Friday, June 8, 2012

బాలకృష్ణ ఇంట్లో చోరీ

ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ ఇంట్లో చోరీ జరిగింది. 35 తులాల బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గతనెల 24వ తేదీన బాలకృష్ణ సతీమణి వసుంధర, పిల్లలు విహారయాత్రలకు వెళ్లారు. 30వ తేదీన బాలకృష్ణ షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. అయితే వసుంధర వెళ్లేటప్పుడు తన సోదరి భర్త ప్రసాద్‌కు తాళం ఇచ్చి ఇంట్లో కొన్ని మరమ్మతులు చేయించాలని కోరారు. ప్రసాద్ తన భార్యతో కలసి బుధవారం బాలకృష్ణ ఇంటికెళ్లారు. అక్కడి నుంచి వసుంధరకు ఫోన్ చేసి ఎక్కడ మరమ్మతులు చేయించాలో అడిగారు. ఆ సమయంలో వసుంధర తాను ఒక గదిలో బంగారు ఆభరణాలు ఉంచాననీ, ఒకసారి చూడాలని కోరారు. ఆ గదిలోకి వెళ్లి చూస్తే ఆభరణాలు కనిపించలేదు. దాంతో ఇంట్లో చోరీ జరిగిందని భావించిన ప్రసాద్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments: