Monday, June 25, 2012

జూలైలో 'ఏం బాబూ లడ్డూ కావాలా'


శివాజీ హీరోగా గాంధీ మనోహర్ దర్శకత్వంలో వనితాస్ డ్రీమ్‌లైన్ సంస్థ నిర్మిస్తున్న 'ఏం బాబూ లడ్డూ కావాలా' చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతిధి అగర్వాల్, రచనా మౌర్య కథానాయికలు.
ఈ సినిమా గురించి శివాజీ మాట్లాడుతూ 'సాధారణంగా మా చిత్రానికి స్క్రిప్ట్, ఆర్టిస్టులు బాగా సెట్ అయ్యారని అంటుంటారు. కానీ ఈ చిత్రానికి నిర్మాత కరెక్ట్‌గా సెట్ అయ్యారు. దర్శకుడు గాంధీ టైటిల్‌కు తగ్గట్లు ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు. సంగీత దర్శకురాలు శ్రీలేఖ, గీత రచయిత భాస్కరభట్ల నాకు మరోసారి సూపర్‌హిట్ ఆడియోను అందించారు. కుటుంబసమేతంగా చూసి, ఎంజాయ్ చేసే సినిమా ఇది' అన్నారు.
నిర్మాత టి.జనార్థన్ మాట్లాడుతూ 'గత వారం విడుదలైన మా సినిమాలోని అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు ముందు ఆడియో హిట్ కావడం శుభ పరిణామం. ఈ సందర్భంగా శ్రీలేఖగారికి, భాస్కరభట్లగారికి నా ధన్యవాదాలు' అన్నారు.
దర్శకుడు గాంధీ మనోహర్ మాట్లాడుతూ ' వినోదాత్మక చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో సినిమాని విడుదల చేస్తాం' అన్నారు. ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్, జీవా, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, రాంజగన్, తిరుపతి ప్రకాష్, జి.టి.రావు, భావన, లక్ష్మి, లహరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: వాసు, కూర్పు: నాగిరెడ్డి, కళ: విజయకృష్ణ, నిర్మాణ సారథ్యం: చందక రాజ్‌కుమార్.

No comments: