Friday, December 25, 2015

Society: People need heroes

ప్రజా నాయకులు రావాలి

నేడు దేశంలో అధిక లాభార్జనపరులు, అక్రమ నిల్వదారులు, బ్లాక్ మార్కెటీర్లు, కల్తీదారులు, దురాశాపరులైన వడ్డీ వ్యాపారులు, పచ్చి నిరంకుశులైన భూస్వాములు, అవినీతిపరులైన అధికారులు, స్వప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా ఒడికట్టే రాజకీయ నాయకులు విశృంఖలంగా స్వైర విహారం సాగిస్తూ ప్రజా జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.
నేటి దోపిడీదారి వ్యవస్థకు ఎప్పుడు కాలం చెల్లుతుందో తెలీకుండా ఉంది. ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్నా, దాన్నుంచి విముక్తి చెందాలనే కాంక్ష బలంగా ఉన్నా దిశా నిర్దేశం చేసి, వాళ్లకు నాయకత్వం వహించే ధైర్యవంతులే లేకుండా పోయారు. దోపిడీదారులకు ఒక న్యాయం, వాళ్లను ఎదిరించి పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచిన వాళ్లకు మరొక న్యాయం జరుగుతూ వస్తుండటం వల్ల ప్రజా నాయకుల్లో ఒక రకమైన స్తబ్దత ఏర్పడినట్లు కనిపిస్తోంది.
అయినా అక్రమంతో, నిరంకుశత్వంతో రాజీపడటం, సహించి ఊరుకోవడం ప్రజలపై చూపించే ఘోర అపచారమే అవుతుంది. రాజీలేని పోరాట మార్గాన్ని అనుసరిస్తూ అరాచక శక్తుల దౌర్జన్యాల్ని ఎదుర్కోగల నాయకులు ప్రజల నుంచి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments: