Monday, August 15, 2011

న్యూస్: వెంకటేశ్, ఆదిత్య కాంబినేషన్ కుదిరేనా?

వెంకటేశ్‌ని వి.ఎన్. ఆదిత్య డైరెక్ట్ చేయబోతున్నాడా? సీనియర్ నిర్మాత డి. రామానాయుడు మాటల్ని బట్టి ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఆదిత్య దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన 'ముగ్గురు' సినిమా ఈ నెల (ఆగస్ట్) 19న రిలీజ్ కాబోతోంది. ఇందులో నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా నటిస్తే, వారికి జోడీలుగా శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య నటించారు. రీమాసేన్ మరో మెయిన్ రోల్ చేసింది. ఈ సినిమా సెట్స్ మీద ఆదిత్య పనితీరు పట్ల రామానాయుడు బాగా ఇంప్రెస్ అయ్యారు. అందుకే అతని దర్శకత్వంలో మరో సినిమా చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే భూపతిరాజా చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చింది. "వెంకటేశ్‌కి ఆ కథ బాగుంటుంది. వాడు సరేనంటే ఈ సినిమాని ఆదిత్య డైరెక్షన్‌లో తీస్తాను' అని ఆయన చెప్పారు. అంటే వెంకటేశ్ ఈ ప్రాజెక్టుకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంకో సంగతేమంటే ఈ ప్రాజెక్ట్ విషయం ఆదిత్యకి ఇంకా తెలీకపోవడం. గతంలో నాగార్జున వంటి టాప్ హీరోతో రెండు సినిమాలు - 'నేనున్నాను', 'బాస్' చేసిన ఆదిత్య వాటి తర్వాత మరో పెద్ద హీరోని డైరెక్ట్ చేయలేదు. ఇప్పుడు వెంకటేశ్‌తో ప్రాజెక్ట్ కుదిరితే అతను ఏమేరకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఇక్కడ ఇంకో కిటుకు కూడా ఉంది. 19న రాబోతున్న 'ముగ్గురు' పెద్ద హిట్టు కాకపోయినా ఆదిత్య బాగా చేశాడనే పేరు వస్తేనే అతనితో చేసేందుకు వెంకటేశ్ ఒప్పుకునే వీలుంది. లేదంటే... అంతే సంగతులు.

No comments: