Tuesday, November 16, 2010

సినిమా: శివాజీకి 'లోకమే కొత్తగా' కనిపిస్తోంది!

శివాజీకి 'లోకమే కొత్తగా' కనిపిస్తోంది. టీవీ యాంకర్ నుంచి సినీ నటుడిగా మారిన అతను 'తాజ్‌మహల్' సినిమాతో నిర్మాతగానూ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. కన్నడంలో అదే పేరుతో వచ్చి సూపర్‌హిట్టయిన సినిమాకి ఆ సినిమా రీమేక్. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ని నెలకొల్పి హీరోగా నటిస్తూ 'తాజ్‌మహల్'ని నిర్మించిన శివాజీ పన్నెండేళ్ల కెరీర్‌లో కూడబెట్టిన సొమ్మునంతా ఆ సినిమాకే వెచ్చించాడు. కానీ ఆ సినిమా అట్టర్‌ఫ్లాపై అతడికి వేదననే మిగిల్చింది. ఆ అనుభవంతో మళ్లీ సినీ నిర్మాణం జోలికి వెళ్లకూడదనీ, నటుడిగానే కొనసాగాలనీ అతను నిర్ణయించుకున్నాడు. ఇటీవలే 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సినిమాని హీరోగా ఎంజాయ్ చేసిన అతను తాజాగా 'లోకమే కొత్తగా' సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆర్తీ అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ నాయిక. చాలా కాలం గ్యాప్‌తో ఆమె ఈ సినిమా చేస్తోంది. నిర్మాతగా సంపాదించిన అనుభవం తర్వాత నటుడి పని హాయిగా ఉందని అతను భావిస్తున్నాడు. అంటే మున్ముందు శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నుంచి సినిమాలు వచ్చే అవకాశాలు లేనట్లే.   

No comments: