Sunday, September 25, 2011

న్యూస్: వెయ్యిమంది అంధులు నటిస్తున్న 'వి'

స్లీప్‌లెస్ డ్రీమ్స్ పతాకంపై వివేక్ దర్శకత్వంలో పి. మహేశ్ నిర్మిస్తున్న చిత్రం 'వి'. ఈ సినిమాకి సంబంధించిన విశేషం - వెయ్యిమంది పైగా అంధులు ఇందులో నటించబోతున్నారు. వీరిలో 40 మంది ప్రధాన పాత్రధారులు. దర్శకుడు వివేక్ ఈ సంగతి తెలిపారు. "ప్రపంచంలో పూర్తిగా అంధులతోటే నిర్మించిన చిత్రం ఇంతవరకూ లేదు. ఆ రికార్డుని 'వి' సొంతం చేసుకోబోతోంది. అయితే సినిమాలో వాళ్లు అంధులుగా కాకుండా సాధారణ వ్యక్తులుగా నటించబోతున్నారు. అందుకే అక్టోబర్ 15న జరిగే షూటింగ్ ప్రారంభోత్సవానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులు హాజరు కాబోతున్నారు. 'ముందుగా ప్రయాణం ప్రారంభించండి. హాయిగా ప్రయాణించి, సుఖంగా ఇంటికి చేరండి' అనే పాయింట్‌తో ఈ చిత్ర కథ నడుస్తుంది. ట్రాఫిక్‌లో తలెత్తే అనేక ఇబ్బందుల్ని ప్రధానంగా చూపిస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంతో సుమారు 400 మంది అంధులకు ఆపరేషన్ చేసి, కళ్లు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి మార్ఫి రచన చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా తెలుగులో చేస్తున్న ఈ బృహత్ ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశిద్దాం.

No comments: