Monday, August 23, 2010

Movies: Colors Swathi pairing with Sunil


సునీల్ కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న 'కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు' సినిమా షూటింగ్ ఈ నెల 27న ప్రారంభం కానున్నది. ఆ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగే ఈ ప్రోగ్రాముకి నిన్నటి తరం టాలీవుడ్, బాలీవుడ్ అగ్రతార శ్రీదేవి చీఫ్ గెస్టుగా హాజరు కానుండటం విశేషం. ఇదివరకు 'హోమం', 'సిద్ధం' సినిమాల్ని నిర్మించిన శ్రేయా ప్రొడక్షన్స్ అధినేత కోనేరు కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఒక హీరోయినుగా 'కలర్స్' స్వాతి నటించనుండగా, మరో నాయిక పాత్రను ఒక ముంబై తార పోషించనున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. సుమన్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకి కథ, స్క్రీన్-ప్లేను రాంగోపాల్ వర్మ సమకూరుస్తున్నారు. చాలా కాలం విరామంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, తాజాగా 'మర్యాదరామన్న'గా ప్రేక్షకుల ఆదరాన్ని పొందిన సునీల్ హీరోగా నటిస్తుండటం వల్ల ఈ సినిమా ప్రారంభానికి ముందే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

No comments: