Thursday, November 10, 2011

భార్యాభర్తలుగా ఎస్పీ బాలు, ఆమని

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ నటిగా గతంలో నంది అవార్డు పొందిన ఆమని జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పేరు 'దేవస్థానం'. కామెడీ సినిమాల రచయితగా పేరుపొందిన జనార్ధన మహర్షి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సర్వేజనా సుఖినోభవంతు ఫిలిమ్స్ బేనర్‌పై తయారవుతున్న ఇందులో ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ ఓ దేవాలయ ధర్మకర్తగా నటిస్తుంటే, బాలు ఓ మధ్యతరగతి కుటుంబీకునిగా నటిస్తున్నారు. బాలుకు ఇల్లే దేవాలయం. ఆయన భార్యగా ఆమని నటిస్తోంది. విశ్వనాథ్, బాలు మధ్య జరిగే హ్యూమన్ ఎమోషనల్ డ్రామానే 'దేవస్థానం' అని  జనార్దన మహర్షి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పలు దేవాలయాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. కొంత విరామంతో మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్న ఆమని గతంలో బాలు నిర్మించిన 'శుభసంకల్పం' సినిమాలో హీరోయిన్‌గా నటించి, ఉత్తమ నటిగా నంది అవార్డు సాధించింది. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది విశ్వనాథ్. ఇప్పుడు ఆ ముగ్గురూ కలిసి నటిస్తుండటం ప్రత్యేకతని సంతరించుకున్న అంశం. ఈ కాంబినేషన్‌లో వస్తున్న 'దేవస్థానం' ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాల్సిందే.

No comments: