Showing posts with label atithi. Show all posts
Showing posts with label atithi. Show all posts

Monday, June 25, 2012

జూలైలో 'ఏం బాబూ లడ్డూ కావాలా'


శివాజీ హీరోగా గాంధీ మనోహర్ దర్శకత్వంలో వనితాస్ డ్రీమ్‌లైన్ సంస్థ నిర్మిస్తున్న 'ఏం బాబూ లడ్డూ కావాలా' చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతిధి అగర్వాల్, రచనా మౌర్య కథానాయికలు.
ఈ సినిమా గురించి శివాజీ మాట్లాడుతూ 'సాధారణంగా మా చిత్రానికి స్క్రిప్ట్, ఆర్టిస్టులు బాగా సెట్ అయ్యారని అంటుంటారు. కానీ ఈ చిత్రానికి నిర్మాత కరెక్ట్‌గా సెట్ అయ్యారు. దర్శకుడు గాంధీ టైటిల్‌కు తగ్గట్లు ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు. సంగీత దర్శకురాలు శ్రీలేఖ, గీత రచయిత భాస్కరభట్ల నాకు మరోసారి సూపర్‌హిట్ ఆడియోను అందించారు. కుటుంబసమేతంగా చూసి, ఎంజాయ్ చేసే సినిమా ఇది' అన్నారు.
నిర్మాత టి.జనార్థన్ మాట్లాడుతూ 'గత వారం విడుదలైన మా సినిమాలోని అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు ముందు ఆడియో హిట్ కావడం శుభ పరిణామం. ఈ సందర్భంగా శ్రీలేఖగారికి, భాస్కరభట్లగారికి నా ధన్యవాదాలు' అన్నారు.
దర్శకుడు గాంధీ మనోహర్ మాట్లాడుతూ ' వినోదాత్మక చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో సినిమాని విడుదల చేస్తాం' అన్నారు. ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్, జీవా, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, రాంజగన్, తిరుపతి ప్రకాష్, జి.టి.రావు, భావన, లక్ష్మి, లహరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: వాసు, కూర్పు: నాగిరెడ్డి, కళ: విజయకృష్ణ, నిర్మాణ సారథ్యం: చందక రాజ్‌కుమార్.

Sunday, August 28, 2011

న్యూస్: రెండు హిట్లు, రెండు ఫ్లాపులు!

ఇప్పటివరకు నాలుగు సినిమాల్ని డైరెక్ట్ చేసిన సురేందర్‌రెడ్డి రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బ్యాలెన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'అతనొక్కడే', నాలుగో సినిమా 'కిక్'తో హిట్లు కొట్టిన అతను రెండు, మూడు సినిమాలైన 'అశోక్', 'అతిథి'లతో ఫ్లాపులు చవిచూశాడు. ఇప్పుడతను తన ఐదో సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా 'ఊసరవెల్లి'. అఫిషియల్‌గా ఆ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరో. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'అశోక్' చేశారు. ఆ సినిమాతో పరాజయం పొందిన వాళ్లు 'ఊసరవెల్లి'తో ఆ చేదు అనుభవాన్ని మరచిపోవాలని ఆశిస్తున్నారు. విపరీతమైన వయొలెన్స్, ఏమాత్రం కొత్తదనం లేని కథ వల్లనే 'అశోక్' ఫ్లాపయ్యిందని సురేందర్‌రెడ్డి గ్రహించాడు. అందుకే 'ఊసరవెల్లి'ని 'కిక్' తరహాలోనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. ఎన్టీఆర్, తమన్నా మధ్య వచ్చే సీన్లు యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సురేందర్‌కి పర్మనెంట్ రైటర్‌గా మారిన వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాకి 'బృందావనం' ఫేం కొరటాల శివ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇదివరకు ఎన్టీఆర్ 'రాఖీ'కి సూపర్బ్ మ్యూజిక్‌నిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలనిస్తున్నాడు. 'ఛత్రపతి ప్రసాద్' నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పేరుపొందిన మోడల్ విద్యుత్ జామ్వాల్, రాంగోపాల్‌వర్మ సినిమా 'కాంట్రాక్ట్' ఫేం ఆద్విక్ మహాజన్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మొత్తానికి 'ఊసరవెల్లి'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే సురేందర్‌రెడ్డి తపని ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Wednesday, October 6, 2010

సినిమా: 580 థియేటర్లలో 'మహేశ్ ఖలేజా'

మహేశ్ సినిమా 'మహేశ్ ఖలేజా' 580 థియేటర్లలో గురువారం (7న) వస్తోంది. టైటిల్ విషయంలో చెలరేగిన వివాదం 'మహేశ్ ఖలేజా'కు అనుకూలంగా బుధవారం కోర్టు తీర్పునివ్వడంతో సమసింది. దీంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. మహేశ్ పవర్ ముందు ఏదీ నిలవదని ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సి. కల్యాణ్ పాత్రికేయుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఒక టాప్ హీరో మూడేళ్ల విరామంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇదే ప్రథమమని చెప్పాలి. మహేశ్ మునుపటి సినిమా 'అతిథి' 2007 అక్టోబరులోనే వచ్చిన సంగతి గమనార్హం.
ఇదివరకు పవన్ కల్యాణ్ కూడా ఇలాగే 'జానీ' సినిమా తర్వాత రెండున్నరేళ్లు పైగా గ్యాప్ తీసుకున్నాడు. కాగా ఒక తెలుగు సినిమా విడుదలకు ముందే 35 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేయడం ఇదే మొదటిసారి. అల్లు అరవింద్ కు చెందిన గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అంత మొత్తం వెచ్చించి హక్కులు సొంతం చేసుకుంది. నైజాం, వైజాగ్ ఏరియాలను తన వద్దే వుంచుకుని మిగతా ఏరియాల హక్కుల్ని లాభానికి అమ్ముకుంది.
ఈ నేపథ్యంలో 'మహేశ్ ఖలేజా'కి ఓపెనింగ్స్ అసాధారణ రీతిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది గంటల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సాధిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.