రం కాబోతోంది.
బాలకృష్ణ
ప్రయోగాలంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో ప్రియం. 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. వాటితో పాటు కొన్ని చారిత్రక పాత్రలు, పౌరాణిక పాత్రలూ ఆయన ధరించారు. మొన్నటికి మొన్న 'సింహా'గా పొడవాటి బుర్ర మీసాలతో కనిపించి, ఆ పాత్రలో గొప్పగా రాణించిన ఆయన నిన్నటికి నిన్న 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముని పాత్రను అద్భుతంగా పోషించి, నేటి కాలంలో పౌరాణిక పాత్రలకు తను మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించారు. ఇప్పుడు జనవరిలో రాబోతున్న 'అధినాయకుడు' చిత్రంలో తాత, తండ్రి, మనవడుగా త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షక లోకంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముఖ్యంగా తాత గెటప్లో బాలకృష్ణ ఆహార్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
రాజశేఖర్
భావోద్వేగపూరిత పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ తన కెరీర్లో 'ఓంకారం', 'శేషు' వంటి చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించారు. తాజాగా ఆయన 'అర్జున'లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యనారాయణ అనే సామాన్య రైతుగా రాజశేఖర్ కనిపించబోతున్నారు. కొడుకు అర్జున్ సాయంతో సమాజానికి ఆయన ఏం చేంశాడనేది ఇందులోని ప్రధానాంశం. సూర్యనారాయణ పాత్రలో రాజశేఖర్ ప్రదర్శించే భావోద్వేగాలు సినిమాకి హైలైట్ అంటున్నారు.
జగపతిబాబు
కుటుంబ కథాచిత్రాల నాయకుడిగా పేరుపొందిన జగపతిబాబు ఆ ఇమేజ్కు భిన్నమైన పాత్రలనెన్నింటినో పోషించారు. 'గాయం', 'హోమం' వంటివి అందుకు ఉదాహరణలు. ఇప్పుడు 'క్షేత్రం' చిత్రంలో ఆయన చేస్తున్న వీరనరసింహ రాయలు అనే పాత్ర అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మెలి తిప్పిన పొడవాటి బుర్ర మీసాలతో ఆయన కొత్తగా, భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి జగపతిబాబు పాత్ర ప్రత్యేకాకర్షణ అనేది దర్శకుడు టి. వేణుగోపాల్ మాట.
రాజేంద్రప్రసాద్
పేరుకి హాస్య చిత్రాల కథానాయకుడే అయినా తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆల్రౌండర్ అనిపించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్. 'ఎర్ర మందారం', 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు ఆయన నటనా వైదుష్యానికి నిదర్శనాలు. ఇటీవలే 'క్విక్గన్ మురుగన్'గా ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు 'డ్రీమ్' చిత్రంలో సరికొత్త గెట ప్తో ఆకట్టుకుంటున్నారు. నూతన దర్శకుడు భవానీ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంతో రాజేంద్రప్రసాద్ భిన్నమైన హెయిర్ స్టయిల్తో మరో ప్రయోగం చేస్తున్నారు.
రానా
ప్రయోగాలకు సీనియర్లే కాదు కుర్ర హీరోలు కూడా సై అంటున్నారు. అనేకమంది నేటి తరం హీరోలు సినిమా సినిమాకీ రూపం మార్చుకుంటూ వస్తుంటే తనూ అదే దారిలో పయనిస్తున్నానంటున్నారు రానా. 'లీడర్', 'నేను నా రాక్షసి' చిత్రాల్లో గడ్డంతో ఓ రకంగా కనిపించిన ఆయన ఇప్పుడు 'నా ఇష్టం' చిత్రంలో షేవ్ చేసిన గడ్డం, మీసంతో కొత్త రూపంతో కనిపించబోతున్నారు. జెనీలియా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ తోలేటి దర్శకుడు.
Saturday, November 26, 2011
బాలకృష్ణ నాయనమ్మగా జయసుధ!
ఇప్పటివరకు హీరోలకు అమ్మగా కనిపిస్తూ వచ్చిన సహజనటి జయసుధ తొలిసారిగా ఓ హీరోకి నాయనమ్మగా కనిపించబోతున్నారు. అదీ తన సమవయస్కుడైన సీనియర్ హీరో బాలకృష్ణకు. 'అధినాయకుడు' సినిమాలో ఆమె నాయనమ్మ పాత్రని చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్. కుమార్చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆయన తాత, తండ్రి, మనవడిగా నటిస్తున్న సినిమా కూడా ఇదే. ఇందులో తాత పాత్ర సరసన జయసుధ నటిస్తున్నారు. "అంటే మేం జంటగా నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. ఒకే సినిమాలో ఆయనకు భార్యగా, తల్లిగా, నాయనమ్మగా నటిస్తుండటం గమ్మత్తైన అనుభవం. 'శివరంజని'లోనే మేం జంటగా నటించాల్సింది తప్పిపోయింది" అని జయసుధ తెలిపారు. మిగతా ఇద్దరి పాత్రల సరసన లక్ష్మీరాయ్, సలోని నటిస్తున్నారు. ఇలాంటి విశేషాలున్న 'అధినాయకుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Friday, November 18, 2011
అప్పుడు 'లవకుశ'.. ఇప్పుడు 'శ్రీరామరాజ్యం'
అందరి కళ్లూ ఇప్పుడు 'శ్రీరామరాజ్యం' మీదే. గురువారం (17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇటు సినీ వర్గాల్లో, అటు సామాన్య ప్రజానీకంలో అమితాసక్తి వ్యక్తమవుతోంది. 'శ్రీకృష్ణార్జున విజయం' (1996) తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పౌరాణిక చిత్రం ఇదే. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీసు ఫలితం తెలుగులో తిరిగి పౌరాణిక చిత్రాల రూపకల్పనపై ప్రభావం చూపబోతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే మరిన్ని పౌరాణిక చిత్రాల నిర్మాణానికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ సందర్భంగా అఖండ విజయం సాధించిన మునుపటి చిత్రంతో, ప్రస్తుత చిత్రాన్ని పోల్చడం సహజం. 26 కేంద్రాల్లో విడుదలైన 'లవకుశ' అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడి, తెలుగులో రూ. కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా (టిక్కెట్ రేట్లు పావలా నుంచి ఒక రూపాయి ఉన్న కాలంలో) రికార్డు పుటలకెక్కింది. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు కాగా, ఈ చిత్రాన్ని 1.98 కోట్ల మంది చూసినట్లు అంచనా. అలాంటి 'లవకుశ'లో సీతారాములుగా అంజలీదేవి, నందమూరి తారకరామారావు ఎంత గొప్ప స్థాయిలో రాణించారో, అభినవ సీతారాములుగా ఎంతగా నీరాజనాలు అందుకున్నారో అప్పటి జనానికి తెలుసు. ముఖ్యంగా శ్రీరామునిగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది 'లవకుశ'లో ఆయన పోషించిన ఆ పాత్రతోనే.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఇలాగే ఉండేవాడేమోనని భ్రమించే రీతిలో ఆయన జనాన్ని సమ్మోహహితుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాత్రని బాలకృష్ణ ఎలా చేశారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రూపపరంగా చూస్తే, ఎన్టీఆర్ వంటి సమ్మోహనశక్తి లేకపోయినా ఆయన తర్వాత రాముని పాత్రలో ఇమడ గలిగేది బాలకృష్ణే అనే అభిప్రాయం సర్వత్రా ఉంది. శ్రీరాముని రూపంలోని బాలకృష్ణ స్టిల్స్ ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. 'లవకుశ'లో సీతగా అంజలీదేవి ప్రభావమూ అసామాన్యమైనదే. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయారు. లక్ష్మణుడు తనని అడవులకు పంపిన కారణం తెలిశాక ఆమె పలికించిన కరుణ రసం ఎప్పటికీ మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో ఆమె అభినయం అపూర్వమనే చెప్పాలి. అలాంటి పాత్రను ఇప్పుడు నయనతార చేయడమే ఒక విచిత్రం. తన కాలానికి అంజలి గొప్పనటిగా అప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ నయనతార తెలుగు నటి కాదు. తెలుగు భాష సరిగా తెలీదు కూడా. అయినా ప్రచార చిత్రాల్లో సీతగా ఆమె ఆహార్యం చక్కగా ఉంది. ఇప్పటికే 'సింహా' చిత్రంలో బాలకృష్ణ, నయనతార జంట ప్రేక్షకుల్ని అలరించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్కి పేరుపొందిన నయనతార ఆ సినిమాల్లో చీరల్లో హుందాగా కనిపించిన తీరే ఇప్పుడు సీత పాత్రకు ఎంపిక చేసేందుకు దోహదం చేసింది. అంజలిని ఆమె ఏ తీరున మరిపిస్తుందన్నది చూడాల్సిందే.
ఇక చిత్రంలో కీలకమైంది లక్ష్మణుని పాత్ర. మునుపటి చిత్రంలో ఆ పాత్రని కాంతారావు అమోఘంగా పోషించారు. సీతను అడవులకు పంపాలని శ్రీరాముడు నిర్ణయించినప్పుడు, ఆ బాధ్యత తనమీదే పడ్డప్పుడు కాంతారావు ప్రదర్శించిన నటన అత్యుత్తమం. ఇప్పుడు ఆ సన్నివేశాల్లో శ్రీకాంత్ని మనం చూడబోతున్నాం. ఆయన ఓ పౌరాణిక పాత్రను పోషించడం ఇదే ప్రథమం. వాల్మీకిగా చిత్తూరు నాగయ్యను చూసిన కళ్లతో అక్కినేని నాగేశ్వరరావును చూడటం అపురూపం. నటులుగా ఇద్దరూ ఏ స్థాయి నటులో మనకు తెలిసిందే.
ఇదంతా తెరమీద మనం చూడబోయే వ్యవహారం కాగా తెరవెనుక దర్శకత్వాన్ని ప్రస్తావించుకోవడం సందర్భోచితం. 'లవకుశ'ను తలపెట్టింది సి. పుల్లయ్య. అయితే అకస్మాత్తుగా సినిమా మధ్యలో ఆయన మరణించడంతో ఆ బాధ్యతను గొప్పగా నెరవేర్చారు ఆయన కుమారుడు సి.ఎస్. రావు. అలా తండ్రీకొడుకులు ఒక పౌరాణిక చిత్రరాజాన్ని తెలుగు దేశానికి అందిస్తే, ఇప్పుడు ఆ పని నిర్వహించింది ఇప్పటికే ఎన్నో కళాఖండాల్ని అందించిన బాపు. సహచరుడు ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా మధ్యలో అర్ధంతరంగా స్వర్గస్తులైతే, ఒంటిగానే తాననుకున్న రీతిలో 'శ్రీరామరాజ్యం'ను తీర్చిదిద్దారు బాపు. ఎనభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఏకాగ్రతతో ఈ చిత్రాన్ని ఆయన మలచిన తీరుకు ఆ సినిమా యూనిట్ అంతా జేజేలు పలుకుతున్నారు.
దీంతో పాటు సంగీతాన్నీ ప్రస్తావించుకోవాలి. 'లవకుశ' విజయంలో ఘంటసాల సంగీత బాణీలకూ ప్రత్యేక స్థానముంది. 'శ్రీరామరాజ్యం'కు ఆ బాధ్యతని అత్యంత సమర్ధంగా నిర్వహించారు ఇళయరాజా. ఇవన్నీ ఒకెత్తయితే పౌరాణికాలు తియ్యాలంటేనే బెంబేలెత్తే ఈ రోజుల్లో ఖర్చుకు వెరవకుండా, భారీ రిస్కుకు దడవకుండా ఈ సినిమాని నిర్మించి అందరి దృష్టినీ ఆకర్షించారు యలమంచిలి సాయిబాబా. ఇన్ని విశేషాలున్న 'శ్రీరామరాజ్యం' ఏ రీతిన ఆడుతుందో, 'లవకుశ'ను ఎంతగా మరిపిస్తుందో వేచి చూడాల్సిందే.
Wednesday, November 16, 2011
ఆ యువ నటుడు ఎవరు?
ఇటీవల 'శ్రీరామరాజ్యం' ఆడియో అభినందన సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ మాటల్ని రాంచరణ్ని ఉద్దేశించి అన్నాడంటూ ఓ టీవీ చానల్ చేసిన హంగామా వివాదాన్ని సృష్టించింది. దాంతో తాను ఆ మాటల్ని రాంచరణ్ని ఉద్దేశించి అనలేదనీ, ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నానో చిరంజీవి, మోహన్బాబుకు తెలుసనీ వివరణ ఇచ్చుకున్నారు బాలకృష్ణ. ఇంతకీ 'శ్రీరామరాజ్యం' సభలో ఆయన ఏమన్నారు? "ఈమధ్య ఓ యువ నటుడు మన తెలుగు సినిమాల గురించీ, దర్శకుల గురించీ అవమానకరంగా మాట్లాడాడు. టాలీవుడ్ దర్శకులు తెలుగు సినిమాల్లో ప్రయోగాలు చేయరని అన్నాడు. చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దనీ, బాపు వంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారని నేను అన్నాను. వారు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తీశారనీ, నేను కూడా 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాననీ చెప్పాను. ఇంకా ఎక్కువగా మాట్లాడితే పళ్లూడగొడతానని హెచ్చరించా" అని ఆయన చెప్పారు. అంటే ఏమిటి? ఆ యువ నటుడు బాలకృష్ణ సమక్షంలోనే తెలుగు దర్శకుల్ని తూలనాడితే, బాలకృష్ణ అతణ్ణి హెచ్చరించాడని ఇట్టే అర్థమైపోతోంది. కానీ వివాదం సృష్టించిన చానల్ దీన్ని గమనించకుండా కొద్ది రోజుల క్రితం దాసరి నారాయణరావుని ఉద్దేశించి రాంచరణ్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చినట్లుగా ఊహించుకొని స్టోరీ అల్లేసింది. అందుకే బాలకృష్ణ "ఏదో ఫంక్షన్లో షాట్స్ చూపించి నేను చరణ్ను ఉద్దేశించి అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. నేను అన్నది చరణ్ని ఉద్దేశించి కాదని సవినయంగా మనవి చేస్తున్నా. నేను ఆ మాటలు ఆ వ్యక్తితో నేరుగానే అన్నాను. కానీ చరణ్ను నేను కలిసి నాలుగైదు నెలలు అయింది. చిరంజీవి పిల్లలకు నేనంటే ఎంతో వాత్సల్యం. అలాగే వారన్నా నాకు ఎంతో వాత్సల్యం" అని తేల్చిచెప్పారు. బాలకృష్ణ ఇచ్చిన ఈ వివరణని సైతం సదరు చానల్ మరోరకంగా వాడుకొంది. అదలా ఉంచితే బాలకృష్ణ చేత పళ్లూడగొడతాననని అనిపించుకున్న ఆ యువ నటుడు ఎవరన్న చర్చ మొదలైంది చిత్రసీమలో. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇలా మాట్లాడుతున్నది హీరో నాని అనీ, అతడితోటే బాలయ్య ఆ మాటలు అని ఉంటారని ఊహిస్తున్నారు. తను ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలన్నదీ చిరంజీవి, మోహన్బబుకు తెలుసని బాలకృష్ణ అనడాన్ని బట్టి మరికొంతమందికీ ఈ సంగతి తెలిసే ఉంటుంది. ఎవరో ఆ యువ నటుడు?
Sunday, November 13, 2011
బిగ్ స్టోరీ: హిందీలో మాట్లాడుతున్న మన స్టార్ హీరోలు
హిందీలో తెలుగు సినిమాల రీమేక్ల కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. దానికి అదనంగా అక్కడ తెలుగు సినిమాల డబ్బింగూ ఓ వెల్లువలా మారడం నడుస్తున్న చరిత్ర. మన మెగా, సూపర్ స్టార్ల సినిమాల్ని కొనుగోలు చేసుకుని హిందీలోకి డబ్బింగ్ చేసుకుంటోంది బాలీవుడ్. ఇది థియేటర్లలో ప్రదర్శన కోసం కాదు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఏదో ఓ హిందీ ఎంటర్టైన్మెంట్ చానల్లో ఏదో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా ప్రసారమవుతూ కనిపిస్తోంది.
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేశ్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోల సినిమాల డబ్బింగులతో ముంబైలోని అంధేరీ, గుర్గావ్ వంటి ప్రాంతాలు డబ్బింగుల వాడలుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ ఒక పరిశ్రమలా నెలకొంది. కేవలం గంటకు రూ. 200 నుంచి రూ. 1500 వరకు అద్దె ఉండే ఈ డబ్బింగ్ థియేటర్లలో అనువాద క్రతువు నిరంతరాయంగా నడుస్తోంది. తెలుగు సినిమాల్ని సాధ్యమైనంత హిందీ నేటివిటీకి దగ్గరగా తీసుకువచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులతో అహోరాత్రులు కృషి జరుగుతోంది. ఈ క్రమంలో వందకు పైగా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయ్యాయి. ఇంకా అవుతున్నాయి.
కలర్స్, సోనీ మాక్స్ చానళ్లకే కాదు, మధ్యాహ్నం పూట మరి కొన్ని మూవీ చానళ్ల ముడిసరుకు తెలుగు డబ్బింగులే. ఈ సినిమాల్లో మన స్టార్లు మరొక వాయిస్తో అచ్చమైన హిందీ మాట్లాడటం మనకి నవ్వు తెప్పిస్తుంటుంది కూడా. ఈ ట్రెండు ఎందుకు నడుస్తున్నదంటే - హిందీ సినిమాలు రోజురోజుకూ సూటిగా సాఫీగా కథ చెప్పే పద్ధతికి దూరమవుతుండటం. తెలుగు సినిమాల కథలు డైరెక్టుగా నడుస్తుండటం. తెలుగు సినిమాల్లో ఎమోషన్లు, డ్రామా ఇప్పుడొస్తున్న హిందీ సినిమాలకి మాదిరిగా కాక కుటుంబ ప్రేక్షకులకి నచ్చే మోతాదులో స్ట్రాంగ్గా ఉండటం.
అయితే బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే మన తెలుగు డబ్బింగులు ప్రాంతీయ భోజ్పురి సినిమాలతో సమానం. అంతకంటే వాటికి స్థాయీ, విలువా లేవు. కాకపోతే టెక్నికల్గా, మేకింగ్ పరంగా ఇవి భోజ్పురి సినిమా నిర్మాతలు కలలో కూడా ఊహించని భారీతనంతో ఉంటాయి. ఇంకా ఈ హిందీ చానళ్ల వీక్షకులకి బోనస్ ఏమిటంటే ఈ తెలుగు డబ్బింగుల్లో విలన్లు హిందీవాళ్లే కావడం. ముఖేశ్ రుషి, సాయాజీ షిండే నుంచి ప్రదీప్ రావత్, సోనూ సూద్ దాకా హిందీ ప్రేక్షకులకి తెలిసిన ముఖాలే ఉండటంతో అదొక ప్లస్ పాయింట్ అవుతోంది.
కొన్ని పాత్రల నేటివిటీ మార్పు పేరు మార్పుతో సులభంగా జరిగిపోతోంది. కమెడియన్ నల్లగా ఉంటే కాలూ (నల్లటివాడు) అని పేరు పెట్టేస్తారు. తెల్లగా ఉంటే సమస్య ఉండదు. అలా కొన్ని హిందీ నేటివిటీకి అతకని దృశ్యాలుంటే, అవి కథాగమనాన్ని దెబ్బతీయకపోతే తీసేస్తారు. గమనించదగ్గ సంగతేమంటే ఈ సినిమా టైటిల్స్లో టైగర్ అనే పదం ఎక్కువగా కనిపించడం. భవానీ ద టైగర్ (పలనాటి బ్రహ్మనాయుడు), ఇంద్ర ద టైగర్ (ఇంద్ర), టైగర్ ఎ ఒన్మేన్ ఆర్మీ (సుబ్బు) వంటివి అందుకు ఉదాహరణలు. మరికొన్ని టైటిల్స్ హిందీ హిట్ సినిమాల టైటిల్స్ గుర్తొచ్చేలా పెడతారు. ద రియల్ ఇండియన్ (ఒక్క మగాడు), డాన్ నెం.1 (డాన్), ఏక్ ఔర్ హిమ్మత్వాలా (అందరివాడు), అతిథి ఇంటర్నేషనల్ ఖిలాడీ (అతిథి), మేరీ జంగ్ (మాస్), విశ్వ (నేనున్నాను), రాబరీ (సూపర్), పెహలీ నజర్ కా పెహలా ప్యార్ (సంతోషం) వంటివి వాటిలో కొన్ని.
ప్రతినిత్యం మధ్యాహ్నం వేళ హిందీ చానళ్ల ప్రేక్షకులకి మంచి వినోద కాలక్షేపం అందిస్తున్న మన తెలుగు సినిమాలకి మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. వీటిలో హీరోయిన్లు హిందీవాళ్లే! ఏదేమైనా తెలుగు సినిమాల హిందీ డబ్బింగులతో మన స్టార్ల టాలెంట్ హిందీ ప్రేక్షకులకి - అదీ వాళ్ల ఇంటిల్లిపాదికీ పరిచయం కావడమంటే మామూలు విషయం కాదు.
Thursday, November 10, 2011
ఏడేళ్ల తర్వాత బాలయ్యతో పరుచూరి బ్రదర్స్!
'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్బస్టర్ సినిమాల కాంబినేషన్ బాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్ ఏడేళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నారు. చివరిసారిగా వారు 'లక్ష్మీనరసింహా' సినిమాకి పనిచేశారు. ఇప్పుడు ఇన్నాళ్లకి వారు 'హరహర మహాదేవ' సినిమా కోసం కలిశారు. బి. గోపాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. 'లక్ష్మీ నరసింహా' నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. ఇక బి. గోపాల్ విషయానికొస్తే ఎనిమిదేళ్ల తర్వాత ఆయన బాలకృష్ణని డైరెక్ట్ చేస్తున్నాడు. 2003లో వచ్చి ఘోరంగా ఫెయిలైన 'పలనాటి బ్రహ్మనాయుడు' సినిమాకి చివరగా ఆ ఇద్దరూ కలిసి పనిచేశారు. దీనికి రచన చేసింది కూడా పరుచూరి సోదరులే. ఇప్పుడు ఈ నలుగురి (పరుచూరి బ్రదర్స్ ఇద్దరు కాబట్టి) కలిసి 'పలనాటి బ్రహ్మనాయుడు' చేదు అనుభవాన్ని మర్చిపోవాలనే కసితో పనిచేస్తున్నారు. పవర్ఫుల్ డైలాగ్స్కి పెట్టింది పేరైన బ్రదర్స్ ఇందులో 'సై అంటే శరభ శరభ.. జై అంటే ఆయుష్మాన్భవ.. కాదని ఎదురొస్తే హరహర మహాదేవ' వంటి శక్తివంతమైన డైలాగులు రాశారు. అయితే ఏ సినిమాకైనా కథే ప్రాణాధారం కాబట్టి 'హరహర మహాదేవ' కథ విషయంలో బి. గోపాల్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మంచి పాటలు, యాక్షన్ పార్ట్, పవర్ఫుల్ కేరక్టర్, కావలసినంత సెంటిమెంట్ రంగరించి ఈ సినిమా కథని వండారు. ఈ సినిమాతో పునర్వైభవం పొందాలని ఇటు పరుచూరి బ్రదర్స్, అటు బి. గోపాల్ చేస్తున్న కృషి ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.
Tuesday, September 20, 2011
వార్తల్లో వ్యక్తి: అక్కినేని నాగేశ్వరరావు
అభినయ వాల్మీకి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంఘిక చిత్రాల కథానాయకుడిగా అత్యున్నత స్థాయిని అందుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనేది జగద్విదితం. పౌరాణిక చిత్రాల కథానాయకుడిగా ఎన్టీ రామారావు అద్భుతంగా రాణిస్తుండటంతో తనంతట తానుగా వాటినుంచి తప్పుకుని సాంఘిక చిత్రాలతోనే అజరామర కీర్తిని సొంతం చేసుకున్నారు అక్కినేని. తొలినాళ్లలో జానపద హీరోగా రాణించినా 'లైలా మజ్ను', 'దేవదాసు' వంటి విషాదాంత ప్రేమకథలతో ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుని, ప్రేమకథాచిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ పొందారు.
మలిదశలో ఆయన చేసిన మరో రెండు విషాదాంత ప్రేమకథాచిత్రాలు 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం' ఈ సంగతినే రుజువు చేశాయి. అయితే వీటిలో ఆయన పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి కావడం గమనించదగ్గ అంశం. సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరో తెలుగు హీరో పోషించలేదనడం నిస్సందేహం. అక్కినేని చేసిన పౌరాణిక చిత్రాలు పదికి మించవు. చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించినా, ఆ తరహా చిత్రాలు ఆయన ఎక్కువ చేయకపోవడం తెలుగు సినిమాకి ఓ లోటుగానే భావించాలి. ప్రస్తుతం ఆయన బాపు రూపొందిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రామాయణ గాథని రచించిన వాల్మీకి పాత్రని పోషిస్తున్నారు. అడవుల పాలైన సీతకు ఆశ్రయమిచ్చి, అక్కడ ఆమె జన్మనిచ్చిన కవల పిల్లలు లవకుశులకు విద్యాబుద్ధులు, విలువిద్య నేర్పిన గురువు వాల్మీకిగా ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషమేమంటే కథానాయకుడిగా అక్కినేని తొలి పాత్ర శ్రీరాముడు కావడం. ఆ సినిమా 1944లో వచ్చిన 'సీతారామ జననం'. ఘంటసాల బలరామయ్య రూపొందించిన ఈ చిత్రంలో శ్రీరామునిగా నాగేశ్వరరావు ఎలా నటిస్తాడోనని ఆయన్ని ఎరిగినవారంతా కొంత ఆసక్తిగా, కొంత అపనమ్మకంగా ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటివరకు రంగస్థలంపై ఆడ పాత్రలే చేస్తూ వచ్చిన ఆయన ఎకాఎకి శ్రీరామ పాత్ర చేయడమంటే మాటలు కాదు కదా (అంతకుముందు 1941లో ఆయన 'ధర్మపత్ని'లో ఓ చిన్న పాత్ర చేశారు). కానీ ఆ పాత్రలో ఆయన అందరి అంచనాల్ని మించి రాణించారు.
ఆ తర్వాత కాలంలో ఆయన 'మాయాబజార్'లో అభిమన్యుడిగా, 'భూకైలాస్'లో నారదునిగా, 'చెంచులక్ష్మి'లో విష్ణుమూర్తిగా, 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'లో అర్జునునిగా నటించి, మెప్పించారు. 'జయభేరి'లో 'రావోయి రాస విహారీ' పాటలో శ్రీకృష్ణుని వేషంలోనూ బాగున్నారనిపించుకున్నారు. నాగయ్య చిత్రం 'భక్త రామదాసు'లో మరోసారి విష్ణుమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. వీటితో పాటు 'సతీ సావిత్రి'లో సత్యవంతుడిగానూ అక్కినేని మెప్పించారు. ఇలా చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించిన అక్కినేని మరిన్ని పౌరాణిక చిత్రాలు చేసినట్లయితే తెలుగు సినిమాకి మేలు చేకూరి ఉండేది. ఆ మేరకు ఆయన సేవల్ని పౌరాణిక సినిమా కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు 87 సంవత్సరాల వయసులో ఆయన 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తుండటం ముదావహం.
ఈ పాత్రలో ఆయన అద్భుతంగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. బాపు రూపకల్పనలో శ్రీరామునిగా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందువల్ల త్వరలోనే అభినవ వాల్మీకిని మనం తిలకించవచ్చు.
(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు 88 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంఘిక చిత్రాల కథానాయకుడిగా అత్యున్నత స్థాయిని అందుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనేది జగద్విదితం. పౌరాణిక చిత్రాల కథానాయకుడిగా ఎన్టీ రామారావు అద్భుతంగా రాణిస్తుండటంతో తనంతట తానుగా వాటినుంచి తప్పుకుని సాంఘిక చిత్రాలతోనే అజరామర కీర్తిని సొంతం చేసుకున్నారు అక్కినేని. తొలినాళ్లలో జానపద హీరోగా రాణించినా 'లైలా మజ్ను', 'దేవదాసు' వంటి విషాదాంత ప్రేమకథలతో ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుని, ప్రేమకథాచిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ పొందారు.
మలిదశలో ఆయన చేసిన మరో రెండు విషాదాంత ప్రేమకథాచిత్రాలు 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం' ఈ సంగతినే రుజువు చేశాయి. అయితే వీటిలో ఆయన పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి కావడం గమనించదగ్గ అంశం. సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరో తెలుగు హీరో పోషించలేదనడం నిస్సందేహం. అక్కినేని చేసిన పౌరాణిక చిత్రాలు పదికి మించవు. చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించినా, ఆ తరహా చిత్రాలు ఆయన ఎక్కువ చేయకపోవడం తెలుగు సినిమాకి ఓ లోటుగానే భావించాలి. ప్రస్తుతం ఆయన బాపు రూపొందిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రామాయణ గాథని రచించిన వాల్మీకి పాత్రని పోషిస్తున్నారు. అడవుల పాలైన సీతకు ఆశ్రయమిచ్చి, అక్కడ ఆమె జన్మనిచ్చిన కవల పిల్లలు లవకుశులకు విద్యాబుద్ధులు, విలువిద్య నేర్పిన గురువు వాల్మీకిగా ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషమేమంటే కథానాయకుడిగా అక్కినేని తొలి పాత్ర శ్రీరాముడు కావడం. ఆ సినిమా 1944లో వచ్చిన 'సీతారామ జననం'. ఘంటసాల బలరామయ్య రూపొందించిన ఈ చిత్రంలో శ్రీరామునిగా నాగేశ్వరరావు ఎలా నటిస్తాడోనని ఆయన్ని ఎరిగినవారంతా కొంత ఆసక్తిగా, కొంత అపనమ్మకంగా ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటివరకు రంగస్థలంపై ఆడ పాత్రలే చేస్తూ వచ్చిన ఆయన ఎకాఎకి శ్రీరామ పాత్ర చేయడమంటే మాటలు కాదు కదా (అంతకుముందు 1941లో ఆయన 'ధర్మపత్ని'లో ఓ చిన్న పాత్ర చేశారు). కానీ ఆ పాత్రలో ఆయన అందరి అంచనాల్ని మించి రాణించారు.
ఆ తర్వాత కాలంలో ఆయన 'మాయాబజార్'లో అభిమన్యుడిగా, 'భూకైలాస్'లో నారదునిగా, 'చెంచులక్ష్మి'లో విష్ణుమూర్తిగా, 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'లో అర్జునునిగా నటించి, మెప్పించారు. 'జయభేరి'లో 'రావోయి రాస విహారీ' పాటలో శ్రీకృష్ణుని వేషంలోనూ బాగున్నారనిపించుకున్నారు. నాగయ్య చిత్రం 'భక్త రామదాసు'లో మరోసారి విష్ణుమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. వీటితో పాటు 'సతీ సావిత్రి'లో సత్యవంతుడిగానూ అక్కినేని మెప్పించారు. ఇలా చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించిన అక్కినేని మరిన్ని పౌరాణిక చిత్రాలు చేసినట్లయితే తెలుగు సినిమాకి మేలు చేకూరి ఉండేది. ఆ మేరకు ఆయన సేవల్ని పౌరాణిక సినిమా కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు 87 సంవత్సరాల వయసులో ఆయన 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తుండటం ముదావహం.
ఈ పాత్రలో ఆయన అద్భుతంగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. బాపు రూపకల్పనలో శ్రీరామునిగా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందువల్ల త్వరలోనే అభినవ వాల్మీకిని మనం తిలకించవచ్చు.
(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు 88 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)
Subscribe to:
Posts (Atom)























