Saturday, October 29, 2011

న్యూస్: పరశురాంకి అగ్ని పరీక్ష

దర్శకుడు పరశురాం అగ్ని పరీక్షని ఎదుర్కొంటున్నాడు. అతను రూపొందించిన తాజా చిత్రం 'సోలో' 2011 నవంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరీ జగన్నాథ్ శిష్యుడూ, సమీప బంధువూ అయిన పరశురాం 'యువత'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిఖిల్ హీరోగా నటించిన ఆ సినిమా ఓ మోస్తరు హిట్టయి, అతడికి రవితేజతో 'ఆంజనేయులు' సినిమాని తీసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ గోల్డెన్ ఛాన్స్‌ని అతను సద్వినియోగం చేసుకోలేక పోయాడు. 'ఆంజనేయులు' ఫ్లాపైంది. ఫలితంగా పరశురాంకి పెద్ద హీరోల నుంచి అవకాశాలు రాలేదు. దాంతో 'బాణం' ఫేం నారా రోహిత్‌తో సర్దుకుపోయి 'సోలో' సినిమాని చేశాడు. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ నాయికగా నటించిన ఈ సినిమాకి 'ఎ సాలిడ్ లవ్‌స్టోరీ' అనే ట్యాగ్ లైన్ పెట్టాడు పరశురాం. టైటిల్‌కు తగ్గట్లు ఇందులో లవ్‌స్టోరీతో పాటు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉన్నాయని అతను తెలిపాడు. ఇటీవలి కాలంలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ జోరుతో ఊపు తగ్గిన మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్‌నిచ్చాడు. ఈ సినిమాతో తన కెరీర్ సాలిడ్‌గా మారుతుందనే పరశురాం ఆశలు నెరవేరుతాయా?

No comments: