Saturday, June 30, 2012

'కొరియర్ బోయ్ కళ్యాణ్'గా నితిన్

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కొరియర్ బోయ్ కళ్యాణ్'. తమిళంలో ఈ చిత్రం 'తమిళ్ సెల్వనుం తనియార్ అంజలుం' పేరుతో తెరకెక్కనుంది. గౌతమ్ వాసుదేవమీనన్ నిర్మాత. ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. నిర్మాత మాట్లాడుతూ "నేను దర్శకత్వం వహించిన 'ఏమాయ చేసావె' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు నితిన్‌తో తీస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. భాషలకు అతీతంగా అందరి అభినందనల్ని అందుకుంటుంది. ప్రేమ, యాక్షన్, కామెడీ అన్నీ సమపాళ్ళలో ఉన్న కథ ఇది. కథ నాకు బాగా నచ్చింది. నా గత చిత్రాల్లో మంచి పాటలు పాడిన కార్తీక్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్నారు. కీలక పాత్రల్లో జై ,సంతానం, విటివి గణేష్ నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది'' అని అన్నారు.

No comments: