Tuesday, August 31, 2010

Nostalgia: KBK Mohanraj - The Forgotten Singer

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 'పూలరంగడు' (1967) సినిమాలోని 'చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవీ' పాటని ఆలపించినదెవరో తెలుసా? నేటి తరంలో చాలామందికి తెలీని ఆ గాయకుడు కె.బి.కె. మోహన్ రాజ్. పూర్తి పేరు కొండా బాబూ కృష్ణమోహన్ రాజు.
విజయవాడలో ఉషాకన్య, శేషయ్య దంపతులకు తొలి సంతానంగా 1934లో పుట్టిన మోహన్ రాజు ఎలక్ట్రికల్ బోర్డులో ఉద్యోగిగా వుంటూనే ఆకాశవాణి గాయకుడిగా ప్రవృత్తిని చేపట్టారు. 1957లో అఖిల భారత స్థాయిలో జరిగిన 'మర్ఫీ మెట్రో పాటల పోటీ'లో దక్షిణ బారతదేశంలోనే ప్రథమ స్థానం పొందారు. ఆ పోటీలకు అనిల్ బిశ్వాస్, నౌషాద్, పంకజ్ మల్లిక్ వంటి మహామహులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
కృష్ణమోహన్ రాజుకు బాగా పేరు తెచ్చిన సినీ గీతాలు..

రాధవు నీవయితే.. నా రాధవు నీవయితే.. నిను మలచుకుంటాను నా మురళిగా.. (ఇనస్పెక్టర్ భార్య)
అన్నా వదినలు మా కోసం అమ్మానాన్నగ మారారు (పెద్దన్నయ్య)
బండెనక బండిగట్టి పదహారు బండ్లుగట్టి.. ఏ బండ్లో వస్తవొ కొడుకో నైజాము సర్కరోడా (గద్దర్ తో కలిసి 'మాభూమి'లో)
కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం.. కనిపిస్తూ నువ్వూ నేనూ ఆడుతాము బూటకం (తాసిల్దారుగారి అమ్మాయి)
చిన్నారి చెల్లి.. ఈ యింటవున్న మరేయింట వున్న నీవున్న ఆ యింట దీపావళి (దేవుడమ్మ)
ఎవరికి వారే ఈ లోకం.. రారు ఎవ్వరూ నీకోసం (సాక్షి)

ఉద్యోగంలో రిటైర్ అయ్యాక విశ్రాంతి తీసుకుంటూ అవకాశం లభించినప్పుడల్లా సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ శేష జీవితం గడుపుతున్నారు మోహన్ రాజు.

No comments: