Friday, June 15, 2012

తమ్మారెడ్డి భరద్వాజ్ 'ప్రతిఘటన'

ఆరేళ్ల క్రితం సింధూ తులాని నాయికగా 'పోతే పోనీ' చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ మళ్లీ ఇప్పటివరకు సినిమాల జోలికి పోలేదు. తిరిగి చరిత చిత్ర పతాకంపై సినిమాలు తీయడానికి ఆయన ఉద్యుక్తులవుతున్నారు. ఇకనుంచీ ఏడాదికి ఏకంగా ఆరు సినిమాలు నిర్మిస్తానని ఆయన ప్రకటించారు. "ఈ ఏడాది డిసెంబర్‌లోగా మూడు సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. నా దర్శకత్వంలో 'ప్రతిఘటన' అనే సినిమా చేయబోతున్నా. ఒరిస్సాలో జరిగిన ఓ నిజ సంఘటన ఈ సినిమా కథకు ఆధారం. అలాగే శివ అనే దర్శకుణ్ణి పరిచయం చేస్తూ 'ధ్యేయం' అనే సినిమాని నిర్మించబోతున్నా. ఈ సినిమాల ద్వారా ఎక్కువమంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నా'' అని చెప్పారు. కాగా ప్రతి ఏటా ఓ చారిటీ షో నిర్వహించి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు భరద్వాజ్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 16న సత్యసాయి నిగమాగమంలో ఓ షోని నిర్వహిస్తున్నామనీ, ఇందులో గీతామాధురి, శ్రీకృష్ణ, మాళవిక, పర్ణిక వంటి గాయనీ గాయకుల పాటలు, శివారెడ్డి మిమిక్రీ, శ్రీనివాసరెడ్డి కామెడీ స్కిట్స్ ఉంటాయన్నారు. దీని ద్వారా వచ్చే డబ్బును గుంటూరులోని ఓ పాఠశాల అభివృద్ధికి కేటాయిస్తామని భరద్వాజ్ చెప్పారు.

No comments: