Saturday, June 30, 2012

క్లైమాక్స్ సీన్లలో 'ఒక్కడినే'


నారా రోహిత్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్‌గా శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో గులాబీ మూవీస్ పతాకంపై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న 'ఒక్కడినే' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ సందర్భంగా సి.వి.రెడ్డి మాట్లాడుతూ 'మా సినిమాలోని పతాక సన్నివేశాల చిత్రీకరణని ఈ నెల 27 నుంచి రామోజీ ఫిలింసిటిలో ప్రారంభించా. చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. జూలై 3 వరకూ జరిగే షూటింగ్‌తో మూడు పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది. ఆ మూడు పాటల్లో ఐటెం సాంగ్‌ని హైదరాబాద్‌లోను, మిగిలిన రెండు డ్యూయెట్లని విదేశాల్లో జూలై ప్రథమార్థంలోగా చిత్రీకరిస్తాం. ప్రస్తుతం శబ్దాలయా థియేటర్‌లో డబ్బింగ్ జరుగుతోంది' అని తెలిపారు.
నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, ఫొటోగ్రఫీ: ఆండ్ర బాబు, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.

No comments: