Wednesday, October 19, 2011

చివరి పాట చిత్రీకరణలో 'మొగుడు'

గోపీచంద్, తాప్సీ జంటగా కృష్ణవంశీ రూపొందిస్తున్న 'మొగుడు' సినిమా షూటింగ్ ఓ పాట మినహా పూర్తయింది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి బేబి భవ్య సమర్పకురాలు. సంగీత దర్శకుడిగా బాబూశంకర్ పరిచయమవుతున్నారు. సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్యశాస్త్రి పాటలు రాశారు.
ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలైన పాటలకి అనూహ్యమైన స్పందన వచ్చిందని నిర్మాత బుజ్జి తెలిపారు. "మిగిలి ఉన్న పాటను బుధవారం (అక్టోబర్ 19) నుంచి చిత్రీకరిస్తున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. కృష్ణవంశీ సినిమా అంటే అలకలు, అల్లర్లు, అందాలు, బంధాలు, భావాలు, భావోద్వేగాలు, సరసాలు, సంప్రదాయాలు కలగలసి ఉంటాయి. అలాంటి కోవలోనే వస్తున్న సినిమా 'మొగుడు'. ఇదొక అందమైన కుటుంబ కథ. అలాగని ఫ్యామిలీ ఆడియెన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా కాదిది. క్లాస్, మాస్ తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. నటునిగా గోపీచంద్‌లోని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారు. ఆయన కెరీర్‌లో ఈ సినిమా మైలురాయి అవుతుంది. రాజేంద్రప్రసాద్ చేసిన కీలక పాత్ర సినిమాకే హైలైట్. నటిగా తాప్సీని ఉన్నత స్థాయిలో నిలిపే సినిమా ఇది. శ్రద్ధాదాస్ మరో నాయికగా నటించింది. నరేశ్, రోజా భార్యాభర్తల పాత్రల్లో ఆకట్టుకుంటారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్, కూర్పు: గౌతంరాజు.

No comments: