Saturday, May 26, 2012

ఆ పాత్ర చేయడం లేదు

శ్రీదేవి హీరోయిన్‌గా కె. రాఘవేంద్రరావు బాలీవుడ్‌లో రూపొందించిన 'హిమ్మత్‌వాలా' (కృష్ణ 'ఊరికి మొనగాడు'కు రీమేక్) ఎంత సంచలనం సృష్టించిందో అప్పటివాళ్లకు బాగా తెలుసు. ఆ సినిమాలో శ్రీదేవి అందచందాలు, అభినయానికి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ సినిమాని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే 'హౌస్‌ఫుల్ 2'తో హిట్ కొట్టిన సాజిద్‌ఖాన్ ఆ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. అందులో శ్రీదేవి చేసిన పాత్రను రీమేక్‌లో తమన్నా చేయబోతున్నదని వార్తలు వచ్చాయి. అయితే వాటికి తమన్నా ఖండించింది. "నిర్మాత వశు భగ్నాని నన్ను సంప్రదించిన మాట వాస్తవం. అయితే అది 'హిమ్మత్‌వాలా' రీమేక్ కోసం కాదు. రణబీర్ కపూర్ లేదా అజయ్ దేవగన్ హీరోగా నిర్మించే సినిమాలో చేసేందుకు నన్ను అడిగారు. ఇప్పటివరకు ఏ విషయమూ ఫైనల్ కాలేదు'' అని చెప్పింది. ఇటీవలే తెలుగులో 'రచ్చ' హిట్‌ని ఎంజాయ్ చేసిన ఆమె రామ్ సరసన నటించిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రంతో జూన్ ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

No comments: