Saturday, August 13, 2011

న్యూస్: 'బ్యాచిలర్స్ 2' గెలుస్తారా?

సినీ డైరెక్టర్‌గా మారిన లాయర్ సానా యాదిరెడ్డి 2002లో తీసిన 'బ్యాచిలర్స్' సినిమా మంచి హిట్టయ్యింది. అందులో శివాజీ, మాన్య, సుమిత్ రాయ్, జాకిర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఆ జాకిర్ ఆ సినిమాకి సీక్వెల్‌గా 'బ్యాచిలర్స్ 2' తీశాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అతను అందులో ఓ మెయిన్ హీరోగానూ చేశాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు విహార యాత్రకి వెళ్లే కొంతమంది బ్యాచిలర్స్‌కి రోడ్ మీద ఎదురయ్యే సంఘటనలే ఈ సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద పీట వేసి ఈ సినిమా తీసినట్లు జాకిర్ చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. జాకిర్‌తో పాటు ఎవిన్, బాషా, రాజశేఖర్ బ్యాచిలర్స్‌గా నటించిన ఈ సినిమాలో తృప్తి శర్మ హీరోయిన్. అలీ కూడా కామెడీ పంచే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న జాకిర్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లేని సమకూర్చాడు. "మొదటి బ్యాచిలర్స్‌తో నటుడిగా గుర్తింపు వచ్చిన నాకు ఈ సీక్వెల్‌తో డైరెక్టర్‌గా గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పాడు జాకిర్. అతడి ఆశ నెరవేరుతుందో, లేదో చూడాలి.

No comments: