Thursday, July 11, 2013
Wednesday, July 10, 2013
బాలీవుడ్లో రీమేకులు, సీక్వెళ్లు
రానున్న రోజుల్లో బాలీవుడ్లో రాబోతున్న కొన్ని రీమేక్స్, సీక్వెల్స్ సినీ ప్రేమికుల్లో అమితాసక్తి రేకెత్తిస్తునాయి. వాటిపై ఓ లుక్కేస్తే...
జంజీర్: 1974లో విడుదలైన 'జంజీర్' సినిమాలో ఇన్స్పెక్టర్ విజయ్గా యాంగ్రీ యంగ్మేన్ పాత్ర చేసిన అమితాబ్ బచ్చన్ రాత్రికి రాత్రి స్టార్ హీరోగా అవతరించారు. విజయ్ పాత్రను కొత్తగా రూపొందించిన అపూర్వ లఖియా 'జంజీర్' 2013 సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో రాంచరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దిల్ హై కి మాన్తా నహీ: హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ 'ఇట్ హ్యాపెండ్ వన్ నైట్' ఆధారంగా రూపొందిన 'దిల్ హై కీ మాన్తా నహీ' సినిమాలో అమీర్ఖాన్, పూజాభట్ జంటగా అలరించారు. ఇప్పుడు ఆ సినిమా రీమేక్కి పూజాభట్ డైరెక్టర్ కావడం విశేషం. ఆమె చెల్లెలు అలియాభట్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించబోతున్నారు.
మాసూం: ఎరిక్ సీగల్ పుస్తకం 'మేన్, వుమన్ అండ్ చైల్డ్' ఆధారంగా నసీరుద్దీన్షాతో శేఖర్ కపూర్ రూపొందించిన 'మాసూం' క్లాసిక్ ఫిలింగా పేరుపొందింది. గత ఏడాది 'చిట్టగాంగ్' సినిమాతో జాతీయ అవార్డు పొందిన వేదవ్రత పైన్ ఈ సినిమాకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్టున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్ర చేయనున్నాడు.
సాజన్: మాధురీ దీక్షిత్, సంజయ్దత్, సల్మాన్ఖాన్ నటించిన సూపర్హిట్ ముక్కోణ ప్రేమకథ చిత్రం 'సాజన్'ను నేటి తరం తారలతో సీక్వెల్ చేయనున్నట్లు ఆ సినిమా దర్శకుడు లారెన్స్ డి'సౌజా తెలిపాడు.
బోర్డర్: 1997లో వచ్చిన జె.పి. దత్తా సినిమా 'బోర్డర్' ప్రేక్షకుల, విమర్శకుల ఆదరణ పొందింది. ఇప్పుడు వివిధ యుద్ధ వీరుల జీవితాలతో 'బోర్డర్'కు మూడు సీక్వెల్స్ తీస్తానని ఆయన ప్రకటించారు.
ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్: రాహుల్ బోస్, మల్లికా షెరావత్ వంటి ఆసక్తికర జంటతో రూపొందిన 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా తయారవుతున్న 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్'లో విద్యా బాలన్, ఫరాన్ అఖ్తర్ జంటగా నటిస్తున్నారు.
ఇష్కియా: కొత్త దర్శకుడు అభిషేక్ చౌబీ రూపొందించిన 'ఇష్కియా' అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ వూహించలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్గా తయారవుతున్న 'దేద్ ఇష్కియా'లో మాధురీ దీక్షిత్, హుమా ఖురేషి, అర్షద్ వార్సి, నసీరుద్దీన్షా నటిస్తున్నారు.
ధూం: యష్రాజ్ ఫిలిమ్స్ నిర్మించగా ఒకదాన్ని మించి ఒకటి సూపర్హిట్టయిన్ 'ధూల్' సీరిస్లో మూడోదైన 'ధూల్ 3' కోసం ఈ యేడాది ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అమీర్ఖాన్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్చోప్రా నటిస్తున్నారు.
విశ్వరూప్: కమల్హాసన్ రూపొందించగా 2012లో విడుదలైన 'విశ్వరూప్' ఎంతటి వివాదాన్ని సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు దేశాంతర ఉగ్రవాదంపై కమల్ రూపొందిస్తున్న 'విశ్వరూప్ 2' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
క్రిష్: హృతిక్ రోషన్ను సూపర్ హీరోగా చూపిస్తూ రాకేశ్ రోషన్ రూపొందిస్తున్న సినిమా 'క్రిష్ 3'. నవంబర్లో రానున్న ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్, కంగనా రనౌత్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు.
జంజీర్: 1974లో విడుదలైన 'జంజీర్' సినిమాలో ఇన్స్పెక్టర్ విజయ్గా యాంగ్రీ యంగ్మేన్ పాత్ర చేసిన అమితాబ్ బచ్చన్ రాత్రికి రాత్రి స్టార్ హీరోగా అవతరించారు. విజయ్ పాత్రను కొత్తగా రూపొందించిన అపూర్వ లఖియా 'జంజీర్' 2013 సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో రాంచరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దిల్ హై కి మాన్తా నహీ: హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ 'ఇట్ హ్యాపెండ్ వన్ నైట్' ఆధారంగా రూపొందిన 'దిల్ హై కీ మాన్తా నహీ' సినిమాలో అమీర్ఖాన్, పూజాభట్ జంటగా అలరించారు. ఇప్పుడు ఆ సినిమా రీమేక్కి పూజాభట్ డైరెక్టర్ కావడం విశేషం. ఆమె చెల్లెలు అలియాభట్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించబోతున్నారు.
మాసూం: ఎరిక్ సీగల్ పుస్తకం 'మేన్, వుమన్ అండ్ చైల్డ్' ఆధారంగా నసీరుద్దీన్షాతో శేఖర్ కపూర్ రూపొందించిన 'మాసూం' క్లాసిక్ ఫిలింగా పేరుపొందింది. గత ఏడాది 'చిట్టగాంగ్' సినిమాతో జాతీయ అవార్డు పొందిన వేదవ్రత పైన్ ఈ సినిమాకి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్టున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్ర చేయనున్నాడు.
సాజన్: మాధురీ దీక్షిత్, సంజయ్దత్, సల్మాన్ఖాన్ నటించిన సూపర్హిట్ ముక్కోణ ప్రేమకథ చిత్రం 'సాజన్'ను నేటి తరం తారలతో సీక్వెల్ చేయనున్నట్లు ఆ సినిమా దర్శకుడు లారెన్స్ డి'సౌజా తెలిపాడు.
బోర్డర్: 1997లో వచ్చిన జె.పి. దత్తా సినిమా 'బోర్డర్' ప్రేక్షకుల, విమర్శకుల ఆదరణ పొందింది. ఇప్పుడు వివిధ యుద్ధ వీరుల జీవితాలతో 'బోర్డర్'కు మూడు సీక్వెల్స్ తీస్తానని ఆయన ప్రకటించారు.
ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్: రాహుల్ బోస్, మల్లికా షెరావత్ వంటి ఆసక్తికర జంటతో రూపొందిన 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా తయారవుతున్న 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్'లో విద్యా బాలన్, ఫరాన్ అఖ్తర్ జంటగా నటిస్తున్నారు.
ఇష్కియా: కొత్త దర్శకుడు అభిషేక్ చౌబీ రూపొందించిన 'ఇష్కియా' అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ వూహించలేదు. ఇప్పుడు దానికి సీక్వెల్గా తయారవుతున్న 'దేద్ ఇష్కియా'లో మాధురీ దీక్షిత్, హుమా ఖురేషి, అర్షద్ వార్సి, నసీరుద్దీన్షా నటిస్తున్నారు.
ధూం: యష్రాజ్ ఫిలిమ్స్ నిర్మించగా ఒకదాన్ని మించి ఒకటి సూపర్హిట్టయిన్ 'ధూల్' సీరిస్లో మూడోదైన 'ధూల్ 3' కోసం ఈ యేడాది ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అమీర్ఖాన్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్చోప్రా నటిస్తున్నారు.
విశ్వరూప్: కమల్హాసన్ రూపొందించగా 2012లో విడుదలైన 'విశ్వరూప్' ఎంతటి వివాదాన్ని సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు దేశాంతర ఉగ్రవాదంపై కమల్ రూపొందిస్తున్న 'విశ్వరూప్ 2' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
క్రిష్: హృతిక్ రోషన్ను సూపర్ హీరోగా చూపిస్తూ రాకేశ్ రోషన్ రూపొందిస్తున్న సినిమా 'క్రిష్ 3'. నవంబర్లో రానున్న ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్, కంగనా రనౌత్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు.
Tuesday, July 9, 2013
Monday, July 8, 2013
Friday, July 5, 2013
Thursday, July 4, 2013
Saturday, June 15, 2013
సినిమాకి కీలకం కథ, సంభాషణలు
ప్రతి కథనీ సినిమా తీసి చూపించడం సులువే. కానీ చూసేవాళ్లని మెప్పించడం మాత్రం సులువు కాదు. అందుచేతే సినిమా కథ ఎలా వుండాలనే ఓ పెద్ద ప్రశ్న ప్రతి నిర్మాత బుర్రనీ తినేస్తోంది. సినిమా కథ ఇలా వుండాలని ఇదమిత్థంగా నిరూపించడం ఎవరి తరం? నిర్మాతా మంచి కథనే కోరుతాడు, కథకుడూ మంచి కథ రాయడానికే ప్రయత్నిస్తాడు. తీరా ఆ కథ తెరకెక్కాక ప్రేక్షకులు పెదవి విరిచి "అబ్బే.. ఏం సినిమా?" అనేస్తారు. "ఎప్రిషియేట్ చెయ్యలేని యెదవ జనం" అని నిర్మాతా, దర్శకుడూ (సాధారణంగా అతనే కథకుడుగానూ ఉంటాడు కాబట్టి) తిట్టుకుంటారు. రచయిత రాసింది నిజంగా మంచి కథే కావచ్చు. కాని జనానికి నచ్చనినాడు అది పనికిరాని కథకిందే లెక్క. ఇన్నేళ్ల పరిశీలన తర్వాత కథల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రేక్షకుల్ని మెప్పించవచ్చని నా అభిప్రాయం.
పాత్రలు
కథకి ముఖ్యమైనవి పాత్రలు. ప్రతి పాత్రకీ తనదైన 'పర్పస్' ఉండి తీరాలి. అనవసర పాత్రలు జనానికి విసుగు పుట్టించడమే కాకుండా, ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెంచుతాయి. పర్పస్తో పాటు పాత్రోచితమైన 'డిగ్నిటీ' చాలా అవసరం. కథ నడకతో పాటు పాత్ర పోషణ (కేరక్టర్ డెవలప్మెంట్) విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అలా సృజించిన పాత్రల్ని చివరకు నట్టడవిలో వదిలేయకుండా సముచితంగానూ, సమంజసం అనిపించేట్లు గానూ ముగించాలి. ఎలాంటి సన్నివేశాల్లోనూ పాత్రల్లో ఏమాత్రం కృత్రిమత్వం కనిపించకూడదు. కనిపించిందంటే ప్రేక్షకుల్ని దూరం చేసుకున్నట్లే.
సంభాషణలు
కథలో పాత్రల తర్వాత, ముఖ్యంగా జనాకర్షణకి తోడ్పడేవి సంభాషణలు. పాత్రలకి ప్రాణం ఈ సంభాషణలే. కథలో పటుత్వం ఏమీ లేకపోయినా కేవలం సంభాషణల మీద ఆధరపడి సక్సెసయిన సినిమాలెన్నో ఉన్నాయి. కథకి మంచి సంభాషణలు ఎంత ముఖ్యమో వాటిని రాయడం అంత కష్టం. గొప్ప కథలు సృష్టించిన వాళ్లంతా గొప్పగా సంభాషణలు రాయలేరు. మన తెలుగులో రచయితలకి ఇవ్వాల్సినంత గుర్తింపూ, గౌరవం ఇవ్వకపోవడం వల్లే అడపాదడపా తప్ప గొప్ప కథలు కానీ, సందర్భోచితమైన చక్కని డైలాగులు కానీ సినిమాల్లో కనిపించడం లేదు. అందుకే నిర్మాతలు కేవలం పెట్టుబడి పెట్టడమే తమ పని అనుకోకుండా, క్రేజీ కాంబినేషన్లని సంపాదించడమే తమ పని అనుకోకుండా, మంచి కథ సంపాదించే విషయంలో చాలా శ్రద్ధ చూపాలి. అవసరమనుకుంటే ఒక్కరితోనే కాకుండా ఇద్దరు ముగ్గురిని కలిపి కథ రాయించాలి. దాన్ని మరో ఇద్దరిచేత 'అడాప్ట్' చేయించాలి. ఈ మధ్య మన పేరుపొందిన కొంతమంది దర్శకులు ఇలా తమ వద్ద పనిచేసే రచయితల చేత ఈ పనులన్నీ చేయించుకుని టైటిల్స్లో వారికి క్రెడిట్ ఇవ్వకుండా కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం అని తమ ఒక్కరిపేరే వేయించుకుంటూ ఆ రచయితలకు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో యస్.యస్. రాజమౌళి అభినందనీయుడు. కథ, సంభాషణల క్రెడిట్ను ఆయా రచయితలకు ఇచ్చేస్తుంటాడు. ఈ విషయంలో ఆయన్ని అనుసరిస్తే రచయితలు మరింతమంది వెలుగు చూస్తారు. మంచి కథలు రాసే ఉత్సాహం వారిలో కలుగుతుంది.
ప్రేక్షకులకి ఇంటరెస్ట్ కలిగించకుండా కొంతవరకు సినిమా నడిచినా ఒక్క సన్నివేశంతో వాళ్లని గొల్లుమని నవ్వించేట్లు చేసి, సినిమాని రక్తి కట్టించవచ్చు. ఇటీవలి 'ప్రేమకథాచిత్రం', 'సంథింగ్ సంథింగ్' సినిమాలు ఇందుకు చక్కని ఉదాహరణలు. సంభాషణల్లో సాధ్యమైనంతవరకూ సున్నితమైన హాస్యం, భావ గాంభీర్యం, సమయస్ఫూర్తి కలిగిన 'రిపార్టీ' ఉండాలి. చెప్పవలసినదెంత పెద్ద విషయమైనా వీలైనంత క్లుప్తంగా చెబితేనే బోర్కొట్టకుండా ఉంటుంది. డైలాగ్స్ పేలవంగా ఉన్న సినిమా దెబ్బతిన్నదన్న మాటే. భాష ఎంత పొంకంగా ఉంటే అంత మంచిది. పొల్లు మాటలు లేకుండా ఉంటే మరీ మంచిది.
పాత్రలమీద ప్రేక్షకులకి కలిగే ఇంటరెస్టంతా సంభాషణల మీదే ఆధరపడి ఉంటుంది కాబట్టి, వాటిని రాయడంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. కొంతమంది రచయితలు కథ నడపడం చేతకాక, మాటలతో కథ చెబుతారు. అలా చెయ్యడం చాలా తప్పు. జరగబోయే కథని ముందే మాటల్లో తెలియజేయడమంటే, సినిమాని చేతులార ఖూనీ చేయడమే. రాబోయే కథని సస్పెన్సులో పెట్టి, ముందేం జరుగుతుందో అని జనం అనుకునేట్లు చేయాలి. కథ నడుస్తున్న కొద్దీ, ఇంటరెస్టు, స్పీడు పెరిగేట్లు చేయాలి. అన్నింటికంటే ముఖ్యం - కథారంభాన్ని ఆకర్షణీయంగా ఎత్తుకొని, ముగింపు ప్రేక్షక హృదయాల్లో నిల్చిపోయేటట్లు చూడాలి.
పాత్రలు
కథకి ముఖ్యమైనవి పాత్రలు. ప్రతి పాత్రకీ తనదైన 'పర్పస్' ఉండి తీరాలి. అనవసర పాత్రలు జనానికి విసుగు పుట్టించడమే కాకుండా, ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెంచుతాయి. పర్పస్తో పాటు పాత్రోచితమైన 'డిగ్నిటీ' చాలా అవసరం. కథ నడకతో పాటు పాత్ర పోషణ (కేరక్టర్ డెవలప్మెంట్) విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అలా సృజించిన పాత్రల్ని చివరకు నట్టడవిలో వదిలేయకుండా సముచితంగానూ, సమంజసం అనిపించేట్లు గానూ ముగించాలి. ఎలాంటి సన్నివేశాల్లోనూ పాత్రల్లో ఏమాత్రం కృత్రిమత్వం కనిపించకూడదు. కనిపించిందంటే ప్రేక్షకుల్ని దూరం చేసుకున్నట్లే.
సంభాషణలు
కథలో పాత్రల తర్వాత, ముఖ్యంగా జనాకర్షణకి తోడ్పడేవి సంభాషణలు. పాత్రలకి ప్రాణం ఈ సంభాషణలే. కథలో పటుత్వం ఏమీ లేకపోయినా కేవలం సంభాషణల మీద ఆధరపడి సక్సెసయిన సినిమాలెన్నో ఉన్నాయి. కథకి మంచి సంభాషణలు ఎంత ముఖ్యమో వాటిని రాయడం అంత కష్టం. గొప్ప కథలు సృష్టించిన వాళ్లంతా గొప్పగా సంభాషణలు రాయలేరు. మన తెలుగులో రచయితలకి ఇవ్వాల్సినంత గుర్తింపూ, గౌరవం ఇవ్వకపోవడం వల్లే అడపాదడపా తప్ప గొప్ప కథలు కానీ, సందర్భోచితమైన చక్కని డైలాగులు కానీ సినిమాల్లో కనిపించడం లేదు. అందుకే నిర్మాతలు కేవలం పెట్టుబడి పెట్టడమే తమ పని అనుకోకుండా, క్రేజీ కాంబినేషన్లని సంపాదించడమే తమ పని అనుకోకుండా, మంచి కథ సంపాదించే విషయంలో చాలా శ్రద్ధ చూపాలి. అవసరమనుకుంటే ఒక్కరితోనే కాకుండా ఇద్దరు ముగ్గురిని కలిపి కథ రాయించాలి. దాన్ని మరో ఇద్దరిచేత 'అడాప్ట్' చేయించాలి. ఈ మధ్య మన పేరుపొందిన కొంతమంది దర్శకులు ఇలా తమ వద్ద పనిచేసే రచయితల చేత ఈ పనులన్నీ చేయించుకుని టైటిల్స్లో వారికి క్రెడిట్ ఇవ్వకుండా కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం అని తమ ఒక్కరిపేరే వేయించుకుంటూ ఆ రచయితలకు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో యస్.యస్. రాజమౌళి అభినందనీయుడు. కథ, సంభాషణల క్రెడిట్ను ఆయా రచయితలకు ఇచ్చేస్తుంటాడు. ఈ విషయంలో ఆయన్ని అనుసరిస్తే రచయితలు మరింతమంది వెలుగు చూస్తారు. మంచి కథలు రాసే ఉత్సాహం వారిలో కలుగుతుంది.
ప్రేక్షకులకి ఇంటరెస్ట్ కలిగించకుండా కొంతవరకు సినిమా నడిచినా ఒక్క సన్నివేశంతో వాళ్లని గొల్లుమని నవ్వించేట్లు చేసి, సినిమాని రక్తి కట్టించవచ్చు. ఇటీవలి 'ప్రేమకథాచిత్రం', 'సంథింగ్ సంథింగ్' సినిమాలు ఇందుకు చక్కని ఉదాహరణలు. సంభాషణల్లో సాధ్యమైనంతవరకూ సున్నితమైన హాస్యం, భావ గాంభీర్యం, సమయస్ఫూర్తి కలిగిన 'రిపార్టీ' ఉండాలి. చెప్పవలసినదెంత పెద్ద విషయమైనా వీలైనంత క్లుప్తంగా చెబితేనే బోర్కొట్టకుండా ఉంటుంది. డైలాగ్స్ పేలవంగా ఉన్న సినిమా దెబ్బతిన్నదన్న మాటే. భాష ఎంత పొంకంగా ఉంటే అంత మంచిది. పొల్లు మాటలు లేకుండా ఉంటే మరీ మంచిది.
పాత్రలమీద ప్రేక్షకులకి కలిగే ఇంటరెస్టంతా సంభాషణల మీదే ఆధరపడి ఉంటుంది కాబట్టి, వాటిని రాయడంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. కొంతమంది రచయితలు కథ నడపడం చేతకాక, మాటలతో కథ చెబుతారు. అలా చెయ్యడం చాలా తప్పు. జరగబోయే కథని ముందే మాటల్లో తెలియజేయడమంటే, సినిమాని చేతులార ఖూనీ చేయడమే. రాబోయే కథని సస్పెన్సులో పెట్టి, ముందేం జరుగుతుందో అని జనం అనుకునేట్లు చేయాలి. కథ నడుస్తున్న కొద్దీ, ఇంటరెస్టు, స్పీడు పెరిగేట్లు చేయాలి. అన్నింటికంటే ముఖ్యం - కథారంభాన్ని ఆకర్షణీయంగా ఎత్తుకొని, ముగింపు ప్రేక్షక హృదయాల్లో నిల్చిపోయేటట్లు చూడాలి.
Friday, May 31, 2013
Subscribe to:
Posts (Atom)











