Thursday, August 26, 2010

Movie: 'Brindavanam' audio on 12 Sept


ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాజు నిర్మిస్తున్న 'బృందా వనం' చిత్రం అక్టోబరు ఒకటిన విడుదల కానుంది. సెప్టెంబరు 12న ఆడియోను రిలీజ్ చేస్తామని చిత్రనిర్మాత రాజు చెప్పారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఎన్టీఆర్, కాజల్‌పై పాటను చిత్రీకరిస్తున్నామని, మిగిలిన రెండు పాటలను స్విట్జర్లాండ్, టర్కీల్లో చిత్రీకరించడంతో చిత్రనిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు.
'ఆది సినిమాను పంపిణీ చేసినప్పటినుంచి ఎన్.టి.ఆర్.తో సినిమా తీయాలనే కోరిక ఇప్పటికి నేరవేరింది. సినిమా టైటిల్ సాఫ్ట్‌గా ఉందని అంటున్నారు. అయితే సినిమాలో అన్ని రసాలూ ఉన్నాయి. 40 రోజుల పాటు చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి. కథలో మిళితమై యాక్షన్ పార్ట్ ఉంటుంది. 36 మంది ప్రముఖ నటీనటులు చిత్రంలో నటిస్తున్నారు. ఒక పెద్ద స్టార్‌తో ఎటువంటి సినిమా తీస్తే సక్సెస్ అవుతుందో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి' అన్నారాయన.
చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 'సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ చిత్రకథను ఎన్టీఆర్ ఓకే చేశారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. అలాగే కష్టకాలంలో నాకు అండగా నిలిచి మోరల్ సపోర్ట్ ఇచ్చిన కొరటాల శివగారికి, నా అసోసియేట్స్ అశ్విన్, సూర్యలకు కృతజ్ఞతలు' అన్నారు.
కాజల్, సమంతా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మాజి, బ్రహ్మానందం, రఘుబాబు, ఆహుతిప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యతారాగణం.

No comments: