Friday, September 24, 2010

సినిమా: సౌందర్యలాంటి నటి కావాలి

"అప్పట్లో నా దర్శకత్వంలో 'నర్తనశాల' మొదలుపెట్టా. సౌందర్య చనిపోవడంతో ఆ ప్రాజెక్టు కాస్తా ఆగిపోయింది. ద్రౌపది పాత్రే ఆ సినిమాకి కీలకం. సౌందర్య వంటి ఆర్టిస్టు కావాలి. ఆమె తర్వాత ఇంకెవ్వరూ నాకు కనిపించడం లేదు. నా మనసులో దర్శకత్వమనే బీజం ఇప్పటికే పడిపోయింది కాబట్టి, అది రోజురోజుకీ పెరిగి పెద్దదవుతూనే ఉంది. ద్రౌపది పాత్రకు సరైన నాయిక దొరికితే - ఆ క్షణమే 'నర్తనశాల' మొదలుపెడతా. ఎవరిని పడితే వారిని పెట్టి ఆ సినిమా చేయకూడదు. ఒక్క మిస్ కాస్టింగ్ చాలు - సినిమా పోవడానికి. అలా నా కెరీరులో మిస్ కస్టింగ్ వల్ల పోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి" అన్నారు బాలకృష్ణ.                      

No comments: