Sunday, August 29, 2010

Movies: 'Gaganam' inspired from Kandahar incident


నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గగనం' సినిమా ఇతివృత్తానికి కాందహార్ సంఘటన ఆధారం. రాధామోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బానరుపై రాజు నిర్మిస్తున్నారు. 1999 డిసెంబర్ 24న ఖాట్మండు (నేపాల్)లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హర్కత్-ఉల్-ముజాహిదీన్ సంస్థకు చెందిన టెర్రటిస్టులు హైజాక్ చేశారు. విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ లో బలవంతంగా దింపేశారు. 176 మంది ప్రయాణీకుల్లో 27 మంది మాత్రమే దుబాయిలో విడుదల చేశారు. ఇప్పుడు ఈ సంఘటనే 'గగనం' కథకి ఆధారం. తీవ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి, కొంతమందిని కిడ్నాప్ చేస్తే ఒక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండో తన బృందంతో ఏం చేశాడన్నది ఈ సినిమాలోని ప్రధానాంశం. "ఇందులో మైండ్ గేమ్ ప్రధానం. పాటలుండవు. కొత్త తరహా సినిమా. ప్రజలు ఆదరిస్తే ఈ తరహా సినిమాలు మరిన్ని వస్తాయి" అని చెప్పారు నాగార్జున.

No comments: