Friday, July 22, 2011

న్యూస్: 'అమాయకుడు' బాక్సాఫీసు వద్ద నిలుస్తాడా?

హీరోగా కృష్ణుడు కెరీర్ పరీక్షకు నిలుస్తున్న తరుణమిది. 'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' సినిమాలతో స్థూలకాయుడైన తొలి తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్న అతను ఆ తర్వాత ఆ మ్యాజిక్‌ని కొనసాగించలేక పోయాడు. అతను హీరోగా నటించిన 'పప్పు', 'కోతిమూక', 'వైకుంఠపాళి' సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫెయిలయ్యాయి. ఇప్పుడు మూడు వారాల గ్యాప్‌లో అతని సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొదటగా ఈ నెల (జూలై) 22న 'అమాయకుడు' విడుదల కాగా,  ఆగస్టు 11న 'నాకూ ఓ లవరుంది' విడుదలవుతోంది. 'అమాయకుడు' సినిమా రెండేళ్ల క్రితమే మొదలైనా ఇప్పటికి వచ్చింది. తమిళుడైన భారతీగణేశ్ దీని దర్శకుడు. ముగ్గురమ్మాయిల మధ్య చిక్కుకున్న యువకుడిగా ఈ సినిమాలో కృష్ణుడు నటించాడు. ఆ ముగ్గురిలో తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడనేది కథాంశం. ఇక 'నాకూ ఓ లవరుంది' విషయానికొస్తే ఇందులో బ్రాహ్మణ పురోహితునిగా నటించాడు. ఈ సినిమా ద్వారా రాం వెంకీ దర్శకునిగా, రితిక హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ రెండు సినిమాల బాక్సాఫీసు ఫలితం అతని కెరీర్‌ని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. మునుపటి సినిమాలు ఫ్లాపవడం అతని సినిమాల బిజినెస్‌పై ప్రభావాన్ని చూపుతోంది. ఈ పరిస్థితిలో వీటిలో ఒకటైనా హిట్టవడం కృష్ణుడికి అవసరం.

No comments: