Showing posts with label posani. Show all posts
Showing posts with label posani. Show all posts
Tuesday, March 29, 2016
Saturday, October 3, 2015
Tuesday, June 23, 2015
Wednesday, April 29, 2015
Wednesday, February 25, 2015
Friday, July 5, 2013
Friday, December 16, 2011
'కృష్ణం వందే జగద్గురుం' ప్రారంభం
రానా హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్రెడ్డి నిర్మాతలు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో డిసెంబర్ 14న జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వెంకటేష్ క్లాప్నిచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
క్రిష్ మాట్లాడుతూ "ఈ కథకు సంబంధించిన పాయింట్ స్ఫురించగానే రానాకు ఫోన్ చేసి చెప్పాను. మా ఇద్దరి గమనం, గతిని మార్చే సినిమా ఇది. ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. బీటెక్ బాబుగా రానా నటించనున్నారు. అతని ఆరున్నర అడుగుల కటౌట్ను పూర్తిగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాను. సాయిమాధవ్ డైలాగులు బావుంటాయి. మంచి టీమ్తో ముందుకు వెళ్తున్నాం. హీరోయిన్ను రెండు మూడు రోజుల్లో ఎంపిక చేస్తాం. వెంటనే షెడ్యూల్ మొదలవుతుంది. యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. కృష్ణుడిని మించిన మాస్ పాత్ర నాకు కనిపించలేదు. ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది'' అని అన్నారు.
రానా మాట్లాడుతూ "ఇది నేను చేస్తున్న ఆరో చిత్రం. గతంలో దర్శకులు సృష్టించిన పాత్రల్లోకి నేవెళ్ళి చేశాను. ఈ సినిమాలో నాకోసం రూపొందించిన పాత్రలో నటించబోతున్నాను. హీరో జర్నీకి సంబంధించిన చిత్రమిది. వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళంలో 'వడక్కు చెన్నై'లో నటిస్తున్నాను'' అని అన్నారు.
కథను నమ్మి సినిమా తీసే దర్శకుడు క్రిష్ అని పోసాని కితాబిచ్చారు. మంచి పాత్రలో నటిస్తున్నట్టు ఎల్బీశ్రీరామ్ అన్నారు. కథ మెప్పిస్తుందని వెంకటేష్ చక్రవర్తి చెప్పారు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేస్తానని సాయిమాధవ్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "మంచి కథ. రానా పాత్ర మెప్పిస్తుంది. లొకేషన్లు, స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాం'' అని చెప్పారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, పోసాని, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, సత్యం రాజేష్, నాగినీడు, రవి ప్రకాష్, జె.వి.ఆర్., హేమ, శ్రీనిజ తదితరులు ఇతర పాత్రధారులు. కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: క్రిష్, స్క్రిప్ట్ కన్సల్టంట్: వెంకటేష్ చక్రవర్తి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: శ్రావణ్.కె, కెమెరా: జ్ఞాన శేఖర్.వి.ఎస్., సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్రెడ్డి.
క్రిష్ మాట్లాడుతూ "ఈ కథకు సంబంధించిన పాయింట్ స్ఫురించగానే రానాకు ఫోన్ చేసి చెప్పాను. మా ఇద్దరి గమనం, గతిని మార్చే సినిమా ఇది. ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. బీటెక్ బాబుగా రానా నటించనున్నారు. అతని ఆరున్నర అడుగుల కటౌట్ను పూర్తిగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాను. సాయిమాధవ్ డైలాగులు బావుంటాయి. మంచి టీమ్తో ముందుకు వెళ్తున్నాం. హీరోయిన్ను రెండు మూడు రోజుల్లో ఎంపిక చేస్తాం. వెంటనే షెడ్యూల్ మొదలవుతుంది. యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. కృష్ణుడిని మించిన మాస్ పాత్ర నాకు కనిపించలేదు. ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది'' అని అన్నారు.
రానా మాట్లాడుతూ "ఇది నేను చేస్తున్న ఆరో చిత్రం. గతంలో దర్శకులు సృష్టించిన పాత్రల్లోకి నేవెళ్ళి చేశాను. ఈ సినిమాలో నాకోసం రూపొందించిన పాత్రలో నటించబోతున్నాను. హీరో జర్నీకి సంబంధించిన చిత్రమిది. వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళంలో 'వడక్కు చెన్నై'లో నటిస్తున్నాను'' అని అన్నారు.
కథను నమ్మి సినిమా తీసే దర్శకుడు క్రిష్ అని పోసాని కితాబిచ్చారు. మంచి పాత్రలో నటిస్తున్నట్టు ఎల్బీశ్రీరామ్ అన్నారు. కథ మెప్పిస్తుందని వెంకటేష్ చక్రవర్తి చెప్పారు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేస్తానని సాయిమాధవ్ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ "మంచి కథ. రానా పాత్ర మెప్పిస్తుంది. లొకేషన్లు, స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాం'' అని చెప్పారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, పోసాని, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, సత్యం రాజేష్, నాగినీడు, రవి ప్రకాష్, జె.వి.ఆర్., హేమ, శ్రీనిజ తదితరులు ఇతర పాత్రధారులు. కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: క్రిష్, స్క్రిప్ట్ కన్సల్టంట్: వెంకటేష్ చక్రవర్తి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: శ్రావణ్.కె, కెమెరా: జ్ఞాన శేఖర్.వి.ఎస్., సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్రెడ్డి.
Thursday, July 14, 2011
న్యూస్: మంచి రచయితని మిస్సవుతున్న టాలీవుడ్
డైరెక్టర్గా పోసాని కృష్ణమురళికి ఊహించని ఓటమి 'దుశ్శాసన'. శ్రీకాంత్తో ఇదివరకు తీసిన 'ఆపరేషన్ దుర్యోధన' పెట్టుబడిపై మంచి ఆదాయం తీసుకొచ్చి నిజమైన హిట్టవడంతో 'దుశ్శాసన' కూడా అలాగే పెద్ద విజయం సాధిస్తుందని అతను ఆశించాడు. కానీ ఆ సినిమా విడుదల చేయడమే నిర్మాతకి తలకి మించిన భారమైంది. హీరో శ్రీకాంత్ రూ. 20 లక్షలిచ్చి ఆదుకోబట్టి సరిపోయింది. రాజకీయ, పోలీసు వ్యవస్థల మీదా, సమాజం మీదా తనకున్న అక్కసునీ, కోపాన్నీ సినిమాల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించే పోసాని రచయితగా ఎంతగా సక్సెస్ అయ్యాడో, దర్శకుడిగా మారినప్పట్నించీ అంతగా విమర్శల్నీ, వివాదాల్నీ మూటగట్టుకుంటూ వచ్చాడు. తను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన 'మెంటల్ కృష్ణ' ఆయన మానసిక పరిస్థితికి అద్దం పట్టింది. ఆ సినిమాకి కొద్దో గొప్పో డబ్బులు రావచ్చు గాక, కానీ ఆ తర్వాత నుంచీ ఆయన నటించిన సినిమాల్ని కానీ, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్ని కానీ జనం పట్టించుకోవడం మానేశారు. రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీపరుడని కీర్తిస్తూ చిరంజీవి పార్టీలో చేరిన ఆయన గత ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు అదే చిరంజీవిని పెద్ద అవినీతిపరుడని విమర్శిస్తూ ఉన్నవాళ్లలో జగన్మోహనరెడ్డి బెటరంటూ వైయెస్సార్ కాంగ్రెస్స్ పార్టీలో చేరిపోయాడు. ఇలా స్థిరమైన అభిప్రాయమంటూ లేని ఆయన మునుముందు ఏం చేసినా జనం వినే స్థితి కానీ, చూసే స్థితి కానీ కనిపించడంలేదు. మొత్తానికి సినీ పరిశ్రమ ఓ మంచి రచయిత సేవల్ని మిస్సవుతోందని చెప్పవచ్చు.
Tuesday, May 24, 2011
ఇంటర్వ్యూ: పోసాని కృష్ణమురళి
"జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ 'దుశ్శాసన'లో హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ'' అని చెప్పారు. పోసాని కృష్ణమురళి. శ్రీకాంత్, సంజన జంటగా లాఫింగ్ లార్డ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మించిన 'దుశ్శాసన' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, అందులోని రాజకీయ అంశాల గురించీ విపులంగా మాట్లాడారు పోసాని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
రాజకీయ నాయకుల్లో ఎవరైతే ప్రజాస్వామ్య విలువల్ని వలువల్లా లాగేస్తున్నారో వారే నా సినిమాలో 'దుశ్శాసన'. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకి ఉండే సౌకర్యాలేవీ సామాన్య జనానికి ఉండవు. ఏ మంత్రి లేదా ఎమ్మెల్యే ఇంట్లో కరెంటు సమస్య కానీ, నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఉండదు. ఇవన్నీ జనానికి ఉంటాయి. దీన్ని ప్రశ్నించి, "మీకు ఉండే సౌకర్యాలన్నీ మాకూ ఇవ్వండిరా'' అని డిమాండ్ చేసే ఓ కామన్ మ్యాన్ కథ ఈ సినిమా. ఏ పనులు చేస్తామని పదవులు చేపట్టారో ఆ పనులు ఎందుకు చెయ్యడం లేదని అడిగే పాత్రలో శ్రీకాంత్ బాగా చేశాడు. అర్జెంటీనా ఉద్యమకారుడు చేగువేరా అంటే నీతికీ, నిజాయితీకీ, పోరాటానికీ, ధైర్యానికీ ప్రతీక. అందుకే శ్రీకాంత్ పాత్రకి ఆ లుక్ ఇచ్చా. అంతకుమించి చేగువేరాకీ, నా సినిమాకీ ఎలాంటి సంబంధమూ లేదు.
వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను
ఇవాళ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతున్నారు. తమకి అడ్డు వచ్చినవాళ్లని అడ్డు తొలగించుకోడానికి వెనుకాడటం లేదు. ఇలా అడుగుతున్నానని నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఈ సంగతి మా కుటుంబానికి కూడా చెప్పా. నేను తప్పు చెయ్యనని మా వాళ్ల నమ్మకం. అందుకే వాళ్లు నాకు అడ్డురారు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్లను. వ్యక్తిగతంగా వాళ్లేం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ జనంలోకి వస్తేనే అడుగుతా. 'దుశ్శాసన'లో జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ.
రాజకీయ నాయకుల్లో ఎవరైతే ప్రజాస్వామ్య విలువల్ని వలువల్లా లాగేస్తున్నారో వారే నా సినిమాలో 'దుశ్శాసన'. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకి ఉండే సౌకర్యాలేవీ సామాన్య జనానికి ఉండవు. ఏ మంత్రి లేదా ఎమ్మెల్యే ఇంట్లో కరెంటు సమస్య కానీ, నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఉండదు. ఇవన్నీ జనానికి ఉంటాయి. దీన్ని ప్రశ్నించి, "మీకు ఉండే సౌకర్యాలన్నీ మాకూ ఇవ్వండిరా'' అని డిమాండ్ చేసే ఓ కామన్ మ్యాన్ కథ ఈ సినిమా. ఏ పనులు చేస్తామని పదవులు చేపట్టారో ఆ పనులు ఎందుకు చెయ్యడం లేదని అడిగే పాత్రలో శ్రీకాంత్ బాగా చేశాడు. అర్జెంటీనా ఉద్యమకారుడు చేగువేరా అంటే నీతికీ, నిజాయితీకీ, పోరాటానికీ, ధైర్యానికీ ప్రతీక. అందుకే శ్రీకాంత్ పాత్రకి ఆ లుక్ ఇచ్చా. అంతకుమించి చేగువేరాకీ, నా సినిమాకీ ఎలాంటి సంబంధమూ లేదు.
అందుకే పాలిటిక్స్
నా ఉద్దేశంలో జనజీవన స్రవంతిలో కలవాల్సింది మావోయిస్టులు కాదు. రాజకీయ నాయకులే. మావోయిస్టులు అన్ని సౌకర్యాల్నీ వదులుకుని అడవుల్లో జనం కోసం బతుకుతున్నారు. జనం మధ్య ఉంటూనే జనానికి దూరంగా బతుకుతోంది ఈ రాజకీయ నాయకులే. నక్సలైట్లు ఊరికే పుట్టడం లేదు. ఈ రాజకీయ వ్యవస్థవల్లే పుడుతున్నారు. చెప్పీ చెప్పీ ఏమీ ప్రయోజనం ఉండకపోవడంతో విసిగిపోయి నక్సలైట్లుగా మారుతున్నారు. అందుకే పాలిటిక్స్ గురించి ఎంత ఎక్కువ చెబితే అంత మంచిదనే ఉద్దేశంతో నా సినిమాల్లో రాజకీయ అంశాల్ని ప్రస్తావిస్తూ వస్తున్నావ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను
ఇవాళ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతున్నారు. తమకి అడ్డు వచ్చినవాళ్లని అడ్డు తొలగించుకోడానికి వెనుకాడటం లేదు. ఇలా అడుగుతున్నానని నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఈ సంగతి మా కుటుంబానికి కూడా చెప్పా. నేను తప్పు చెయ్యనని మా వాళ్ల నమ్మకం. అందుకే వాళ్లు నాకు అడ్డురారు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్లను. వ్యక్తిగతంగా వాళ్లేం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ జనంలోకి వస్తేనే అడుగుతా. 'దుశ్శాసన'లో జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ.
బిజినెస్ సమస్య లేదు
పోసాని వల్ల ఏ నిర్మాతా నాశనం కాడు. పోసాని సినిమా అంటే కొనేవాళ్లు ఇంకా ఉన్నారు. నేను తీసేది తక్కువ బడ్జెట్తో కావడం వల్ల బిజినెస్ సమస్య నా సినిమాలకు లేదు. 'దుశ్శాసన' అన్ని ప్రాంతాలకూ అమ్ముడుపోయింది. జేపీ నీతిమంతుడే కానీ...
రాజకీయాల్లో స్థిరమైన నిర్ణయాలు ఉండవు. జనం ఎప్పుడూ ఏదో ఒక పార్టీకే ఎందుకు ఓట్లేయడం లేదు. ఒకసారి ఓ పార్టీని గెలిపించే వారు ఆ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తేనే మళ్లీ దానికి ఓటేస్తారు. లేదంటే వేరే పార్టీని ఎన్నుకుంటారు. నేను కూడా అంతే. ఏ నాయకుడైనా బాగా చేస్తుంటే మెచ్చుకుంటా. పొరపాట్లు చేస్తే తిడతా. మొన్న చంద్రబాబునీ, నిన్న చిరంజీవినీ అలాగే మెచ్చుకున్నా, తర్వాత తిట్టా. ఇవాళ రాజకీయ నాయకుల్లో 99 శాతం అవినీతిపరులే. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుల్ని ఓ ముగ్గుర్ని చూపించండి. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతి అనివార్యమైపోయింది. రాజకీయ నాయకులతో పాటు ప్రజలూ అవినీతి గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. లోక్సత్తా నేత జయప్రకాశ్ నారాయణ నీతిమంతుడు. అయితే ఇవాళ నీతి ఒక్కటే సరిపోదు. దానితో పాటు సమర్థతా, బలమూ కావాలి. జె.పి.కి ఆ బలం లేదు. ఉన్నవాళ్లలో సమర్థుడు అనిపించబట్టే వై.ఎస్. జగన్మోహనరెడ్డికి మద్దతు పలుకుతున్నా.
Saturday, July 24, 2010
Subscribe to:
Posts (Atom)















