Saturday, December 10, 2011

జగపతిబాబుకి లలితకళాభూషణ బిరుదు

కళలను, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డా.టి.సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన టిఎస్ఆర్ లలితకళాపరిషత్ నరసరావుపేట జోన్ డిసెంబర్ 11న ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో జగపతిబాబును లలితకళాభూషణ బిరుదుతో సత్కరించనున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి చెప్పారు. అలాగే మూడు తరాల చలనచిత్ర ప్రముఖుడు, దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో వాణిశ్రీ, బ్రహ్మానందం, డా.రాజశేఖర్, జీవిత, ప్రియమణి, శియాగౌతమి, గిరిబాబు, గీతాంజలి, పరుచూరి వెంకటేశ్వరరావు, పి.విజయబాబు తదితరులు పాల్గొంటారు. సాలూరి వాసూరావు, నాగూర్‌బాబు, అంజనా సౌమ్య పాల్గొనగా ఎల్.ఆర్.ఈశ్వరి సినీ సంగీత విభావరి జరుగుతుంది.

No comments: