Saturday, October 30, 2010

ఆనాటి సంగతి: 'పెళ్లి కానుక' రజతోత్సవం

అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి, కృష్ణకుమారి, జగ్గయ్య కాంబినేషనులో వచ్చిన 'పెళ్లి కానుక' (1960) చిత్రం విజయవాడ అలంకార్ థియేటర్లో 25 వారాలు (175 రోజులు) ఆడింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజతోత్సవం మద్రాసులోని న్యూవుడ్ లాండ్స్ హోటల్లో 1960 నవంబర్ 6న జరిగింది. ఆరోజు కుంభవృష్టిగా వాన పడుతున్నా లెక్కచెయ్యక ఆహ్వానితులంతా వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సినిమాలోని ప్రధాన నాయిక బి. సరోజాదేవి రాలేదు. ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్లలో అక్కినేని, బిఎన్ రెడ్డి, డి. మధుసూదనరావు, గుమ్మడి, జగ్గయ్య, సావిత్రి, కృష్ణకుమారి, షావుకారు జానకి, రేలంగి, గిరిజ, మాలతి, పి. సుశీల, జిక్కి, ఎస్. జానకి, దేవిక, చక్రపాణి, తాపీ చాణక్య, తాతినేని ప్రకాశరావు, బిఎ సుబ్బారావు, ఎవి సుబ్బారావు, ఎ.ఎం. రాజా, పేకేటి శివరామ్, శ్రీధర్ (డైరెక్టర్), బి. నాగిరెడ్డి, చిత్తూరు నాగయ్య, జెమిని గణేశన్, వీనస్ ఫిలిమ్స్ కృష్ణమూర్తి, నవయుగ ఫిలిమ్స్ శ్రీనివాసరావు, అలంకార్ థియేటర్ ఎస్. విష్ణురావు తదితరులు ఉన్నారు.                              

No comments: