Wednesday, August 25, 2010

Nostalgia: LV Prasad replaced Gopichand


ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో 1945లో విడుదలైన 'గృహప్రవేశం' సినిమాని నిజానికి డైరెక్ట్ చేయాల్సింది ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్. 'లక్ష్మమ్మ' సినిమాని డైరెక్ట్ చేయాడానికి ముందే 'పెంకి పిల్ల' అనే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు గోపీచంద్. మరో డైరెక్టర్ కె.ఎస్. ప్రకాశరావు ఈ సినిమాని నిర్మించారు. అయితే సారథి స్టూడియోస్ భాగస్వామ్యంలో నిర్మించడం వల్ల ఆ బానరునే ఉపయోగించారు. ఈ సినిమా పెట్టుబడి రు. 60 వేలు. ఇందులో సగం సారథి వాళ్లు పెడితే, మిగతా సొమ్ముని ప్రకాశరావు, గోపీచంద్, ఎం.ఎస్. చౌదరి కలిసి పెట్టారు. దర్శకత్వ బాధ్యతలు గోపీచంద్ తీసుకున్నారు. తనకు డైరెక్షన్ చాన్స్ ఇస్తేనే హీరోగా నటిస్తానని ఎల్.వి. ప్రసాద్ తేల్చిచెప్పడంతో గోపీచంద్ ని ఒప్పించి ప్రసాద్ కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చారు ప్రకాశరావు. 'పెంకి పిల్ల' పేరుని 'గృహప్రవేశం'గా మార్చింది ప్రసాదే. ఈ సినిమాలో భానుమతి హీరోయిన్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా బిజీ అయ్యారు ప్రసాద్.

No comments: