Tuesday, July 12, 2011

న్యూస్: హీరో కెరీర్ కోసం మరో కమెడియన్ కొడుకు

హీరో కెరీర్ కోసం మరో తెలుగు కమెడియన్ కొడుకు ప్రయత్నిస్తున్నాడు. అతను సీనియర్ కమెడియన్, కేరక్టర్ ఆర్టిస్ట్, రచయిత అయిన తనికెళ్ల భరణి కుమారుడు తేజ. అతను హీరోగా పరిచయం కాబోతున్న సినిమా పేరు 'మిస్టర్ లవంగం'. హాస్యం మేళవించిన ఫ్యామిలీ స్టోరీతో మల్లాది అనే దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా పరిస్థితులు అనుకూలిస్తే జూలైలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇంతవరకు ఏ తెలుగు కమెడియన్ కొడుకూ హీరోగా వెండితెరపై తన ముద్రని వేయలేకపోయాడు. ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రం, బాబూమోహన్ కొడుకు ఉదయ్‌కుమార్, బ్రహ్మానందం తనయుడు గౌతం హీరోగా రాణించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు భరణి కుమారుడు తేజ వంతొచ్చింది. అతనైనా హీరోగా సక్సెస్ అవుతాడా లేక మిగతా కమెడియన్ కొడుకుల బాటనే అనుసరిస్తాడా.. అన్నది వేచి చూడాలి.

No comments: