Wednesday, November 2, 2011

'బద్రినాథ్' బాధ నుంచి తేరుకున్న దర్శకుడు

అల్లు అర్జున్ కెరీర్‌లోనే నెంబర్‌వన్ సినిమా అవుతుందని ఎంతగానో ఆశించిన 'బద్రినాథ్' బాక్సాఫీస్ వద్ద ఫెయిలవడంతో మానసికంగా కలతచెందిన ఏస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఇప్పుడు ఆ బాధనుంచి కోలుకుని తదుపరి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా బాక్సాఫీసులు బద్దలుకొట్టే సినిమా తీయాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను చెప్పిన కథకి ఇప్పటికే రాంచరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. 'మగధీర'లో ప్రేమికులుగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న రాంచరణ్, కాజల్ అగర్వాల్ మరోసారి ఈ సినిమాలో జంటగా నటించనున్నారనే వార్తలు రావడంతో అందరి దృష్టీ ఈ ప్రాజెక్టు పైకి మళ్లింది. కొంత కాలంగా వినాయక్ వద్దే పనిచేస్తున్న ఆకుల శివ ఈ సినిమాకి కథని అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నాడు. 'బద్రినాథ్' చేదు అనుభవాన్ని ఈ సినిమాతో చెరిపివేయాలనే పట్టుదలతో ఉన్న వినాయక్ దీని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. 'మగధీర'లో ఎమోషనల్, లవ్ సీన్లలో రాంచరణ్ కనపర్చిన ప్రతిభావంతమైన అభినయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్టులో ఇటు లవ్‌నీ, అటు ఎమోషన్స్‌నీ సమపాళ్లలో మేళవిస్తున్నట్లు సమాచారం. 

No comments: