Friday, December 7, 2012

మాధవపెద్ది వెంకటరామయ్య (1898-1951)


రంగస్థలంపై ఉదాత్త నటనకు భాష్యం చెప్పిన మాధవపెద్ది వెంకటరామయ్యకు శివాజీ, దుర్యోధనుడు, రంగారాయుడు పాత్రలు ఎంతో పేరు తెచ్చాయి. దుర్యోధనుడిని అభిజాత్యం ఉన్న శౌర్యవంతునిగా, శాస్త్ర విషయ సంపన్నుడిగా, స్వశక్తి మీద నమ్మకం ఉన్న రారాజుగా తొలిసారి రంగస్థలం మీద మలిచింది మాధవపెద్దే. 'ప్రతాపరుద్రీయం'లో విద్యానాథుని పాత్రను ధరించి ఆ పాత్రకు కూడా అజరామరత్వం కల్పించారు.
మాధవపెద్ది సినిమాల్లోనూ రాణించారు. 'ద్రౌపదీ మాన సంరక్షణము' (1936)లో శిశుపాలుడు, 'సతీ తులసి' (1936)లో శివుడు, 'విజయదశమి' (1937)లో కీచకుడు, 'నల దమయంతి' (1938)లో నలుడు, 'పార్వతీ కల్యాణం' (1939)లో శివుడు, 'చంద్రహాస' (1941)లో దుష్టబుద్ధి వంటి పాత్రల్ని గొప్పగా పోషించారు.
ఆయన గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1898లో జన్మించారు. 1951 మార్చి 19న తెనాలిలో మరణించారు.

No comments: