
మరో నట వారసుడు తెలుగు తెరకు పరిచయమయ్యేందుకు రెడీ అవుతున్నాడు. హాస్య నటులు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, బాబూమోహన్ కుమారులు ఇప్పటికే తెరకు పరిచయమయ్యారు. తాజాగా మరో సీనియర్ హాస్యనటుడు తనికెళ్ల భరణి కుమారుడు చైతన్య హీరోగా పరిచయం కాబోతున్నాడు. సెప్టెంబర్ 3న అతను హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ చడీచప్పుడు లేకుండా హైదరాబాద్ లోని రాక్ కాజిల్లో మొదలైంది. ఈ సంగతి మీడియాకు సమాచారం అందించకుండా జాగ్రత్తపడ్డారు. భరణి రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ కి స్టోరీ, డైరెక్షన్ డిపార్టమెంట్స్ లో పనిచేసిన చలపతి ఈ సినిమా ద్వారా డైరెక్టరుగా పరిచయమవుతున్నాడు. ఒక కొత్త నిర్మాత తీస్తున్న ఈ సినిమాలో భరణి కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నారు. కాగా చైతన్య స్క్రీన్ నేమ్ మారే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా హాస్య నటుల పుత్రులు హీరోలుగా పేరు తెచ్చుకోలేక పోయిన నేపథ్యంలో తనికెళ్ల భరణి కుమారుడైనా 'హీరో' అనిపించుకుంటాడో, లేదో చూడాలి.
No comments:
Post a Comment