Friday, July 8, 2011

న్యూస్: ఆ రెండింటితో ఎన్టీఆర్ టాప్ హీరో అయ్యేనా?

కొడాలి నాని తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా 'అదుర్స్' సినిమా నైజాంలో నష్టపోవడం, దిల్ రాజు చెప్పిన రేంజిలో 'బృందావనం' హిట్టు కాకపోవడం, ఇక ఈ యేడాది విడుదలైన 'శక్తి' డిజాస్టర్ కావడంతో చిన్న ఎన్‌టీఆర్ మాంచి కసి మీదున్నాడు. ఎలాగైనా ఈసారి భారీ హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ప్రస్తుతం అతను రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్న 'ఊసరవెళ్లి' కాగా, మరోటి బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న పేరుపెట్టని చిత్రం. 'ఊసరవెళ్లి' షూటింగ్ యమ స్పీడుగా జరుగుతోంది. ఎలాగైనా దసరా సెలవులకి, అంటే సెప్టేంబర్ చివరకి 'ఊసరవెల్లి'ని ప్రేక్షకుల మధ్యకి తీసుకు రావాలని నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఇందులో ఎన్‌టీఆర్ జోడీగా నేటి క్రేజీ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. 'కిక్' వంటి హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇంతకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న సినిమా. కారణం వరుసగా మూడు హిట్ సినిమాల్ని (భద్ర, తులసి, సింహా) డైరెక్ట్ చేసిన బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు కావడం. పైగా ఇందులో హీరోయిన్ శృతీహాసన్. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులతో తను టాప్ లీగ్‌లోకి మళ్లీ వస్తాననే నమ్మకం ఎన్‌టీఆర్‌లో నిండుగా కనిపిస్తోంది.

No comments: