Saturday, November 21, 2015

Greatness of MS Subbulakshmi

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఘనత

ఇవాళ్టి రోజుల్లో ఓ సంగీత కార్యక్రమం ద్వారా రూ. లక్ష రూపాయలు వసూలు చేయడం తలకు మించిన భారంగా మారుతుంటే, ఎప్పుడో సుమారు ఏడు దశాబ్దాల క్రితమే ఓ కచ్చేరీ ద్వారా రూ. లక్ష రూపాయలు వసూలు కావడం గొప్ప విషయాల్లోనే గొప్ప విషయం. ప్రసిద్ధ దక్షిణాది గాయనీమణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి 1947 డిసెంబర్‌లో బొంబాయిలో నాలుగు గంటలసేపు సంగీత కచ్చేరీ చేశారు. ఈ ప్రదర్శన ద్వారా రూ. లక్ష వసూలు కావడం ఆ రోజుల్లో రికార్డు. దాక్షిణాత్య విద్యా వ్యాపక సంఘం వాళ్ల భవన నిర్మాణ నిధికి విరాళాలు వసూలు చేయడంలో భాగంగా ఈ కచ్చేరీని ఏర్పాటు చేశారు. మురార్జీ దేశాయ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి బరోడా మహారాజు, ఆయన భార్య సీతాదేవి, బొంబాయి నగరంలో పేరుపొందినవాళ్లు అనేకమంది హాజరయ్యారు. సుబ్బులక్ష్మి గాన ప్రవాహంలో మునిగితేలారు.

No comments: