Monday, June 4, 2012

కార్తిక స్థానంలో తాప్సీ

విశాల్ సరసన నాయికగా తాప్సీ నటించనుంది. సుందర్ సి. దర్శకత్వంలో రూపొందబోతున్న 'మద గజ రాజా' (ఎం.జి.ఆర్.) చిత్రంలో మొదట నాయికగా కార్తిక ఎంపికైంది. అయితే మొదట ఆమె విన్న స్క్రిప్టుకూ, తర్వాత మార్పులు చేసిన స్క్రిప్టుకూ చాలా తేడా ఉండటమే ఆమె ఆ సినిమా నుంచి తప్పుకోడానికి కారణమని వినిపిస్తోంది. మొదట విశాల్ కోసం దర్శకుడు మూడు పాత్రలు సృష్టించాడు. తర్వాత వాటి స్థానంలో ఒకే పాత్రను పెట్టాడు. ఆ పాత్ర సరసన ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించాలని డైరెక్టర్ చెప్పడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాలని కార్తిక నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమె బదులు ఆ స్థానంలోకి తాప్సీ వచ్చిందనేది కోలీవుడ్ వర్గాల భోగట్టా. రెండో హీరోయిన్ కేరక్టర్‌కి నిర్మాతలు కొత్తమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారు. మరో హీరోయిన్ బదులు తాప్సీ రావడం కోలీవుడ్‌లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదివరకు అజిత్ హీరోగా విష్ణువర్థన్ రూపొందించ తలపెట్టిన సినిమాలోనూ రిచా గంగోపాధ్యాయ్ స్థానంలో ఆమె ఎంపికైంది.

No comments: