Tuesday, June 29, 2010

Mahesh movie launched


మహేశ్ హీరోగా నటించే కొత్త సినిమా లాంచనంగా సోమవారం మొదలయ్యింది. శ్రీను వైట్ల ఈ సినిమాకి డైరెక్టర్. ఇదివరకు వెంకటేశ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 'నమో వెంకటేశ' ఫిలింని తీసిన 16 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. మహేశ్ అన్న రమేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరించే శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ (ప్రై.) లిమిటెడ్ ఈ సినిమాని సమర్పిస్తోంది. సోమవారం (జూన్ 28) ఉదయం 7.20 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో మహేశ్ సరసన 'ఏ మాయ చేసావె' ఫేం సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నానని డైరెక్టర్ శ్రీను వైట్ల తెలిపారు. ఈ సినిమాకి రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. తొలిసారి మహేశ్, వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

No comments: