Saturday, August 20, 2011

ప్రివ్యూ: బిజినెస్ మేన్

హీరో మహేశ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా 'బిజినెస్ మేన్'. వాళ్ల తొలి సినిమా 'పోకిరి' అంతకు మునుపటి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసి, తెలుగులో తొలిసారిగా 40 కోట్ల రూపాయల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. 'బిజినెస్ మేన్'ని ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ తీస్తోంది. ఆ బేనర్‌లో చేయడం ఇటు మహేశ్‌కీ, అటు జగన్నాథ్‌కీ ఇదే తొలిసారి. డా. వెంకట్ నిర్మాతగా, వి. సురేశ్‌రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. "ఇంతవరకు నేను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులో హీరో కేరక్టర్ ద బెస్ట్ అనిపించేలా ఉంటుంది. లవ్ అండ్ యాక్షన్ ప్రధానంగా సబ్జెక్ట్ నడుస్తుంది" అని జగన్నాథ్ చెప్పగా "ఈ కథ విన్నప్పట్నించీ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నా. హీరో రోల్ అసాధారణంగా ఉంది. జగన్నాథ్ కాంబినేషన్‌లో అందరూ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజిలోనే ఈ సినిమా ఉంటుంది" అని మహేశ్ తెలిపాడు.
2012 సంక్రాంతికి (జనవరి 12న) రిలీజయ్యే ఈ సినిమాకి సంగీతం: ఎస్.ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: శ్యాం కె. నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: విజయ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

No comments: